ETV Bharat / state

శ్రీరాం సాగర్​ ప్రాజెక్టు ఎకో టూరిజంపై ముందడుగు - ఇకనైనా రూపురేఖలు మారేనా? - ECO TOURISM POLICY IN TELANAGANA

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 46 minutes ago

SRSP Project Tourism Development: నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ముందడుగు పడింది. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ ప్రాంతాన్ని ఏకో టూరిజం హబ్‌గా చేసేందుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నడుం బిగించింది. పర్యాటకాభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆలస్యమైనా ఫారెస్ట్ డెవలప్​మెంట్​ కార్పోరేషన్ తీసుకున్న నిర్ణయంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

SRSP ECO TOURISM IN NIZAMABAD
SRSP PROJECT TOURISM DEVELOPMENT (ETV Bharat)

SRSP Eco Tourism In Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ పరివాహక ప్రాంతం పర్యాటకంగా త్వరలోనే అభివృద్ధి చెందనుంది. ఎస్సారెస్పీ వెనుక జలాల వద్ద ప్రకృతి అందాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ జలకళను సంతరించుకుంది. గోదావరి వెనుక జలాల వద్ద ఇప్పటికే వందలాది జింకలు, నెమళ్లు, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. వేలాది ఎకరాల ముంపు భూముల్లో పచ్చదనం ఉట్టిపడుతోంది. ఈ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు.

ఎకో టూరిజం పాలసీతో అభివృద్ధి: నందిపేట్, డొంకేశ్వర్, ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ మండలాలను కలుపుతూ గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక శోభ తేవాలని మూడున్నరేళ్ల క్రితమే రాష్ట్ర అటవీ పర్యాటక అభివృద్ధి సంస్థ సంకల్పించింది. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, హోటళ్లు, కాటేజీలు నిర్మించాలని భావించింది. ఇందుకోసం 10 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఐతే కార్యాచరణ పనుల్లో ముందడుగు పడలేదు. కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఎకో టూరిజం పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు.

ఎస్సారెస్పీ పర్యాటక అభివృద్ధికి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. సర్కారు ఆమోదముద్ర వేస్తే సఫారీ, ట్రెక్కింగ్‌, బోటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.

"ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రతిపాదనలు పంపగా 26 ఎకరాలను సర్వే చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇస్తే పని చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే కేవలం పర్యాటక రంగమే కాకుండా ఉపాధి అనేది దొరుకుతుందనే ఉద్దేశంతో కూడా అందరూ ఉత్సాహంగా ఉన్నారు."- సుధాకర్‌ , అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి

ఎస్సారెస్పీ పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పనులను ఆచరణలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(ఫారెస్ట్ డెవలప్​మెంట్​ కార్పోరేషన్​) ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపి నిధులు మంజూరు చేస్తే గోదావరి తీరం పర్యాటక ప్రదేశంగా విరాజిల్లడమే కాకుండా అక్కడి ప్రజలకు ఉపాధి సైతం కల్పించనుంది.

'ఉన్నది ఒకటే జిందగీ - నెలలో ఓ 2 పర్యాటక ప్రదేశాలకైనా వెళ్లిరండి' - Jupally Participates In Bike Rally

హైదరాబాద్‌లో మరో జూపార్క్- రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక - Zoo Park in Fourth City

SRSP Eco Tourism In Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ పరివాహక ప్రాంతం పర్యాటకంగా త్వరలోనే అభివృద్ధి చెందనుంది. ఎస్సారెస్పీ వెనుక జలాల వద్ద ప్రకృతి అందాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ జలకళను సంతరించుకుంది. గోదావరి వెనుక జలాల వద్ద ఇప్పటికే వందలాది జింకలు, నెమళ్లు, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. వేలాది ఎకరాల ముంపు భూముల్లో పచ్చదనం ఉట్టిపడుతోంది. ఈ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు.

ఎకో టూరిజం పాలసీతో అభివృద్ధి: నందిపేట్, డొంకేశ్వర్, ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ మండలాలను కలుపుతూ గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక శోభ తేవాలని మూడున్నరేళ్ల క్రితమే రాష్ట్ర అటవీ పర్యాటక అభివృద్ధి సంస్థ సంకల్పించింది. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, హోటళ్లు, కాటేజీలు నిర్మించాలని భావించింది. ఇందుకోసం 10 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఐతే కార్యాచరణ పనుల్లో ముందడుగు పడలేదు. కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఎకో టూరిజం పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు.

ఎస్సారెస్పీ పర్యాటక అభివృద్ధికి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. సర్కారు ఆమోదముద్ర వేస్తే సఫారీ, ట్రెక్కింగ్‌, బోటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.

"ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రతిపాదనలు పంపగా 26 ఎకరాలను సర్వే చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇస్తే పని చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే కేవలం పర్యాటక రంగమే కాకుండా ఉపాధి అనేది దొరుకుతుందనే ఉద్దేశంతో కూడా అందరూ ఉత్సాహంగా ఉన్నారు."- సుధాకర్‌ , అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి

ఎస్సారెస్పీ పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పనులను ఆచరణలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(ఫారెస్ట్ డెవలప్​మెంట్​ కార్పోరేషన్​) ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపి నిధులు మంజూరు చేస్తే గోదావరి తీరం పర్యాటక ప్రదేశంగా విరాజిల్లడమే కాకుండా అక్కడి ప్రజలకు ఉపాధి సైతం కల్పించనుంది.

'ఉన్నది ఒకటే జిందగీ - నెలలో ఓ 2 పర్యాటక ప్రదేశాలకైనా వెళ్లిరండి' - Jupally Participates In Bike Rally

హైదరాబాద్‌లో మరో జూపార్క్- రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక - Zoo Park in Fourth City

Last Updated : 46 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.