ETV Bharat / state

తెలంగాణ ప్రకృతి విపత్తుపై నివేదిక అందలేదు - సీఎస్‌కు కేంద్ర హోంశాఖ లేఖ - UNION GOVT ON TELANGANA SDRF FUNDS

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 9:06 AM IST

Updated : Sep 5, 2024, 9:27 AM IST

Telangana SDRF Funds 2024 : ఇటీవల ప్రకృతి విపత్తుకు సంబంధించి రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు రోజువారీ నివేదిక పంపేలా అధికారులకు సూచనలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఈ మేరకు ఈ నెల 3 న రాసిన రెండు పేజీల లేఖ బుధవారం బయటకొచ్చింది.

SDRF Funds To Telangana For Flood Affected Areas
Telangana SDRF Funds 2024 (ETV Bharat)

SDRF Funds To Telangana For Flood Affected Areas : రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి టెలిఫోన్‌ ద్వారా అందిన సమాచారం ప్రకారం భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగాయని వాటి నుంచి నీరు విడుదల చేయడం కారణంగా ఆగస్టు 31 నుంచి రాష్ట్రంలో వరద తరహా పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్‌ జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు సమాచారం అందినట్లు పేర్కొంది.

కేంద్ర హోంశాఖ లేఖ : రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందించడానికి పడవలు, ప్రాణాలు కాపాడే సామాగ్రితో పాటు 7 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. అలాగే సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు రెండు హెలికాప్టర్లను కూడా పంపింది. ఐతే రాష్ట్రంలోని విపత్తు పరిస్థితుల గురించి కంట్రోల్‌రూంకి నిబంధనల మేరకు ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

రాష్ట్రంలో నోటిఫై చేసిన వరదలు, వైపరీత్యాల సమయంలో అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి రూ.1,345.15 కోట్లు ఉన్నట్లు రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌ ద్వారా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్‌ కింద కేంద్ర వాటా విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సమాచారం సమర్పించలేదని కేంద్రహోంశాఖ వెల్లడించింది.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేంద్ర వాటా కోసం సమాచారం :ఎస్​డీఆర్ఎఫ్ కింద అమలు చేసే పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి అందిన మొత్తం గురించి కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏప్రిల్, అక్టోబరులో సమాచారం అందించాలి. 2024-25కి సంబంధించిన తొలివిడత మొత్తం రూ. 208.40 కోట్లను ఈ ఏడాది జూన్‌ 1న ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. అంతకు ముందు విడుదలైన నిధులు, ఆర్జించిన వడ్డీ ఆదాయం, వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపలేదు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత విధానంలో సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు సమర్పించాలని సాధ్యమైనంత త్వరగా కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగానికీ పంపాలని పేర్కొంది. అప్పుడే 2024-25కి సంబంధించి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల్లో కేంద్ర వాటా తొలి విడత మొత్తం విడుదల చేయడానికి వీలవుతుందని కేంద్ర హోంశాఖ రాష్ట్ర సీఎస్‌కి తెలిపింది.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌​ నిధుల వినియోగానికి కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ - SDRF Funds to Telangana

జల విలయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కకావికలం - ఊరూఏరును ఏకం చేసిన జడివాన - Heavy Rains Floods In Khammam

SDRF Funds To Telangana For Flood Affected Areas : రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి టెలిఫోన్‌ ద్వారా అందిన సమాచారం ప్రకారం భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగాయని వాటి నుంచి నీరు విడుదల చేయడం కారణంగా ఆగస్టు 31 నుంచి రాష్ట్రంలో వరద తరహా పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్‌ జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు సమాచారం అందినట్లు పేర్కొంది.

కేంద్ర హోంశాఖ లేఖ : రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందించడానికి పడవలు, ప్రాణాలు కాపాడే సామాగ్రితో పాటు 7 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. అలాగే సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు రెండు హెలికాప్టర్లను కూడా పంపింది. ఐతే రాష్ట్రంలోని విపత్తు పరిస్థితుల గురించి కంట్రోల్‌రూంకి నిబంధనల మేరకు ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

రాష్ట్రంలో నోటిఫై చేసిన వరదలు, వైపరీత్యాల సమయంలో అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి రూ.1,345.15 కోట్లు ఉన్నట్లు రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌ ద్వారా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్‌ కింద కేంద్ర వాటా విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సమాచారం సమర్పించలేదని కేంద్రహోంశాఖ వెల్లడించింది.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేంద్ర వాటా కోసం సమాచారం :ఎస్​డీఆర్ఎఫ్ కింద అమలు చేసే పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి అందిన మొత్తం గురించి కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏప్రిల్, అక్టోబరులో సమాచారం అందించాలి. 2024-25కి సంబంధించిన తొలివిడత మొత్తం రూ. 208.40 కోట్లను ఈ ఏడాది జూన్‌ 1న ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. అంతకు ముందు విడుదలైన నిధులు, ఆర్జించిన వడ్డీ ఆదాయం, వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపలేదు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత విధానంలో సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు సమర్పించాలని సాధ్యమైనంత త్వరగా కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగానికీ పంపాలని పేర్కొంది. అప్పుడే 2024-25కి సంబంధించి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల్లో కేంద్ర వాటా తొలి విడత మొత్తం విడుదల చేయడానికి వీలవుతుందని కేంద్ర హోంశాఖ రాష్ట్ర సీఎస్‌కి తెలిపింది.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌​ నిధుల వినియోగానికి కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ - SDRF Funds to Telangana

జల విలయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కకావికలం - ఊరూఏరును ఏకం చేసిన జడివాన - Heavy Rains Floods In Khammam

Last Updated : Sep 5, 2024, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.