ETV Bharat / state

ఈడబ్ల్యూఎస్ లేకుండా మెడికల్ అడ్మిషన్లు - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు - Telangana High Court On Ews Quota

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 9:53 PM IST

HC On Medical Admissions : ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనకు మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శకాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.

Telangana High Court On Ews Quota In Medical Seats
HC On Medical Admissions (ETV Bharat)

Telangana HC On Ews Quota MBBS Admissions : ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనకు మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శకాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు : 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ జనవరి 1న కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినా స్పందించకపోవడాన్ని సవాలు చేస్తూ బీజేపీకి చెందిన కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు : ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జె.శ్రీనివాస రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆగస్టు 28న తాను వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్ఎంసీ నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాల్సి ఉందన్నారు.

అయితే రాష్ట్రంలో ప్రస్తావనే లేకుండా అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన కేంద్ర వైద్యరోగ్యశాఖ, విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కాళోజీ నారాయణరావు యూనివర్శిటీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 18వ తేదీకి వాయిదా చేసింది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు - ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానికతపై హైకోర్టు తీర్పు - HC on Medical Admissions for local

ఎంబీబీఎస్​, బీడీఎస్​ ప్రవేశాల్లో స్థానికతను పక్కకు పెట్టి ఆన్​లైన్​ దరఖాస్తులు తీసుకోండి : హైకోర్టు - Telangana HC on MBBS Admissions

Telangana HC On Ews Quota MBBS Admissions : ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనకు మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శకాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు : 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ జనవరి 1న కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినా స్పందించకపోవడాన్ని సవాలు చేస్తూ బీజేపీకి చెందిన కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు : ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జె.శ్రీనివాస రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆగస్టు 28న తాను వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్ఎంసీ నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాల్సి ఉందన్నారు.

అయితే రాష్ట్రంలో ప్రస్తావనే లేకుండా అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన కేంద్ర వైద్యరోగ్యశాఖ, విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కాళోజీ నారాయణరావు యూనివర్శిటీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 18వ తేదీకి వాయిదా చేసింది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు - ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానికతపై హైకోర్టు తీర్పు - HC on Medical Admissions for local

ఎంబీబీఎస్​, బీడీఎస్​ ప్రవేశాల్లో స్థానికతను పక్కకు పెట్టి ఆన్​లైన్​ దరఖాస్తులు తీసుకోండి : హైకోర్టు - Telangana HC on MBBS Admissions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.