ETV Bharat / state

అపార నష్టాన్ని మిగిల్చిన కుండపోత వర్షం - ఈ 11 జిల్లాల్లో నేడు మళ్లీ భారీ వర్షాలు - TG Govt Alert Heavy Rains Today

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 7:07 AM IST

Updated : Sep 3, 2024, 10:52 AM IST

TG Govt Alert Heavy Rains Today : రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు నేలమట్టమై విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. తాగు నీటి సమస్యలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. వరదల్లో చిక్కుకుని 21 మంది మృత్యువాతపడ్డారు. నేడూ వర్షాలు కురుస్తాయన్న వాతారవణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు.

Heavy Rains in telangana Caused Heavy Property Damage
TG Govt Alert Heavy Rains Today (ETV Bharat)

Heavy Rains in telangana Caused Heavy Property Damage : రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతిని దాదాపు 192 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 464 పంచాయితీరాజ్‌ రహదారులు 575 కిలోమీటర్ల మేరకు దెబ్బతినగా, సుమారు రూ.421 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అంచనా వేసింది. 1400 చోట్ల మిషన్‌ భగీరథ సరఫరా పైపులు దెబ్బతిని సుమారు రూ.80 కోట్ల మేర నష్టం కలిగింది. పలుచోట్ల నీటి సరఫరాకు అవసరమైన విద్యుత్‌ లేక 5,700 గ్రామాలకు సమస్యలు తలెత్తాయి.

వరదల ఉద్ధృతికి రాష్ట్రంలో 3,117 స్తంభాలు, 127 ట్రాన్స్‌ఫార్మర్లు, 18 సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నీటి పారుదల శాఖ పరిధిలో 260 చెరువులు, కాల్వలకు నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ప్రాజెక్టుల కింద 64 కాలువలకు గండ్లు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షం, వరదలకు పలుచోట్ల 21 మంది మృత్యువాతపడ్డారు.

అధికారులతో సీఎస్​ సమావేశం : రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన సర్కార్‌, ముందస్తు చర్యలపై కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌లు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలు కురిసే అవకాశమున్న ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు.

విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అధికారం కలెక్టర్లదే : ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం కలెక్టర్లే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. రేపటి (బుధవారం) వరకు భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఎస్పీలు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ జితేందర్ తెలిపారు.

రేపు 11 జిల్లాలకు భారీ వర్షసూచన - సెప్టెంబర్ 5 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! - Telangana Heavy Rains Expected

రాష్ట్రాన్ని నిండా ముంచిన జడివాన - జలదిగ్బంధంలో పట్టణాలు, గ్రామాలు - Heavy Rains Across The State

Heavy Rains in telangana Caused Heavy Property Damage : రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతిని దాదాపు 192 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 464 పంచాయితీరాజ్‌ రహదారులు 575 కిలోమీటర్ల మేరకు దెబ్బతినగా, సుమారు రూ.421 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అంచనా వేసింది. 1400 చోట్ల మిషన్‌ భగీరథ సరఫరా పైపులు దెబ్బతిని సుమారు రూ.80 కోట్ల మేర నష్టం కలిగింది. పలుచోట్ల నీటి సరఫరాకు అవసరమైన విద్యుత్‌ లేక 5,700 గ్రామాలకు సమస్యలు తలెత్తాయి.

వరదల ఉద్ధృతికి రాష్ట్రంలో 3,117 స్తంభాలు, 127 ట్రాన్స్‌ఫార్మర్లు, 18 సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నీటి పారుదల శాఖ పరిధిలో 260 చెరువులు, కాల్వలకు నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ప్రాజెక్టుల కింద 64 కాలువలకు గండ్లు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షం, వరదలకు పలుచోట్ల 21 మంది మృత్యువాతపడ్డారు.

అధికారులతో సీఎస్​ సమావేశం : రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన సర్కార్‌, ముందస్తు చర్యలపై కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌లు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలు కురిసే అవకాశమున్న ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు.

విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అధికారం కలెక్టర్లదే : ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం కలెక్టర్లే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. రేపటి (బుధవారం) వరకు భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఎస్పీలు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ జితేందర్ తెలిపారు.

రేపు 11 జిల్లాలకు భారీ వర్షసూచన - సెప్టెంబర్ 5 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! - Telangana Heavy Rains Expected

రాష్ట్రాన్ని నిండా ముంచిన జడివాన - జలదిగ్బంధంలో పట్టణాలు, గ్రామాలు - Heavy Rains Across The State

Last Updated : Sep 3, 2024, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.