రాజధానికి ద్రోహం చేసినోళ్లకు గుణపాఠం చెప్పాలి- అమరావతి రైతుల ఇంటింటి ప్రచారం - Amaravati Farmers Election Campaign - AMARAVATI FARMERS ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 3:10 PM IST
Amaravati Farmers Door To Door Election Campaign: అమరావతికి ద్రోహం చేసిన నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలంటూ రాజధాని రైతులు ఇంటింటి ప్రచారం ముమ్మం చేశారు. గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో ఓటర్లను కలిసి రాజధాని అమరావతికి జరిగిన అన్యాయన్ని వివరించారు. అమరావతికి మద్దతు తెలిపే నాయకులను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడ్ని గెలిపించుకుందామని కోరారు.
"మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డి మాపై అనేక రకాలు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశాడు. అమరావతికి ద్రోహం చేసిన జగన్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ నేనే వస్తా అంటున్నాడు. ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా అంటున్నాడు. ఆనాడు ఇల్లు ఇక్కడే కట్టుకున్నానని మమ్మల్ని మోసం చేసిన సీఎం మళ్లీ విశాఖపట్నం ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడ్ని గెలిపించుకుని రాజధానికి ద్రోహం చేసిన నాయకులకు తగిన గుణపాఠం చెప్తాం." - అమరావతి రైతులు