ETV Bharat / state

సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో గెలుపు బీఆర్​ఎస్​దే : ​పద్మారావు గౌడ్​ - Lok Sabha Polls 2024 - LOK SABHA POLLS 2024

Secunderabad BRS MP candidate On victory : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో బీఆర్​ఎస్​ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని చెప్పారు.

Secunderabad BRS MP candidate On victory
Secunderabad BRS MP candidate On victory
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 24, 2024, 4:50 PM IST

Secunderabad BRS MP candidate On victory : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ గెలుపు తథ్యమని ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ నిర్ణయించిన మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్(Parliament) అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమమే తనను గెలిపిస్తుందన్నారు. పద్మారావుకు టికెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్, మాగంటి గోపీనాథ్, మహమూద్​ అలీ పాల్గొన్నారు.

BRS MP candidate Padma Rao fires on congress : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదని ప్రజలు ఆ పార్టీని నమ్మి మోసపోయారని పద్మారావు గౌడ్ తెలిపారు. తెలంగాణలో మోదీ(modi) ప్రభావం అంతగా ఉండదని అన్నారు. తెలంగాణలో సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో పోటీ రసవత్తరంగా ఉంటుందన్నారు. బీఆర్​ఎస్​లో గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్​ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పటిష్ట నాయకత్వంతో పాటు బీఆర్​ఎస్​కు మంచి నాయకుల(Leaders) తోడ్పాటు ఉందన్నారు. నాయకులు పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజలు కాదని స్పష్టం చేశారు.

మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​ - మల్కాజిగిరి బరిలో లక్ష్మారెడ్డి

"రాష్ట్రం మొత్తం మీద సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాష్ట్రం కేంద్రంతో పోరాడాల్సి వస్తోంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ప్రజలనే మా కుటుంబంగా భావించి బరిలో దిగాం. గత ప్రభుత్వంలో పథకాల అమలు తీరు బాగుండేది. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. రాబోయే ప్రభుత్వం మాదే అనే నమ్మకం ఉంది"- పద్మారావు గౌడ్​, సికింద్రాబాద్ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి

Lok Sabha polls : సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ శనివారమే ప్రకటించారు. మరోవైపు ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ తరపున కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు. ముగ్గురు స్థానికులే కావడం, నగరవాసులకు బాగా పరిచయమున్న నేతలు కావడంతో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో గెలుపు బీఆర్​ఎస్​దే : ​పద్మారావు గౌడ్​

మరో 2 లోక్​సభ స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థుల ప్రకటన​ - మెదక్ బరిలో మాజీ ఐఏఎస్ - BRS Lok Sabha Candidates 2024

నిజామాబాద్​లో కుల రాజకీయాలు - ఎంపీ సీటుపై ప్రధాన పార్టీల గురి

'దానం నాగేందర్​పై అనర్హత వేటు వేయాలి' - స్పీకర్​కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

Secunderabad BRS MP candidate On victory : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ గెలుపు తథ్యమని ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ నిర్ణయించిన మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్(Parliament) అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమమే తనను గెలిపిస్తుందన్నారు. పద్మారావుకు టికెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్, మాగంటి గోపీనాథ్, మహమూద్​ అలీ పాల్గొన్నారు.

BRS MP candidate Padma Rao fires on congress : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదని ప్రజలు ఆ పార్టీని నమ్మి మోసపోయారని పద్మారావు గౌడ్ తెలిపారు. తెలంగాణలో మోదీ(modi) ప్రభావం అంతగా ఉండదని అన్నారు. తెలంగాణలో సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో పోటీ రసవత్తరంగా ఉంటుందన్నారు. బీఆర్​ఎస్​లో గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్​ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పటిష్ట నాయకత్వంతో పాటు బీఆర్​ఎస్​కు మంచి నాయకుల(Leaders) తోడ్పాటు ఉందన్నారు. నాయకులు పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజలు కాదని స్పష్టం చేశారు.

మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​ - మల్కాజిగిరి బరిలో లక్ష్మారెడ్డి

"రాష్ట్రం మొత్తం మీద సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాష్ట్రం కేంద్రంతో పోరాడాల్సి వస్తోంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ప్రజలనే మా కుటుంబంగా భావించి బరిలో దిగాం. గత ప్రభుత్వంలో పథకాల అమలు తీరు బాగుండేది. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. రాబోయే ప్రభుత్వం మాదే అనే నమ్మకం ఉంది"- పద్మారావు గౌడ్​, సికింద్రాబాద్ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి

Lok Sabha polls : సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ శనివారమే ప్రకటించారు. మరోవైపు ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ తరపున కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు. ముగ్గురు స్థానికులే కావడం, నగరవాసులకు బాగా పరిచయమున్న నేతలు కావడంతో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో గెలుపు బీఆర్​ఎస్​దే : ​పద్మారావు గౌడ్​

మరో 2 లోక్​సభ స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థుల ప్రకటన​ - మెదక్ బరిలో మాజీ ఐఏఎస్ - BRS Lok Sabha Candidates 2024

నిజామాబాద్​లో కుల రాజకీయాలు - ఎంపీ సీటుపై ప్రధాన పార్టీల గురి

'దానం నాగేందర్​పై అనర్హత వేటు వేయాలి' - స్పీకర్​కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.