ETV Bharat / state

'లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం నీచం - హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర' - Bandi Letter on srivari Laddu Issue

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Bandi Sanjay Letter on AP CM Chandrababu : తిరుమల లడ్డూ కల్తీ అంశం హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లే భావిస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్​ పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. లడ్డూ వివాదం విషయంలో సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు నిగ్గు తేలుతాయని అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఇతర పార్టీల నాయకులూ స్పందిస్తున్నారు.

Bandi Sanjay Letter on AP CM Chandrababu
Bandi Sanjay Letter on AP CM Chandrababu (ETV Bharat)

Union Minister Bandi Sanjay Letter on Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కల్తీ అంశం హిందువుల మనోభావాలను కలిచి వేస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్​ అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, గతంలో పట్టించుకోలేదని పేర్కొన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం నీచమని మండిపడ్డారు. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లే భావిస్తున్నానని ఆయన వివరించారు. ఈ మేరకు కేంద్రమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

'లడ్డూ తయారీ నెయ్యి కల్తీ చేసి క్షమించరాని నేరం చేశారు. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు నిగ్గు తేలుతాయి. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.' అని కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఏపీ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు లడ్డూ కల్తీ అంశంపై స్పందించారు.

తిరుమల ప్రసాదం కల్తీ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి : తిరుమల ప్రసాదంలో నాణ్యతపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని బీజేపీ సీనియర్​ నేత పొంగులేటి సుధాకర్​ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్​ చేశారు. సీబీఐ లాంటి సంస్థలతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. కోట్లాది మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. కల్తీకి ఎవరు కారణమైన తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

వైఎస్సార్​సీపీ ఇంత దారుణానికి పాల్పడుతుందని అనుకోలేదు : మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు వి.హనుమతంరావు డిమాండ్​ చేశారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఇంత దారుణానికి వడి గడుతుందని తాను ఊహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి వాడిన వాళ్లను దేవుడు కూడా క్షమించడని శాపనార్ధాలు పెట్టారు. వెంటనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​ షాలు జోక్యం చేసుకొని సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దేవుడికి అన్యాయం జరిగినందున ఏ పార్టీ అయినా విచారణ జరగాల్సిందేనని సూచించారు. ప్రపంచంలో ప్రఖ్యాతగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో చేప కొవ్వు, ఎద్దు కొవ్వుతో ప్రసాదం చేయడం ఏంటని ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా సరే దేవుడు వారిని ఊరికే వదిలిపెట్టడని వీహెచ్​ చెప్పారు.

'శ్రీవారి ఫొటోలను తొలగించేందుకు జగన్‌ అండ్‌ కో యత్నం’ : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్ - Union Ministers React On TTD Laddu

తిరుమల లడ్డూ వివాదం - రమణ దీక్షితులు కీలక వ్యాఖ్యలు - TIRUMALA LADDU CONTROVERSY

Union Minister Bandi Sanjay Letter on Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కల్తీ అంశం హిందువుల మనోభావాలను కలిచి వేస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్​ అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, గతంలో పట్టించుకోలేదని పేర్కొన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం నీచమని మండిపడ్డారు. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లే భావిస్తున్నానని ఆయన వివరించారు. ఈ మేరకు కేంద్రమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

'లడ్డూ తయారీ నెయ్యి కల్తీ చేసి క్షమించరాని నేరం చేశారు. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు నిగ్గు తేలుతాయి. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.' అని కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఏపీ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు లడ్డూ కల్తీ అంశంపై స్పందించారు.

తిరుమల ప్రసాదం కల్తీ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి : తిరుమల ప్రసాదంలో నాణ్యతపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని బీజేపీ సీనియర్​ నేత పొంగులేటి సుధాకర్​ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్​ చేశారు. సీబీఐ లాంటి సంస్థలతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. కోట్లాది మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. కల్తీకి ఎవరు కారణమైన తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

వైఎస్సార్​సీపీ ఇంత దారుణానికి పాల్పడుతుందని అనుకోలేదు : మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు వి.హనుమతంరావు డిమాండ్​ చేశారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఇంత దారుణానికి వడి గడుతుందని తాను ఊహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి వాడిన వాళ్లను దేవుడు కూడా క్షమించడని శాపనార్ధాలు పెట్టారు. వెంటనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​ షాలు జోక్యం చేసుకొని సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దేవుడికి అన్యాయం జరిగినందున ఏ పార్టీ అయినా విచారణ జరగాల్సిందేనని సూచించారు. ప్రపంచంలో ప్రఖ్యాతగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో చేప కొవ్వు, ఎద్దు కొవ్వుతో ప్రసాదం చేయడం ఏంటని ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా సరే దేవుడు వారిని ఊరికే వదిలిపెట్టడని వీహెచ్​ చెప్పారు.

'శ్రీవారి ఫొటోలను తొలగించేందుకు జగన్‌ అండ్‌ కో యత్నం’ : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్ - Union Ministers React On TTD Laddu

తిరుమల లడ్డూ వివాదం - రమణ దీక్షితులు కీలక వ్యాఖ్యలు - TIRUMALA LADDU CONTROVERSY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.