ETV Bharat / state

రేవంత్ రెడ్డికి అమిత్​ షా ఫోన్, అండగా ఉంటామని భరోసా - Amit shah Call To CM Revanth

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 10:19 PM IST

Union Home Minister Call To CM Revanth : రాష్ట్రంలో వరద తీవ్రతపై కేంద్రం స్పందించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం తరపున అన్ని రకాల సాయం అందిస్తామని అమిత్ షా భరోసా ఇచ్చారు.

Union Home Minister Call To CM Revanth
Union Home Minister Call To CM Revanth (ETV Bharat)

Union Home Minister Call To CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి రాష్ట్రంలో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అమిత్ షాకు సీఎం వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర హోంమంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

కేంద్రహోం మంత్రికి బండి సంజయ్ ఫోన్ : అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అమిత్ షాకు రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నష్టం భారీగా ఉందని వెంటనే ఎన్డీఆర్​ఎఫ్ బృందాలను పంపాలను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు అమిత్ షా ఎన్డీఆర్​ఎఫ్ బృందాలను పంపిస్తూ ఆదేశాలు జారీచేశారు.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం : రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడితే వరద ముంపు మరింత పెరిగే అవకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

అన్ని విశ్వవిద్యాలయాలు రేపు తమ పరిధిలో జరిగే పరీక్షలను వాయిదా వేశాయి. వీలైనంత ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అధికారికంగా తొమ్మిది మంది చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఖమ్మంలో మున్నేరు వాగు ఉద్ధృతిలో చిక్కుకుపోయిన 9 మందిని రక్షించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు : భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 117 గ్రామాలకు బాహ్య ప్రంపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వాగులు, వంక‌లు పొంగి పొర్లి రహదారులు కొట్టుకుపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. అత్యధికంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 33 దెబ్బతినగా, మహబూబాబాద్ జిల్లాలో 30, జగిత్యాలలో 13 గ్రామాలకు రవాణ వ్యవస్థ స్తంభించింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20, ఉమ్మడి మెదక్ జిల్లాలో 8, ఉమ్మడి రంగారెడ్డిలో 7, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు గ్రామాల లింకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా గ్రామాలు నీట మునిగి ఉన్నందున రోడ్లు ఎంత మేరకు దెబ్బతిన్నాయో ఇంకా పూర్తి స్పష్టత రావడం లేదని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రోడ్లను వెంటనే మరమ్మతు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.

సూర్యాపేట మీదగా హైదరాబాద్​ టూ విజయవాడ రోడ్​ క్లోజ్​! - ప్రయాణం వాయిదా బెస్ట్ - Hyd to Vijayawada highway closed

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - దక్షిణమధ్య రైల్వే నుంచి 80 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - SCR Cancelled Trains

Union Home Minister Call To CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి రాష్ట్రంలో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అమిత్ షాకు సీఎం వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర హోంమంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

కేంద్రహోం మంత్రికి బండి సంజయ్ ఫోన్ : అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అమిత్ షాకు రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నష్టం భారీగా ఉందని వెంటనే ఎన్డీఆర్​ఎఫ్ బృందాలను పంపాలను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు అమిత్ షా ఎన్డీఆర్​ఎఫ్ బృందాలను పంపిస్తూ ఆదేశాలు జారీచేశారు.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం : రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడితే వరద ముంపు మరింత పెరిగే అవకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

అన్ని విశ్వవిద్యాలయాలు రేపు తమ పరిధిలో జరిగే పరీక్షలను వాయిదా వేశాయి. వీలైనంత ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అధికారికంగా తొమ్మిది మంది చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఖమ్మంలో మున్నేరు వాగు ఉద్ధృతిలో చిక్కుకుపోయిన 9 మందిని రక్షించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు : భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 117 గ్రామాలకు బాహ్య ప్రంపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వాగులు, వంక‌లు పొంగి పొర్లి రహదారులు కొట్టుకుపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. అత్యధికంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 33 దెబ్బతినగా, మహబూబాబాద్ జిల్లాలో 30, జగిత్యాలలో 13 గ్రామాలకు రవాణ వ్యవస్థ స్తంభించింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20, ఉమ్మడి మెదక్ జిల్లాలో 8, ఉమ్మడి రంగారెడ్డిలో 7, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు గ్రామాల లింకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా గ్రామాలు నీట మునిగి ఉన్నందున రోడ్లు ఎంత మేరకు దెబ్బతిన్నాయో ఇంకా పూర్తి స్పష్టత రావడం లేదని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రోడ్లను వెంటనే మరమ్మతు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.

సూర్యాపేట మీదగా హైదరాబాద్​ టూ విజయవాడ రోడ్​ క్లోజ్​! - ప్రయాణం వాయిదా బెస్ట్ - Hyd to Vijayawada highway closed

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - దక్షిణమధ్య రైల్వే నుంచి 80 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - SCR Cancelled Trains

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.