ETV Bharat / state

దారులన్నీ మేడారం వైపే - మహా జాతరకు పోటెత్తుతోన్న భక్త జనం - అమ్మవార్ల గద్దెల చెంత కోలాహలం

Special Story on Medaram Sammakka Sarakka Bangaram : మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలకు భక్తులు బెల్లాన్ని బంగారంగా పిలుచుకుంటూ భక్తితో సమర్పించుకుంటారు. తమ కోరికలు నేరవేర్చితే తామెత్తు బెల్లాన్ని ఇస్తాం తల్లి అంటూ మొక్కుకుని, అవి తీరిన వెంటనే తమతో సరితూగే బెల్లాన్ని అమ్మవార్లకు ఇస్తుంటారు. తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది.

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 12:19 PM IST

Updated : Feb 16, 2024, 2:54 PM IST

Special Story on Medaram Sammakka Sarakka Bangaram
మేడారానికి పోటెత్తుతున్న భక్త జనం - అమ్మవార్ల గద్దెల చెంత భక్తుల కోలాహలం
దారులన్నీ మేడారం వైపే - మహా జాతరకు పోటెత్తుతోన్న భక్త జనం - అమ్మవార్ల గద్దెల చెంత కోలాహలం

Special Story on Medaram Sammakka Sarakka Bangaram : మహా కుంభమేళగా పిలిచే మేడారం జాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ వన దేవతల దర్శనానికి భక్తులు మేడారం బాటపడుతున్నారు. దారులన్నీ మేడారం వైపే అన్నట్లుగా, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు మేడారం వైపు సాగుతున్నాయి. ఇప్పటికే మేడారం అభయారణ్యం జనారణ్యంగా మారింది. వ్యయ ప్రయాసలను లెక్కచేయక భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. బంగారంగా చెప్పుకునే బెల్లాన్ని అడవి తల్లులకు కానుకగా సమర్పించుకుంటున్నారు.

వన దేవతలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో ఎత్తు బంగారం సమర్పించుకుంటే సకల శుభాలు జరుగుతాయన్నది వారి నమ్మకం. తమ ఎత్తు బంగారంతో పాటు కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు, చీర సారెలు సమ్మక్క సారలమ్మలకు సమర్పించి మనసారా తల్లులను కొలుచుకుంటున్నారు. చల్లగా చూస్తే మళ్లీ జాతరకు వస్తామని తల్లులను వేడుకుంటున్నారు. భక్తులు కోరుకున్న కోరికలు తీరిన వేళ, తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించుకునేందుకు వస్తుండటంతో బెల్లం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

'అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి మేడారానికి వచ్చి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటాం. అనంతరం అమ్మవారి గద్దెలను దర్శించుకుంటాం. ఎటువంటి కోరికలు ఉన్నా కచ్చితంగా నెరవేరుతాయి. అందుకే ప్రతి రెండేళ్లకు కుటుంబసమేతంగా మేడారానికి వస్తాం. అమ్మవారికి బంగారం సమర్పించుకోవాలని అనుకున్న భక్తులు కచ్చితంగా సమర్పించుకుంటారు'. - భక్తులు

Devotees Rush to Medaram Sammakka Sarakka Temple : జాతర సమయంలో 15 టన్నులకు పైగా బెల్లం అమ్మకాలు జరుగుతాయని అంచనా. సాధారణ రోజుల్లో నెలలో సుమారు 20 క్వింటాళ్ల వరకు ఖరీదు జరిగేదని, జాతర సమయంలో 40 నుంచి 50 క్వింటాళ్ల అమ్మకాలు జరుగుతాయని ఉమ్మడి వరంగల్లోని బెల్లం వ్యాపారస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి తల్లులను దర్శించుకుంటున్నారు. చల్లగా చూస్తే మళ్లీ జాతరకు వస్తామని తల్లులను వేడుకుంటారు. కుటుంబ సమేతంగా మేడారం అభయారణ్యంలో వన భోజనాలు చేసి ఉల్లాసంగా గడుపుతున్నారు.

'రెండేళ్ల నుంచి మా అమ్మ ఓ కోరిక అనుకుంది. అది తీరుతే నా ఎత్తు బంగారం సమర్పిస్తా అని మొక్కుకున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాం మేము. ఇంతకముందే అమ్మవారికి బంగారం సమర్పించుకున్నాం. మేము అమ్మవారి మీద నమ్మకంతో వస్తున్నాం. నెక్స్ట్​ టైం కూడా రావాలనుకుంటున్నాం' - భక్తుడు

మరో 6 రోజుల్లో మేడారం మహా జాతర - గద్దెలపై కొలువుదీరేందుకు సిద్ధమవుతున్న పగిడిద్దరాజు

సమ్మక్క-సారక్కలకు ఆన్​లైన్​లో నిలువెత్తు బంగారం - కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్​

దారులన్నీ మేడారం వైపే - మహా జాతరకు పోటెత్తుతోన్న భక్త జనం - అమ్మవార్ల గద్దెల చెంత కోలాహలం

Special Story on Medaram Sammakka Sarakka Bangaram : మహా కుంభమేళగా పిలిచే మేడారం జాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ వన దేవతల దర్శనానికి భక్తులు మేడారం బాటపడుతున్నారు. దారులన్నీ మేడారం వైపే అన్నట్లుగా, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు మేడారం వైపు సాగుతున్నాయి. ఇప్పటికే మేడారం అభయారణ్యం జనారణ్యంగా మారింది. వ్యయ ప్రయాసలను లెక్కచేయక భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. బంగారంగా చెప్పుకునే బెల్లాన్ని అడవి తల్లులకు కానుకగా సమర్పించుకుంటున్నారు.

వన దేవతలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో ఎత్తు బంగారం సమర్పించుకుంటే సకల శుభాలు జరుగుతాయన్నది వారి నమ్మకం. తమ ఎత్తు బంగారంతో పాటు కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు, చీర సారెలు సమ్మక్క సారలమ్మలకు సమర్పించి మనసారా తల్లులను కొలుచుకుంటున్నారు. చల్లగా చూస్తే మళ్లీ జాతరకు వస్తామని తల్లులను వేడుకుంటున్నారు. భక్తులు కోరుకున్న కోరికలు తీరిన వేళ, తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించుకునేందుకు వస్తుండటంతో బెల్లం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

'అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి మేడారానికి వచ్చి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటాం. అనంతరం అమ్మవారి గద్దెలను దర్శించుకుంటాం. ఎటువంటి కోరికలు ఉన్నా కచ్చితంగా నెరవేరుతాయి. అందుకే ప్రతి రెండేళ్లకు కుటుంబసమేతంగా మేడారానికి వస్తాం. అమ్మవారికి బంగారం సమర్పించుకోవాలని అనుకున్న భక్తులు కచ్చితంగా సమర్పించుకుంటారు'. - భక్తులు

Devotees Rush to Medaram Sammakka Sarakka Temple : జాతర సమయంలో 15 టన్నులకు పైగా బెల్లం అమ్మకాలు జరుగుతాయని అంచనా. సాధారణ రోజుల్లో నెలలో సుమారు 20 క్వింటాళ్ల వరకు ఖరీదు జరిగేదని, జాతర సమయంలో 40 నుంచి 50 క్వింటాళ్ల అమ్మకాలు జరుగుతాయని ఉమ్మడి వరంగల్లోని బెల్లం వ్యాపారస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి తల్లులను దర్శించుకుంటున్నారు. చల్లగా చూస్తే మళ్లీ జాతరకు వస్తామని తల్లులను వేడుకుంటారు. కుటుంబ సమేతంగా మేడారం అభయారణ్యంలో వన భోజనాలు చేసి ఉల్లాసంగా గడుపుతున్నారు.

'రెండేళ్ల నుంచి మా అమ్మ ఓ కోరిక అనుకుంది. అది తీరుతే నా ఎత్తు బంగారం సమర్పిస్తా అని మొక్కుకున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాం మేము. ఇంతకముందే అమ్మవారికి బంగారం సమర్పించుకున్నాం. మేము అమ్మవారి మీద నమ్మకంతో వస్తున్నాం. నెక్స్ట్​ టైం కూడా రావాలనుకుంటున్నాం' - భక్తుడు

మరో 6 రోజుల్లో మేడారం మహా జాతర - గద్దెలపై కొలువుదీరేందుకు సిద్ధమవుతున్న పగిడిద్దరాజు

సమ్మక్క-సారక్కలకు ఆన్​లైన్​లో నిలువెత్తు బంగారం - కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్​

Last Updated : Feb 16, 2024, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.