ETV Bharat / state

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కీలక మలుపు - ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్ - PRANEETH RAO CASE updates

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 24, 2024, 8:28 AM IST

Updated : Mar 24, 2024, 8:35 AM IST

SIB Ex DSP Praneeth Rao Case Updates : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా పనిచేసి సస్పెండైన ప్రణీత్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్‌ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Two Police Officers Arrested In Phone Tapping Case
SIB Ex DSP Praneeth Rao Case Update
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక మలుపు

SIB Ex DSP Praneeth Rao Case Updates : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తీగలాగే కొద్దీ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్​ఐబీ మాజీ డీఎస్పీని విచారించగా ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం బయటపడింది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్‌ భద్రతవిభాగం అదనపు డీసీపీ తిరుపతన్న ఇళ్లకు శుక్రవారం రాత్రే వెళ్లిన పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరినీ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు.

Two Police Officers Arrested In Phone Tapping Case : విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌లకు (Telangana Phone Tapping Case) పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో, తిరుపతన్న ఎస్​ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.

ప్రణీత్​రావు రిమాండ్​ రిపోర్ట్​లో కీలక విషయాలు - అన్ని నేరాలు చేశాడా?

లుక్‌ఔట్​ సర్క్యులర్‌ జారీ : ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్​ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్​రావు, ఐ న్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌ఔట్​ సర్క్యులర్‌ జారీ చేశారు. విచారణకు రావాలని గతంలో ఎస్​ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ఐ న్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు నైజీరియాకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

శ్రవణ్‌రావు సూచించిన ఫోన్‌ నంబర్లనే ప్రణీత్‌రావు ట్యాపింగ్‌ చేసినట్లు తేలడంతో అతని ఇంట్లో జరిపిన సోదాల్లో కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చెన్నైలో ఓ పవర్‌ కంపెనీ పత్రాలు శ్రవణ్‌ ఇంట్లో గుర్తించారు. రాంపల్లిలోని ఓ స్కూల్‌ దస్తావేజులు లభ్యమయ్యాయి. రెండు ల్యాప్‌టాప్‌లు, నాలుగు ట్యాబ్‌లు, అయిదు పెన్‌డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక బృందం దర్యాప్తు - అతని కస్టడీ పిటిషన్​పై కోర్టులో వాదనలు!

ప్రణీత్​రావు ఫోన్‌ ట్యాపింగ్‌ సొంత నిర్ణయంతో జరిగింది కాదని గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు ఇందుకు పురిగొల్పినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. ఇదే అదనుగా ప్రణీత్‌ బృందం సొంత నిర్ణయాలు తీసుకొని పలువురు వ్యాపారుల ఫోన్లపై నిఘా ఉంచి లబ్ధి పొంది ఉంటుందని అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ప్రణీత్‌రావు వాంగ్మూలాల ఆధారంగా నిజానిజాలను నిగ్గు తేల్చడంపై దృష్టి సారించింది. తొలుత ఎస్​ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన అతనిని విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Telangana Phone Tapping Case Updates : ఇదంతా అప్పటి ఎస్​ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్​రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగించినట్లు తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డితో (CM Revanth REDDY)సహా ఆయన కుటుంబసభ్యుల ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు వెల్లడైంది. ఎంపిక చేసిన బీఆర్​ఎస్​ నేతల ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్లు విచారణలో ప్రణీత్‌ తెలిపినట్లు సమాచారం.

హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి అడవిలో పడేసిన ప్రణీత్ ​రావు - నేడు వికారాబాద్​ తీసుకెళ్లి విచారణ

ప్రణీత్ రావు వ్యవహరంలో వెలుగులోకి కీలకాంశాలు - కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ల ఆచూకీ గుర్తించిన పోలీసులు - DSP Praneeth Rao Case updated

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక మలుపు

SIB Ex DSP Praneeth Rao Case Updates : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తీగలాగే కొద్దీ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్​ఐబీ మాజీ డీఎస్పీని విచారించగా ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం బయటపడింది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్‌ భద్రతవిభాగం అదనపు డీసీపీ తిరుపతన్న ఇళ్లకు శుక్రవారం రాత్రే వెళ్లిన పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరినీ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు.

Two Police Officers Arrested In Phone Tapping Case : విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌లకు (Telangana Phone Tapping Case) పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో, తిరుపతన్న ఎస్​ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.

ప్రణీత్​రావు రిమాండ్​ రిపోర్ట్​లో కీలక విషయాలు - అన్ని నేరాలు చేశాడా?

లుక్‌ఔట్​ సర్క్యులర్‌ జారీ : ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్​ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్​రావు, ఐ న్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌ఔట్​ సర్క్యులర్‌ జారీ చేశారు. విచారణకు రావాలని గతంలో ఎస్​ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ఐ న్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు నైజీరియాకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

శ్రవణ్‌రావు సూచించిన ఫోన్‌ నంబర్లనే ప్రణీత్‌రావు ట్యాపింగ్‌ చేసినట్లు తేలడంతో అతని ఇంట్లో జరిపిన సోదాల్లో కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చెన్నైలో ఓ పవర్‌ కంపెనీ పత్రాలు శ్రవణ్‌ ఇంట్లో గుర్తించారు. రాంపల్లిలోని ఓ స్కూల్‌ దస్తావేజులు లభ్యమయ్యాయి. రెండు ల్యాప్‌టాప్‌లు, నాలుగు ట్యాబ్‌లు, అయిదు పెన్‌డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక బృందం దర్యాప్తు - అతని కస్టడీ పిటిషన్​పై కోర్టులో వాదనలు!

ప్రణీత్​రావు ఫోన్‌ ట్యాపింగ్‌ సొంత నిర్ణయంతో జరిగింది కాదని గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు ఇందుకు పురిగొల్పినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. ఇదే అదనుగా ప్రణీత్‌ బృందం సొంత నిర్ణయాలు తీసుకొని పలువురు వ్యాపారుల ఫోన్లపై నిఘా ఉంచి లబ్ధి పొంది ఉంటుందని అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ప్రణీత్‌రావు వాంగ్మూలాల ఆధారంగా నిజానిజాలను నిగ్గు తేల్చడంపై దృష్టి సారించింది. తొలుత ఎస్​ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన అతనిని విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Telangana Phone Tapping Case Updates : ఇదంతా అప్పటి ఎస్​ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్​రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగించినట్లు తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డితో (CM Revanth REDDY)సహా ఆయన కుటుంబసభ్యుల ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు వెల్లడైంది. ఎంపిక చేసిన బీఆర్​ఎస్​ నేతల ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్లు విచారణలో ప్రణీత్‌ తెలిపినట్లు సమాచారం.

హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి అడవిలో పడేసిన ప్రణీత్ ​రావు - నేడు వికారాబాద్​ తీసుకెళ్లి విచారణ

ప్రణీత్ రావు వ్యవహరంలో వెలుగులోకి కీలకాంశాలు - కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ల ఆచూకీ గుర్తించిన పోలీసులు - DSP Praneeth Rao Case updated

Last Updated : Mar 24, 2024, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.