ETV Bharat / state

మురుగునీటి గాడిలో పెట్టనున్న జలమండలి - 31 శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు - SEWAGE SYSTEM IN HYDERABAD

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 12:14 PM IST

Govt Focus On Sewage System in Hyderabad : రాష్ట్ర రాజధానిలో మురుగునీటి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు 4 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తైన ఎస్​టీపీలను ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముగింపు దశకు చేరిన ఫతేనగర్, ఖాజాకుంట ఎస్​టీపీల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తోంది.

Govt Focus On Sewage System
నగరంలో మురుగునీటి వ్యవస్థపై ప్రభుత్వం ఫోకస్ - ఎస్​టీపీల బాధ్యత జలమండలికి (ETV Bharat)

Jala Mandali On Hyderabad Sewage System : హైదరాబాద్ మహానగరంలో మురుగు నీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పటిష్ట చర్యలు చేపట్టి రోజూ ఉత్పత్తయ్యే మురగును వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా ఎస్​టీపీ లను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా మొత్తం 3 ప్యాకేజీల్లో 3 వేల866 కోట్ల రూపాయల వ్యయంతో 1,259 ఎమ్​ఎల్​డీల సామర్థ్యం గల 31 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.వాటి నిర్మాణ బాధ్యతను జలమండలికి అప్పగించింది.

100 శాతం మురుగును శుద్ది చేసే తొలినగరంగా : మొత్తం 5 సర్కిళ్లలో ఈ ఎస్​టీపీలను నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్​టీపీల నిర్మాణం జరుగుతోంది. వాటి నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే రోజూ ఉత్పన్నమయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుందని జలమండలి భావిస్తోంది.

8 STPs At A Cost Of Rs.1280 Crores : ప్యాకేజీ-1 లో అల్వాల్, మల్కాజ్‌గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో 1230 కోట్ల రూపాయలతో 8 ఎస్​టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వాటి ద్వారా 402.50 ఎమ్​ఎల్​డీల మురుగు నీటిని శుద్ధి జరుగుతుంది. ప్యాకేజీ-2 లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో 1355 కోట్ల రూపాయలతో 6 ఎస్​టీపీలను నిర్మించనున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్​డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

6 ఎస్​టీపీల నిర్మాణం పూర్తి : ప్యాకేజీ-3 లో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో 1280 కోట్ల రూపాయల వ్యయంతో 17 ఎస్​టీపీలను ఏర్పాటు చేసి 376.50 ఎంఎల్​డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. ఇప్పటికే కోకాపేట, దుర్గం చెరువు, పెద్ద చెరువు, నల్ల చెరువు వద్ద నిర్మించిన 4 ఎస్​టీపీలు ప్రారంభం కాగా మరో 6 ఎస్​టీపీలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమయ్యాయి.

ఎస్​టీపీలను పరిశీలించిన జలమండలి ఎండీ : మిర్‌ ఆలం, మియాపూర్-పటేల్ చెరువు, సఫిల్‌గూడ, వెన్నెల గడ్డ, నాగోల్ ఎస్​టీపీలతోపాటు నల్లగండ్ల, ముల్లకత్వ చెరువు, శివాలయ నగర్‌, పాలపిట్ట దగ్గర నిర్మిస్తున్న ఎస్​టీపీలను ఆగస్టులో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫతేనగర్, ఖాజాకుంట వద్ద ప్రారంభానికి సిద్ధమైన ఎస్​టీపీలను జలమండలి నూతన ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు.

ట్రయల్​రన్​ : ప్యాకేజి-3లో భాగంగా నిర్మిస్తున్న ఫతేనగర్, ఖాజాకుంట ఎస్​టీపీల్లోని వెట్‌ వెల్‌, ఎస్​బీఆర్​, బ్లోయర్ రూమ్‌లను పరిశీలించిన ఎండీ వెట్‌ వెల్‌ దగ్గర ఇన్‌లెట్‌ పంపులను స్విచ్చాన్ చేసి ట్రయల్ రన్ ప్రారంభించారు. ముగింపు దశలో ఉన్న పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్​డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం 25 ఎస్​టీపీల ద్వారా 772 ఎంఎల్​డీల మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు. వీటి సంఖ్య మరింత పెంచి నగర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది.

ఎక్కడా లేని విధంగా హైదరాబాద్​లో మురుగు శుద్ధి

Sanitation problems: మురికి కూపాలుగా శివారు కాలనీలు

Jala Mandali On Hyderabad Sewage System : హైదరాబాద్ మహానగరంలో మురుగు నీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పటిష్ట చర్యలు చేపట్టి రోజూ ఉత్పత్తయ్యే మురగును వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా ఎస్​టీపీ లను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా మొత్తం 3 ప్యాకేజీల్లో 3 వేల866 కోట్ల రూపాయల వ్యయంతో 1,259 ఎమ్​ఎల్​డీల సామర్థ్యం గల 31 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.వాటి నిర్మాణ బాధ్యతను జలమండలికి అప్పగించింది.

100 శాతం మురుగును శుద్ది చేసే తొలినగరంగా : మొత్తం 5 సర్కిళ్లలో ఈ ఎస్​టీపీలను నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్​టీపీల నిర్మాణం జరుగుతోంది. వాటి నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే రోజూ ఉత్పన్నమయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుందని జలమండలి భావిస్తోంది.

8 STPs At A Cost Of Rs.1280 Crores : ప్యాకేజీ-1 లో అల్వాల్, మల్కాజ్‌గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో 1230 కోట్ల రూపాయలతో 8 ఎస్​టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వాటి ద్వారా 402.50 ఎమ్​ఎల్​డీల మురుగు నీటిని శుద్ధి జరుగుతుంది. ప్యాకేజీ-2 లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో 1355 కోట్ల రూపాయలతో 6 ఎస్​టీపీలను నిర్మించనున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్​డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

6 ఎస్​టీపీల నిర్మాణం పూర్తి : ప్యాకేజీ-3 లో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో 1280 కోట్ల రూపాయల వ్యయంతో 17 ఎస్​టీపీలను ఏర్పాటు చేసి 376.50 ఎంఎల్​డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. ఇప్పటికే కోకాపేట, దుర్గం చెరువు, పెద్ద చెరువు, నల్ల చెరువు వద్ద నిర్మించిన 4 ఎస్​టీపీలు ప్రారంభం కాగా మరో 6 ఎస్​టీపీలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమయ్యాయి.

ఎస్​టీపీలను పరిశీలించిన జలమండలి ఎండీ : మిర్‌ ఆలం, మియాపూర్-పటేల్ చెరువు, సఫిల్‌గూడ, వెన్నెల గడ్డ, నాగోల్ ఎస్​టీపీలతోపాటు నల్లగండ్ల, ముల్లకత్వ చెరువు, శివాలయ నగర్‌, పాలపిట్ట దగ్గర నిర్మిస్తున్న ఎస్​టీపీలను ఆగస్టులో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫతేనగర్, ఖాజాకుంట వద్ద ప్రారంభానికి సిద్ధమైన ఎస్​టీపీలను జలమండలి నూతన ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు.

ట్రయల్​రన్​ : ప్యాకేజి-3లో భాగంగా నిర్మిస్తున్న ఫతేనగర్, ఖాజాకుంట ఎస్​టీపీల్లోని వెట్‌ వెల్‌, ఎస్​బీఆర్​, బ్లోయర్ రూమ్‌లను పరిశీలించిన ఎండీ వెట్‌ వెల్‌ దగ్గర ఇన్‌లెట్‌ పంపులను స్విచ్చాన్ చేసి ట్రయల్ రన్ ప్రారంభించారు. ముగింపు దశలో ఉన్న పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్​డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం 25 ఎస్​టీపీల ద్వారా 772 ఎంఎల్​డీల మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు. వీటి సంఖ్య మరింత పెంచి నగర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది.

ఎక్కడా లేని విధంగా హైదరాబాద్​లో మురుగు శుద్ధి

Sanitation problems: మురికి కూపాలుగా శివారు కాలనీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.