ETV Bharat / state

మెట్ల మార్గంలో తిరుమలకు మహేశ్​ బాబు ఫ్యామిలీ - స్వామివారిని దర్శించుకున్న వరుణ్​ తేజ్​ దంపతులు - Mahesh Babu Family Visit Tirumala

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 10:52 PM IST

Mahesh Babu Family Visit in Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సినీ నటుడు మహేశ్‌ బాబు కుటుంబ సభ్యులు అలిపిరి నడక మార్గాన తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Mahesh Babu Family Visit in Tirumala By Steps Way
Mahesh Babu Family Visit in Tirumala (ETV Bharat)

Mahesh Babu Family Visit in Tirumala By Steps Way : శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కుటుంబ సభ్యులు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గాన మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకోనున్నారు. కాలినడకన వచ్చే భక్తులు మహేశ్‌ బాబు ఫ్యామిలీతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.

Actor Varun Tej and Lavanya Tripathi Visit Tirumala : తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, సతీమణి లావణ్య త్రిపాఠి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత వరుణ్ తేజ్ దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ మంగళవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్‌ గంభీర్ - కోహ్లీ, రోహిత్​ రిటైర్మెంట్​పై ఏమన్నారంటే? - Gautham Gambhir Visit in Tirumala

సర్వదర్శనానికి 18 గంటలు: శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 18 గంటలు సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం శ్రీవారిని 73,246 మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారికి 28,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చింది.

మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు : శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా మూడు రోజులపాటు పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. గురువారం ఉ.9 గంటల నుంచి ఉ. 11 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరగనుంది. అంకురార్పణ కారణంగా ఇవాళ సహస్రదీపాలంకార సేవను రద్దు చేశారు పవిత్రోత్సవాలు ముగిసేవరకు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పవిత్రోత్సవాలు ముగిసేవరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు.

భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్- తిరుమలలో మార్పులపై భక్తుల ఆనందం - AP Govt Key Changes in Tirumala

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్​ అలర్ట్​ - ఆ మూడు రోజులు పలు సేవలు రద్దు - తెలియకపోతే ఇబ్బందులు తప్పవు! - TTD Cancelled Arjitha Seva

Mahesh Babu Family Visit in Tirumala By Steps Way : శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కుటుంబ సభ్యులు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గాన మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకోనున్నారు. కాలినడకన వచ్చే భక్తులు మహేశ్‌ బాబు ఫ్యామిలీతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.

Actor Varun Tej and Lavanya Tripathi Visit Tirumala : తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, సతీమణి లావణ్య త్రిపాఠి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత వరుణ్ తేజ్ దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ మంగళవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్‌ గంభీర్ - కోహ్లీ, రోహిత్​ రిటైర్మెంట్​పై ఏమన్నారంటే? - Gautham Gambhir Visit in Tirumala

సర్వదర్శనానికి 18 గంటలు: శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 18 గంటలు సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం శ్రీవారిని 73,246 మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం శ్రీవారికి 28,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చింది.

మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు : శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా మూడు రోజులపాటు పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. గురువారం ఉ.9 గంటల నుంచి ఉ. 11 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరగనుంది. అంకురార్పణ కారణంగా ఇవాళ సహస్రదీపాలంకార సేవను రద్దు చేశారు పవిత్రోత్సవాలు ముగిసేవరకు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పవిత్రోత్సవాలు ముగిసేవరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు.

భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్- తిరుమలలో మార్పులపై భక్తుల ఆనందం - AP Govt Key Changes in Tirumala

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్​ అలర్ట్​ - ఆ మూడు రోజులు పలు సేవలు రద్దు - తెలియకపోతే ఇబ్బందులు తప్పవు! - TTD Cancelled Arjitha Seva

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.