ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్​పై సమగ్రంగా కౌంటర్​ దాఖలు చేస్తాం - హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక - Telangana HC on Phone Tapping

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 9:47 PM IST

TG HC on Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసుపై పోలీసు కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్​లోని అంశాలను తాము అన్వయించుకోవడం లేదని, పూర్తి వివరాలతోకూడిన సమగ్రంగా కౌంటరు దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ కేసును సుమోటో పిటిషన్‌గా తీసుకున్న న్యాయస్థానం విచారణను ఆగస్టు 20కి వాయిదా వేస్తూ ఈలోపు కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Phone Tapping Case in Telangana High Court
TG HC on Phone Tapping (ETV Bharat)

Phone Tapping Case in Telangana High Court : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అనుసరిస్తున్న విధానంతో సహా పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ కేసులో పోలీసు కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్​లోని అంశాలను తాము అన్వయించుకోవడం లేదని, ప్రత్యేకంగా అన్ని వివరాలతో సమగ్రంగా కౌంటరు దాఖలు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తల ప్రచురణ, ప్రసారంలో సంయమనం పాటించాలని మీడియాకు హైకోర్టు సూచించింది. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటో పిటిషన్‌ తీసుకున్న హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.

ఈ కేసులో అన్ని అధికారాలు హోంశాఖ కార్యదర్శికే ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దర్యాప్తుపై పోలీసు కమిషనర్ కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. కమిషనర్ పేర్కొన్న అంశాలకే పరిమితం కాకుండా, ఫోన్ టాపింగ్ దర్యాప్తులో అనుసరించిన విధానంతో సహా పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని, రెండు వారాల గడువు కావాలని అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరారు. కౌంటరు దాఖలు చేస్తామని మూడు వారాల గడువు కావాలని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ కోరారు. దీనికి అనుమతించిన ధర్మాసనం విచారణను ఆగస్టు 20కి వాయిదా చేస్తూ ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఫోన్ ట్యాపింగ్‌పై బీఎస్పీ నేత పిటిషన్‌ : ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు చేయించాలంటూ బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్‌పైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి హరీశ్​ రావు ఆదేశాల మేరకు పోలీసులు తన ఫోన్‌ను ట్యాప్ చేశారని, దర్యాప్తు చేయించాలంటూ జూన్ 10న డీజీపీకి వినతి పత్రం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జి.చక్రధర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. దీనిపై ప్రభుత్వ వివరణ చెప్పడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేశారు.

Phone Tapping Case in Telangana High Court : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అనుసరిస్తున్న విధానంతో సహా పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ కేసులో పోలీసు కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్​లోని అంశాలను తాము అన్వయించుకోవడం లేదని, ప్రత్యేకంగా అన్ని వివరాలతో సమగ్రంగా కౌంటరు దాఖలు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తల ప్రచురణ, ప్రసారంలో సంయమనం పాటించాలని మీడియాకు హైకోర్టు సూచించింది. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటో పిటిషన్‌ తీసుకున్న హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.

ఈ కేసులో అన్ని అధికారాలు హోంశాఖ కార్యదర్శికే ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దర్యాప్తుపై పోలీసు కమిషనర్ కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. కమిషనర్ పేర్కొన్న అంశాలకే పరిమితం కాకుండా, ఫోన్ టాపింగ్ దర్యాప్తులో అనుసరించిన విధానంతో సహా పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని, రెండు వారాల గడువు కావాలని అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరారు. కౌంటరు దాఖలు చేస్తామని మూడు వారాల గడువు కావాలని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ కోరారు. దీనికి అనుమతించిన ధర్మాసనం విచారణను ఆగస్టు 20కి వాయిదా చేస్తూ ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఫోన్ ట్యాపింగ్‌పై బీఎస్పీ నేత పిటిషన్‌ : ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు చేయించాలంటూ బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్‌పైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి హరీశ్​ రావు ఆదేశాల మేరకు పోలీసులు తన ఫోన్‌ను ట్యాప్ చేశారని, దర్యాప్తు చేయించాలంటూ జూన్ 10న డీజీపీకి వినతి పత్రం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జి.చక్రధర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. దీనిపై ప్రభుత్వ వివరణ చెప్పడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేశారు.

ఫోన్ ​ట్యాపింగ్ కేసు లేటెస్ట్ అప్డేట్ - ప్రభాకర్​రావుపై రెడ్​కార్నర్​ నోటీసు! - PRABHAKAR RAO RED CORNER NOTICES

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్​ - వెలుగులోకి ప్రభాకర్​ రావు లేఖ - PRABHAKAR RAO ON PHONE TAPPING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.