ETV Bharat / state

త్వరలోనే మౌలాలి నుంచి సనత్​నగర్ వరకు ఎంఎంటీఎస్ సర్వీస్ : అరుణ్ కుమార్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 6:59 PM IST

Updated : Feb 1, 2024, 7:11 PM IST

Railway Budget For Telangana 2024 : కేంద్రం ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్​పై తెలంగాణ రైల్వే అధికారులతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధులపై ఆయన వివరించారు.

Central Railway Minister Ashwini Vaishnav on Telangana
Railway Budget For Telangana 2024

Railway Budget For Telangana 2024 : బడ్జెట్​లో రైల్వేకు కేటాయింపులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ సంబంధిత రైల్వే అధికారులతో కలిసి కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. అనంతరం రైల్వే జీఎం మాట్లాడారు. ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి కాగా, త్వరలో మౌలాలి నుంచి సనత్​నగర్ వరకు ఎంఎంటీఎస్ సర్వీస్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంఎంటీఎస్ రెండో దశకు నిధులు రావాల్సి ఉందని అన్నారు. నిధులు ఆలస్యంగా రావడం వల్ల పనులు మందకొడిగా జరుగుతున్నట్లు తెలిపారు. చర్లపల్లి టర్మినల్ పనులు కూడా వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో వస్తే పనులు త్వరగా పూర్తై, రైళ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

వెయ్యి కొత్త కోచ్​లు.. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్​.. రైల్వే శాఖకు బడ్జెట్ బూస్ట్

ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో ( Nirmala Seetharaman)​ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్​లో రైల్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే వందే భారత్​ రైళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈసారి బడ్జెట్​లో ఎక్కువ భాగం ప్రయాణికుల సౌకర్యాలు పెంచడానికి దృష్టి సారించినట్లు జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ (Railway GM Arun Kumar) అన్నారు. ఈ బడ్జెట్​లో విద్యుదీకరణ, డబ్లింగ్​కు పెద్దపీట వేశారని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వందే భారత్ రైళ్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయని, ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేరుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మధ్యంతర బడ్జెట్​లోనూ వందే భారత్ రైళ్లపై మరింత దృష్టి సారించారని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 400 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

వేతన జీవులకు ఊరట, ఇళ్లు లేని పేదలకు వరాలు.. అభివృద్ధి భారతావని కోసం ఆశల బడ్జెట్!

Central Railway Minister Ashwini Vaishnav on Telangana : తెలంగాణ రైల్వే అభివృద్ధిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. రాష్ట్రంలో రైల్వే శాఖ అభివృద్ధికి రూ.5,071 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం విద్యుదీకరణ పూర్తయిందన్నారు. రైల్వేశాఖలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. పలు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాని పేర్కొన్నారు.

రైల్వేకు కొత్త సొబగులు- వందేభారత్ ప్రమాణాలతో అన్ని బోగీలు

Railway Budget For Telangana 2024 : బడ్జెట్​లో రైల్వేకు కేటాయింపులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ సంబంధిత రైల్వే అధికారులతో కలిసి కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. అనంతరం రైల్వే జీఎం మాట్లాడారు. ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి కాగా, త్వరలో మౌలాలి నుంచి సనత్​నగర్ వరకు ఎంఎంటీఎస్ సర్వీస్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంఎంటీఎస్ రెండో దశకు నిధులు రావాల్సి ఉందని అన్నారు. నిధులు ఆలస్యంగా రావడం వల్ల పనులు మందకొడిగా జరుగుతున్నట్లు తెలిపారు. చర్లపల్లి టర్మినల్ పనులు కూడా వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో వస్తే పనులు త్వరగా పూర్తై, రైళ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

వెయ్యి కొత్త కోచ్​లు.. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్​.. రైల్వే శాఖకు బడ్జెట్ బూస్ట్

ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో ( Nirmala Seetharaman)​ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్​లో రైల్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే వందే భారత్​ రైళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈసారి బడ్జెట్​లో ఎక్కువ భాగం ప్రయాణికుల సౌకర్యాలు పెంచడానికి దృష్టి సారించినట్లు జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ (Railway GM Arun Kumar) అన్నారు. ఈ బడ్జెట్​లో విద్యుదీకరణ, డబ్లింగ్​కు పెద్దపీట వేశారని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వందే భారత్ రైళ్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయని, ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేరుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మధ్యంతర బడ్జెట్​లోనూ వందే భారత్ రైళ్లపై మరింత దృష్టి సారించారని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 400 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

వేతన జీవులకు ఊరట, ఇళ్లు లేని పేదలకు వరాలు.. అభివృద్ధి భారతావని కోసం ఆశల బడ్జెట్!

Central Railway Minister Ashwini Vaishnav on Telangana : తెలంగాణ రైల్వే అభివృద్ధిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. రాష్ట్రంలో రైల్వే శాఖ అభివృద్ధికి రూ.5,071 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం విద్యుదీకరణ పూర్తయిందన్నారు. రైల్వేశాఖలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. పలు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాని పేర్కొన్నారు.

రైల్వేకు కొత్త సొబగులు- వందేభారత్ ప్రమాణాలతో అన్ని బోగీలు

Last Updated : Feb 1, 2024, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.