ETV Bharat / technology

టాటా ఎలక్ట్రానిక్స్ గోదాములో అగ్నిప్రమాదం- భారీగా ఎగసిపడిన మంటలు - Fire Accident at Tata PLANT

author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

Fire Accident at Tata Electronics Factory: టాటా ఎలక్ట్రానిక్స్‌ తయారీ యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగింది. దీనిపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

Fire Accident at Tata Electronics Factory
Fire Accident at Tata Electronics Factory (ETV Bharat National Desk)

Fire Accident at Tata Electronics Factory: తమిళనాడులోని హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం సెల్‌ఫోన్ తయారీ విభాగంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశాయి. తయారీ యూనిట్ ఉద్యోగులను సురక్షితంగా బయటకు తరలించటంతో ఈ ప్రమాందలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

భారీగా ఆస్తినష్టం: ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే కోట్ల రూపాయల విలువైన ఆస్తినష్టం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం నాగమంగళం సమీపంలోని ఉద్నపల్లిలో కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్‌లో ఉదయం 5:30 గంటలకు మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఎక్కడ చూసినా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఉద్యోగులు, స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభం: ఈ ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక దళానికి చెందిన అనేక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తయారీ యూనిట్ ఉద్యోగులను అగ్నిమాపక సిబ్బంది బయటకు సేఫ్​గా తరలించారు. ఇప్పటి వరకు ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మొదటి షిఫ్ట్‌లో సుమారు 1,500 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారని సమాచారం.

అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TEPL) ప్రతినిధి ఈ ఘటనపై స్పందించారు. ఉద్యోగులందరికీ భద్రత కల్పించేందుకు ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌లను పాటించామని అన్నారు. అందరినీ సురక్షితంగా బయటకు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.

శ్వాసకోశ సమస్యలతో ముగ్గురు: ఈ ప్రమాద సమయంలో తరలింపులో ముగ్గురు వ్యక్తులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఈ స్థితిలో ముగ్గురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి నిలకడగా ఉంది. పరిస్థితిని అదుపు చేసేందుకు 100 మందికి పైగా పోలీసులను మోహరించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు.

కారు ఓనర్​కు రూ.16.95 లక్షలు చెల్లించాల్సిందే!- టాటా మోటార్స్‌కు కోర్టు ఆదేశం - Hyderabad Nexon EV Fire Case

భారీ మైలేజీతో 'నెక్సాన్‌ ఐసీఎన్‌జీ' లాంచ్- ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! - Tata Nexon iCNG Launched

Fire Accident at Tata Electronics Factory: తమిళనాడులోని హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం సెల్‌ఫోన్ తయారీ విభాగంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశాయి. తయారీ యూనిట్ ఉద్యోగులను సురక్షితంగా బయటకు తరలించటంతో ఈ ప్రమాందలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

భారీగా ఆస్తినష్టం: ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే కోట్ల రూపాయల విలువైన ఆస్తినష్టం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం నాగమంగళం సమీపంలోని ఉద్నపల్లిలో కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్‌లో ఉదయం 5:30 గంటలకు మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఎక్కడ చూసినా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఉద్యోగులు, స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభం: ఈ ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక దళానికి చెందిన అనేక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తయారీ యూనిట్ ఉద్యోగులను అగ్నిమాపక సిబ్బంది బయటకు సేఫ్​గా తరలించారు. ఇప్పటి వరకు ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మొదటి షిఫ్ట్‌లో సుమారు 1,500 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారని సమాచారం.

అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TEPL) ప్రతినిధి ఈ ఘటనపై స్పందించారు. ఉద్యోగులందరికీ భద్రత కల్పించేందుకు ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌లను పాటించామని అన్నారు. అందరినీ సురక్షితంగా బయటకు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.

శ్వాసకోశ సమస్యలతో ముగ్గురు: ఈ ప్రమాద సమయంలో తరలింపులో ముగ్గురు వ్యక్తులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఈ స్థితిలో ముగ్గురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి నిలకడగా ఉంది. పరిస్థితిని అదుపు చేసేందుకు 100 మందికి పైగా పోలీసులను మోహరించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు.

కారు ఓనర్​కు రూ.16.95 లక్షలు చెల్లించాల్సిందే!- టాటా మోటార్స్‌కు కోర్టు ఆదేశం - Hyderabad Nexon EV Fire Case

భారీ మైలేజీతో 'నెక్సాన్‌ ఐసీఎన్‌జీ' లాంచ్- ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! - Tata Nexon iCNG Launched

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.