ETV Bharat / state

మతిస్తిమితం లేని వ్యక్తిపై బైక్​ తొక్కించి, తాడుకట్టి ఈడ్చుకెళ్లి - మద్యం మత్తులో యువకుల దుశ్చర్య - Two accused killed beggar in medak

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 10:25 AM IST

A Beggar Murder Under the Influence of Alcohol : పాపం రోడ్డు పక్కన భిక్షాటన చేసుకునే వ్యక్తిని దొంగతనం చేశాడనే పేరుతో మద్యం మత్తులో ఇద్దరు యువకులు హత్య చేశారు. ఈ ఘటన ఈ నెల 4న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్​ జిల్లా శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

A Beggar Murder Under the Influence of Alcohol
A Beggar Murder Under the Influence of Alcohol (ETV Bharat)

A Beggar Killed in Medak District : మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మతి స్తిమితం కోల్పోయి, ఓ వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో విచక్షణారహితంగా దాడి చేసి అతనిని హతమార్చారు. ఈ ఘటన మెదక్​ జిల్లాలో జరిగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానిక గ్రామస్థుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం, మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో 35 నుంచి 40 ఏళ్ల మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఉన్నాడు. అతను నెల రోజులుగా భిక్షాటన చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. ఆ వ్యక్తి హిందీ మాట్లాడుతూ రోడ్డు పక్కన, బస్టాండ్​ వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవాడు. ఈ నెల 4న రోడ్డు పక్కన బస్టాండులో నిద్రిస్తుండగా, దొంగతనం చేశాడనే నెపంతో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గంగిరెడ్డి తిరుపతిరెడ్డి, పందికొక్కుల మణికంఠ గౌడ్​లు అతనిపై అమానవీయంగా దాడి చేశారు.

కొట్టొద్దంటూ సదరు వ్యక్తి ఎంత ప్రాధేయపడినా అతడిని విడిచిపెట్టలేదు. రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి అతడిపైకి బైక్​ ఎక్కించారు. అంతటితో ఆగకుండా పైకెత్తి పడేశారు. బైకుకు కట్టి ఈడ్చుకెళ్లారు. కొట్టొద్దని కాళ్లావేళ్లాపడినా కనీసం కనికరించలేదు. చివరకు ఓ చోటుకు తీసుకెళ్లి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం అంతా అక్కడ బస్టాండ్​ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ నెల 5న ఉదయం అతని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రక్షకభటులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహాన్ని ఈ నెల 6న నర్సాపూర్​ ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తీసుకెళ్లి పరీక్షలు చేయించి మృతదేహాన్ని ఖననం చేశారు.

రాజకీయ ఒత్తిళ్ల వళ్లే అరెస్టు చేయలేదు : పోలీసుల దర్యాప్తులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన వ్యక్తిని దాడి చేస్తున్నట్లు బస్టాండ్​ సమీపంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన తీవ్ర జాప్యం చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారణకు తీసుకెళ్లినా ఓ ప్రజాప్రతినిధి, నాయకుల ఒత్తిళ్లుతో ఇంటికి పంపించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐదో తేదీన ఘటన వెలుగులోకి వస్తే 9వ తేదీన నిందితులను అరెస్ట్​ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ జాప్యం వారిని వదిలేయడానికే జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారనే వార్తలు వినిపిస్తున్నాయి తప్పా వారి గురించి పూర్తి సమాచారం బయటకు రాకపోవడం చర్చనీయాంశం అయింది.

నిందితుల పూర్తి వివరాలు వెల్లడించలేదు : మణికంఠగౌడ్​ స్థానికంగా ఓ ప్రజాప్రతినిధికి చెందిన యువజన విభాగంలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. తిరుపతిరెడ్డి గ్రామంలో ట్రాక్టర్​ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తూప్రాన్​లో సర్కిల్​ పరిధిలోని ఎస్సైలతో మెదక్​ జిల్లా ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయినా నిందితుల పూర్తి వివరాలు వెల్లడించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

A Beggar Killed in Medak District : మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మతి స్తిమితం కోల్పోయి, ఓ వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో విచక్షణారహితంగా దాడి చేసి అతనిని హతమార్చారు. ఈ ఘటన మెదక్​ జిల్లాలో జరిగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానిక గ్రామస్థుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం, మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో 35 నుంచి 40 ఏళ్ల మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఉన్నాడు. అతను నెల రోజులుగా భిక్షాటన చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. ఆ వ్యక్తి హిందీ మాట్లాడుతూ రోడ్డు పక్కన, బస్టాండ్​ వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవాడు. ఈ నెల 4న రోడ్డు పక్కన బస్టాండులో నిద్రిస్తుండగా, దొంగతనం చేశాడనే నెపంతో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గంగిరెడ్డి తిరుపతిరెడ్డి, పందికొక్కుల మణికంఠ గౌడ్​లు అతనిపై అమానవీయంగా దాడి చేశారు.

కొట్టొద్దంటూ సదరు వ్యక్తి ఎంత ప్రాధేయపడినా అతడిని విడిచిపెట్టలేదు. రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి అతడిపైకి బైక్​ ఎక్కించారు. అంతటితో ఆగకుండా పైకెత్తి పడేశారు. బైకుకు కట్టి ఈడ్చుకెళ్లారు. కొట్టొద్దని కాళ్లావేళ్లాపడినా కనీసం కనికరించలేదు. చివరకు ఓ చోటుకు తీసుకెళ్లి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం అంతా అక్కడ బస్టాండ్​ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ నెల 5న ఉదయం అతని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రక్షకభటులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహాన్ని ఈ నెల 6న నర్సాపూర్​ ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తీసుకెళ్లి పరీక్షలు చేయించి మృతదేహాన్ని ఖననం చేశారు.

రాజకీయ ఒత్తిళ్ల వళ్లే అరెస్టు చేయలేదు : పోలీసుల దర్యాప్తులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన వ్యక్తిని దాడి చేస్తున్నట్లు బస్టాండ్​ సమీపంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన తీవ్ర జాప్యం చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారణకు తీసుకెళ్లినా ఓ ప్రజాప్రతినిధి, నాయకుల ఒత్తిళ్లుతో ఇంటికి పంపించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐదో తేదీన ఘటన వెలుగులోకి వస్తే 9వ తేదీన నిందితులను అరెస్ట్​ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ జాప్యం వారిని వదిలేయడానికే జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారనే వార్తలు వినిపిస్తున్నాయి తప్పా వారి గురించి పూర్తి సమాచారం బయటకు రాకపోవడం చర్చనీయాంశం అయింది.

నిందితుల పూర్తి వివరాలు వెల్లడించలేదు : మణికంఠగౌడ్​ స్థానికంగా ఓ ప్రజాప్రతినిధికి చెందిన యువజన విభాగంలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. తిరుపతిరెడ్డి గ్రామంలో ట్రాక్టర్​ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తూప్రాన్​లో సర్కిల్​ పరిధిలోని ఎస్సైలతో మెదక్​ జిల్లా ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయినా నిందితుల పూర్తి వివరాలు వెల్లడించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.