ETV Bharat / state

తిరుమలలో స్పెషల్​ దర్శనం, లడ్డూ ధరలు తగ్గాయా? నిజమెంత? - TTD on laddu SED Tickets Issue

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 5:03 PM IST

Updated : Jun 22, 2024, 6:33 PM IST

TTD EO Shyamala Rao Respond on laddu Costs : తిరుమలలోని శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలు కోసం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పుకార్లపై టీటీడీ స్పందించింది. అందులో ఎటువంటి నిజం లేదని ఆలయ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

TTD EO Shyamala Rao on Tirumala New Activities
TTD New Developments (ETV Bharat)

TTD Clarity on laddu and SED Ticket Costs Issue : ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా వచ్చిన శ్యామలరావు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. భక్తుల ఇబ్బందులపై దృష్టిపెడుతూ తీసుకోవాల్సిన చర్యలపై ఆలయ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈక్రమంలోనే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలు కోసం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పందించారు. అందులో ఎటువంటి నిజం లేదని ఈవో స్పష్టం చేశారు. భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా అవాస్తవాలు, దళారులను నమ్మి భక్తులు మోసపోవద్దని సూచించారు.

అవన్నీ అవాస్తవం - టీటీడీ స్టేట్​మెంట్​ : కొన్ని వాట్సప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతుంది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్​సైట్ ద్వారా మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత మేరకు టికెట్ల కేటాయింపు జరిగింది.

భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉందని టీటీడీ తెలిపింది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీల ద్వారా కాకుండా, నేరుగా, రాష్ట్ర టూరిజం వెబ్​సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాబట్టి భక్తులు అంతా దీనిని గమనించాలని కోరింది. సరైన సమాచారానికి టీటీడీ అఫీసియల్​ వెబ్‌సైట్ www.tirumala.org , https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.

అయితే కొంతమంది దళారులు అమాయకులను టార్గెట్​గా చేసుకుని తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని, దీనకిి ధర ఎక్కువ అవుతుందంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్​లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. అంతేకాకుండా ఇటువంటి దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

భక్తులకు గుడ్​న్యూస్​ : తిరుమల స్వామివారి కానుకలు ఈ-వేలం - లిస్ట్​లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలుసా? - E Auction of Mobile Phones Watches

శ్రీవారి భక్తులకు అలర్ట్​ - ఆ ఒక్క రోజు పలు సేవలు రద్దు - టీటీడీ కీలక నిర్ణయం! - TTD Cancelled Some Services

TTD Clarity on laddu and SED Ticket Costs Issue : ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా వచ్చిన శ్యామలరావు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. భక్తుల ఇబ్బందులపై దృష్టిపెడుతూ తీసుకోవాల్సిన చర్యలపై ఆలయ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈక్రమంలోనే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలు కోసం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పందించారు. అందులో ఎటువంటి నిజం లేదని ఈవో స్పష్టం చేశారు. భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా అవాస్తవాలు, దళారులను నమ్మి భక్తులు మోసపోవద్దని సూచించారు.

అవన్నీ అవాస్తవం - టీటీడీ స్టేట్​మెంట్​ : కొన్ని వాట్సప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతుంది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్​సైట్ ద్వారా మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత మేరకు టికెట్ల కేటాయింపు జరిగింది.

భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉందని టీటీడీ తెలిపింది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీల ద్వారా కాకుండా, నేరుగా, రాష్ట్ర టూరిజం వెబ్​సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాబట్టి భక్తులు అంతా దీనిని గమనించాలని కోరింది. సరైన సమాచారానికి టీటీడీ అఫీసియల్​ వెబ్‌సైట్ www.tirumala.org , https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.

అయితే కొంతమంది దళారులు అమాయకులను టార్గెట్​గా చేసుకుని తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని, దీనకిి ధర ఎక్కువ అవుతుందంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్​లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. అంతేకాకుండా ఇటువంటి దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

భక్తులకు గుడ్​న్యూస్​ : తిరుమల స్వామివారి కానుకలు ఈ-వేలం - లిస్ట్​లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలుసా? - E Auction of Mobile Phones Watches

శ్రీవారి భక్తులకు అలర్ట్​ - ఆ ఒక్క రోజు పలు సేవలు రద్దు - టీటీడీ కీలక నిర్ణయం! - TTD Cancelled Some Services

Last Updated : Jun 22, 2024, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.