ETV Bharat / technology

ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయోచ్​.. ఇకపై ట్రాఫిక్​ టెన్షన్​కు చెక్​..!

త్వరలో పలకరించనున్న గాల్లో ఎగిరే టాక్సీలు- 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే..!

author img

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Flying Taxis
Flying Taxis (BLR Airport X)

Flying Taxis Launch: ప్రస్తుతం పెరుగుతున్న జనాభా కారణంగా ట్రాఫిక్​ సమస్య విపరీతంగా వేధిస్తోంది. నగరవాసులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఎన్ని ఫ్లై ఓవర్లు, స్కై వేలు, హై వేలు, అండర్‌పాస్‌లు నిర్మించినా పెరుగుతున్న జనాభాకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సిద్ధమైంది.

త్వరలోనే ట్రాఫిక్‌ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా ఎగిరే ట్యాక్సీలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడతాయని పేర్కొంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు తీవ్రమైన రద్దీతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు నగరవాసులకు ట్రాఫిక్​ సమస్య నుంచి రిలీఫ్​ లభించనుంది.

ఈ నేపథ్యంలో తక్కువ ఎత్తులో పర్యావరణరహిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు విషయాన్ని కంపెనీ సమాజిక మాధ్యమం ఎక్స్​ వేదికగా వెల్లడించింది. విమానాశ్రయం, ఎలక్ట్రానిక్‌ సిటీ.. ఇలా ఎక్కువ ట్రాఫిక్‌ ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడతాయని పేర్కొంది.

"ప్రస్తుతం ఇందిరానగర్‌ నుంచి ఎయిర్​పోర్ట్​కు వెళ్లాలంటే 1.50 నిమిషాలు పడుతోంది. అదే ఎగిరే ట్యాక్సీలతో అయితే కేవలం 5 నిమిషాలు చాలు" అని సార్లా ఏవియేషన్‌ సీఈఓ అడ్రియన్‌ ష్మిత్‌ అన్నారు. ఇదో గేమ్‌ ఛేంజర్‌గా ఆయన అభివర్ణించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఆయన తెలిపారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చేందుకు 2- 3 సంవత్సరాలు పడుతుందన్నారు.

విమానాలు, హెలికాప్టర్లతో పోల్చుకుంటే ఈ ఎగిరే ట్యాక్సీలు చాలా డిఫరెంట్​గా ఉంటాయి. ఇవి సాధారణ హెలికాప్టర్ల కంటే వేగంగా ప్రయాణించడమే కాకుండా వాతావరణానికి ఎలాంటి హాని కలిగించవు. కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నారు. తీవ్రమైన ట్రాఫిక్​ రద్దీ సమస్యతో ఇబ్బంది ఎదుర్కొంటున్న బెంగళూరు నగరవాసులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మరోవైపు అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా సేవలు తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడుతూ, పర్యావరణానికి మేలు చేసేవి కావడంతో అందరూ వీటిపై మొగ్గు చూపుతున్నారు.

త్వరలో మార్కెట్లోకి యాపిల్​ స్మార్ట్​ గ్లాసెస్​- మెటాకు పోటీగా అదిరే ఫీచర్లు..!

ఈ స్కిల్స్​ లేకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జాబ్స్ ఔట్..!- విశ్లేషకుల హెచ్చరిక

Flying Taxis Launch: ప్రస్తుతం పెరుగుతున్న జనాభా కారణంగా ట్రాఫిక్​ సమస్య విపరీతంగా వేధిస్తోంది. నగరవాసులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఎన్ని ఫ్లై ఓవర్లు, స్కై వేలు, హై వేలు, అండర్‌పాస్‌లు నిర్మించినా పెరుగుతున్న జనాభాకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సిద్ధమైంది.

త్వరలోనే ట్రాఫిక్‌ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా ఎగిరే ట్యాక్సీలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడతాయని పేర్కొంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు తీవ్రమైన రద్దీతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు నగరవాసులకు ట్రాఫిక్​ సమస్య నుంచి రిలీఫ్​ లభించనుంది.

ఈ నేపథ్యంలో తక్కువ ఎత్తులో పర్యావరణరహిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు విషయాన్ని కంపెనీ సమాజిక మాధ్యమం ఎక్స్​ వేదికగా వెల్లడించింది. విమానాశ్రయం, ఎలక్ట్రానిక్‌ సిటీ.. ఇలా ఎక్కువ ట్రాఫిక్‌ ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడతాయని పేర్కొంది.

"ప్రస్తుతం ఇందిరానగర్‌ నుంచి ఎయిర్​పోర్ట్​కు వెళ్లాలంటే 1.50 నిమిషాలు పడుతోంది. అదే ఎగిరే ట్యాక్సీలతో అయితే కేవలం 5 నిమిషాలు చాలు" అని సార్లా ఏవియేషన్‌ సీఈఓ అడ్రియన్‌ ష్మిత్‌ అన్నారు. ఇదో గేమ్‌ ఛేంజర్‌గా ఆయన అభివర్ణించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఆయన తెలిపారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చేందుకు 2- 3 సంవత్సరాలు పడుతుందన్నారు.

విమానాలు, హెలికాప్టర్లతో పోల్చుకుంటే ఈ ఎగిరే ట్యాక్సీలు చాలా డిఫరెంట్​గా ఉంటాయి. ఇవి సాధారణ హెలికాప్టర్ల కంటే వేగంగా ప్రయాణించడమే కాకుండా వాతావరణానికి ఎలాంటి హాని కలిగించవు. కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నారు. తీవ్రమైన ట్రాఫిక్​ రద్దీ సమస్యతో ఇబ్బంది ఎదుర్కొంటున్న బెంగళూరు నగరవాసులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మరోవైపు అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా సేవలు తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడుతూ, పర్యావరణానికి మేలు చేసేవి కావడంతో అందరూ వీటిపై మొగ్గు చూపుతున్నారు.

త్వరలో మార్కెట్లోకి యాపిల్​ స్మార్ట్​ గ్లాసెస్​- మెటాకు పోటీగా అదిరే ఫీచర్లు..!

ఈ స్కిల్స్​ లేకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జాబ్స్ ఔట్..!- విశ్లేషకుల హెచ్చరిక

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.