ETV Bharat / state

జీవితంలో రిస్క్​ లేనిదే - మంచి విజయాలు సాధించలేం : సీఎం రేవంత్ రెడ్డి

గచ్చిబౌలిలో ఘనంగా ఐఎస్​బీ లీడర్​షిప్​ సమ్మిట్​ 2024 - కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్​ రెడ్డి - త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమన్న ముఖ్యమంత్రి

author img

By ETV Bharat Telangana Team

Published : 9 hours ago

ISB Leadership Summit 2024
ISB Leadership Summit 2024 (ETV Bharat)

CM Revanth Participate ISB Leadership Summit 2024 : త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు. మంచి లీడర్​ అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలని తెలిపారు. హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​ నాయకత్వ శిఖరాగ్ర సదస్సు - 2024లో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. ఐఎస్​బీలోని విద్యార్థులు నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకునేందుకు ఏడాదికోసారి ప్రముఖులు, వక్తలతో యాజమాన్యం సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది ఐఎస్​బీ లీడర్​ షిప్​ సమ్మిట్​కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​ రెడ్డి హాజరై, విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్ ​(ISB)లో నిర్వహించిన లీడర్​షిప్​ సమ్మిట్​లో ఆయన మాట్లాడారు. ప్రజలతో మమేకం అవ్వగలిగితే ఏదైనా సాధించవచ్చని చెప్పుకొచ్చారు. జీవితంలో రిస్క్​ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్​లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్​ సింగ్​, పీవీ నరసింహారావు సహా ఎంతో మంది నాయకులు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తాను నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నానని గుర్తు చేశారు.

ISB Leadership Summit 2024 : నాయకులు డబ్బు, వ్యక్తిగత జీవితం, సమయం ఇలా చాలానే త్యాగాలు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. మంచి లీడర్​ కావాలంటే ధైర్యం, త్యాగం ఉండాలని విద్యార్థులకు సూచించారు. సిగ్గుపడకుండా ప్రజలతో మమేకమవ్వాలన్నారు. ఐఎస్​బీలో ఉన్నవారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని చెప్పారు. హైదరాబాద్​ నగరాన్ని 600 మిలియన్​ సిటీగా మార్చేందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చనన్నారు.

కేవలం ఆ నగరాలతోనే పోటీ : కేవలం న్యూయార్క్​, పారిస్​, లండన్​తో పోల్చాలనుకుంటానని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. మీరంతా తెలంగాణలో 2, 3 ఏళ్లు పని చేయాలని సూచించారు. తమ ప్రభుత్వం కార్పొరేట్​ కంపెనీల తరహాలో మంచి జీతాలు ఇవ్వలేకపోవచ్చు కానీ, మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్​ను మాత్రం అందిస్తుందని చెప్పారు.

ఒలింపిక్స్​లో పతకాలే లక్ష్యం : ఒలింపిక్స్​లో భారత్​ దురదృష్టవశాత్తు స్వర్ణ పతకాలు గెలవలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్​లో అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్​ రెడ్డి ఐఎస్​బీ లీడర్​ షిప్​ సమ్మిట్​లో పిలుపునిచ్చారు.

CM Revanth Participate ISB Leadership Summit 2024 : త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు. మంచి లీడర్​ అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలని తెలిపారు. హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​ నాయకత్వ శిఖరాగ్ర సదస్సు - 2024లో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. ఐఎస్​బీలోని విద్యార్థులు నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకునేందుకు ఏడాదికోసారి ప్రముఖులు, వక్తలతో యాజమాన్యం సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది ఐఎస్​బీ లీడర్​ షిప్​ సమ్మిట్​కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​ రెడ్డి హాజరై, విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్ ​(ISB)లో నిర్వహించిన లీడర్​షిప్​ సమ్మిట్​లో ఆయన మాట్లాడారు. ప్రజలతో మమేకం అవ్వగలిగితే ఏదైనా సాధించవచ్చని చెప్పుకొచ్చారు. జీవితంలో రిస్క్​ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్​లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్​ సింగ్​, పీవీ నరసింహారావు సహా ఎంతో మంది నాయకులు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తాను నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నానని గుర్తు చేశారు.

ISB Leadership Summit 2024 : నాయకులు డబ్బు, వ్యక్తిగత జీవితం, సమయం ఇలా చాలానే త్యాగాలు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. మంచి లీడర్​ కావాలంటే ధైర్యం, త్యాగం ఉండాలని విద్యార్థులకు సూచించారు. సిగ్గుపడకుండా ప్రజలతో మమేకమవ్వాలన్నారు. ఐఎస్​బీలో ఉన్నవారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని చెప్పారు. హైదరాబాద్​ నగరాన్ని 600 మిలియన్​ సిటీగా మార్చేందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చనన్నారు.

కేవలం ఆ నగరాలతోనే పోటీ : కేవలం న్యూయార్క్​, పారిస్​, లండన్​తో పోల్చాలనుకుంటానని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. మీరంతా తెలంగాణలో 2, 3 ఏళ్లు పని చేయాలని సూచించారు. తమ ప్రభుత్వం కార్పొరేట్​ కంపెనీల తరహాలో మంచి జీతాలు ఇవ్వలేకపోవచ్చు కానీ, మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్​ను మాత్రం అందిస్తుందని చెప్పారు.

ఒలింపిక్స్​లో పతకాలే లక్ష్యం : ఒలింపిక్స్​లో భారత్​ దురదృష్టవశాత్తు స్వర్ణ పతకాలు గెలవలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్​లో అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్​ రెడ్డి ఐఎస్​బీ లీడర్​ షిప్​ సమ్మిట్​లో పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.