ETV Bharat / state

ఏపీలోని పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం - PALNADU ROAD ACCIDENT TODAY

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 10:50 AM IST

Updated : Jun 27, 2024, 12:03 PM IST

Three Died in a Road Accident Palnadu : ఏపీలోని పల్నాడు జిల్లాలో చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.

Three Died in a Road Accident AP
Three Died in a Road Accident AP (ETV Bharat)

ఏపీలోని పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం (ETV Bharat)

Three Died In a Road Accident IN AP : ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇన్నోవా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఏడేళ్ల పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మృతులు గుంటూరు లక్ష్మీపురానికి చెందిన వారిగా గుర్తించామని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. మృతులు సోమాతి బాలగంగాధరశర్మ, యశోద, డ్రైవర్‌గా గుర్తించారు. కర్ణాటకలోని బళ్లారిలో ఓ వేడుకకు హాజరై గుంటూరుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

డివైడర్​ను ఢీకొట్టిన లారీ : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద సిమెంట్ లోడ్ లారీ బోల్తా పడింది. మాచర్ల నుంచి రేపల్లె వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్​ను ఆస్పత్రికి తరలించారు.

చిరుతను తప్పించబోయి కారు బోల్తా - మహిళ మృతి - Road Accident In Nizamabad

మిర్యాలగూడలో ఫ్లైఓవర్‌పై ఢీకొన్న రెండు కార్లు - ఒకరికి తీవ్ర గాయాలు

ఏపీలోని పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం (ETV Bharat)

Three Died In a Road Accident IN AP : ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇన్నోవా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఏడేళ్ల పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మృతులు గుంటూరు లక్ష్మీపురానికి చెందిన వారిగా గుర్తించామని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. మృతులు సోమాతి బాలగంగాధరశర్మ, యశోద, డ్రైవర్‌గా గుర్తించారు. కర్ణాటకలోని బళ్లారిలో ఓ వేడుకకు హాజరై గుంటూరుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

డివైడర్​ను ఢీకొట్టిన లారీ : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద సిమెంట్ లోడ్ లారీ బోల్తా పడింది. మాచర్ల నుంచి రేపల్లె వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్​ను ఆస్పత్రికి తరలించారు.

చిరుతను తప్పించబోయి కారు బోల్తా - మహిళ మృతి - Road Accident In Nizamabad

మిర్యాలగూడలో ఫ్లైఓవర్‌పై ఢీకొన్న రెండు కార్లు - ఒకరికి తీవ్ర గాయాలు

Last Updated : Jun 27, 2024, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.