ETV Bharat / state

చిట్టి గుండెకు అండగా ప్రజావాణి - చికిత్స అందించాలని ఆదేశం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 10:37 AM IST

Prajavani Responds To a Child Treatment : హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన ఓ సంఘటన మానవత్వంను పరిమళించేలా చేసింది. తమ బిడ్డ గుండె జబ్బుతో బాధపడుతోందని ఓ కుటుంబం అక్కడి అధికారిణి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వారు ఆ శిశువును ప్రభుత్వ అంబులెన్స్‌లో ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Prajavani Program in Hyderabad
Prajavani Program in Hyderabad

Prajavani Responds To a Child Treatment : ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి (Telangana Prajavani) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ సమస్యలపై వినతులు ఇవ్వడానికి తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అర్జీదారులు తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. వాళ్ల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులకు అందిస్తున్నారు. అధికారులు ఆర్జీలు స్వీకరించి దరఖాస్తు దారులకు భరోసా ఇస్తున్నారు.

ప్రజావాణికి విశేష స్పందన - తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు

Prajavani Program in Telangana : తాజాగా ప్రజాభవన్‌లో జరిగిన ఓ సంఘటన మానవత్వాన్ని పరిమళింపజేసింది. యంత్రాంగం అంటే ప్రజల వినతులు స్వీకరించడమే కాదని వారి సమస్యలను పరిష్కరించడమేనని చాటింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ పసికందుకు వెంటనే చికిత్స చేయించాలని నిర్ణయించిన అధికారులు మానవత్వం చాటుకున్నారు. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌ జియాగూడకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో నాలుగు నెలల బాబు ఆనారోగ్యానికి గురయ్యాడు. వారు శిశువును పలు ఆసుపత్రుల్లో చూపించగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారి గుండెకు రంధ్రం ఉన్నట్లు తేల్చారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకోవాలన్నా రేషన్‌ కార్డులో బిడ్డ పేరు ఉండాలి. ప్రైవేట్‌లో రూ.లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం మరింత కుంగిపోయింది.

ప్రజావాణికి పోటెత్తిన దరఖాస్తులు - కాంగ్రెస్​ సర్కారైనా తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు

ఈ నేపథ్యంలో బిడ్డతో సహా తల్లి సునీత మంగళవారం ఉదయం ప్రజాభవన్‌కు వచ్చి నోడల్‌ అధికారిణి దివ్యను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. వెంటనే ఆమె స్పందించి అక్కడే ఉన్న వైద్యులకు శిశువు బాధ్యతలు అప్పగించారు. చికిత్స ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలని బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి అధికారులు సమాచారం ఇచ్చారు.

తల్లీబిడ్డలను వైద్యుల పర్యవేక్షణలో ప్రజాభవన్‌లోనే ఉన్న అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ నిర్ణయంతో తల్లి సునీత, ప్రజాభవన్‌లో వినతి పత్రాలు సమర్పించేందుకు వచ్చిన వారంతా సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రెండు పడక గదుల ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపిన అధికారులు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

ప్రజావాణికి విశేష స్పందన - కలెక్టర్​ కార్యాలయాలకు పోటెత్తిన ప్రజలు

ప్రజావాణికి అనూహ్య స్పందన - ప్రజాభవన్ వద్ద చలిలోనే క్యూ కట్టిన ప్రజలు

Prajavani Responds To a Child Treatment : ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి (Telangana Prajavani) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ సమస్యలపై వినతులు ఇవ్వడానికి తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అర్జీదారులు తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. వాళ్ల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులకు అందిస్తున్నారు. అధికారులు ఆర్జీలు స్వీకరించి దరఖాస్తు దారులకు భరోసా ఇస్తున్నారు.

ప్రజావాణికి విశేష స్పందన - తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు

Prajavani Program in Telangana : తాజాగా ప్రజాభవన్‌లో జరిగిన ఓ సంఘటన మానవత్వాన్ని పరిమళింపజేసింది. యంత్రాంగం అంటే ప్రజల వినతులు స్వీకరించడమే కాదని వారి సమస్యలను పరిష్కరించడమేనని చాటింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ పసికందుకు వెంటనే చికిత్స చేయించాలని నిర్ణయించిన అధికారులు మానవత్వం చాటుకున్నారు. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌ జియాగూడకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో నాలుగు నెలల బాబు ఆనారోగ్యానికి గురయ్యాడు. వారు శిశువును పలు ఆసుపత్రుల్లో చూపించగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారి గుండెకు రంధ్రం ఉన్నట్లు తేల్చారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకోవాలన్నా రేషన్‌ కార్డులో బిడ్డ పేరు ఉండాలి. ప్రైవేట్‌లో రూ.లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం మరింత కుంగిపోయింది.

ప్రజావాణికి పోటెత్తిన దరఖాస్తులు - కాంగ్రెస్​ సర్కారైనా తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు

ఈ నేపథ్యంలో బిడ్డతో సహా తల్లి సునీత మంగళవారం ఉదయం ప్రజాభవన్‌కు వచ్చి నోడల్‌ అధికారిణి దివ్యను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. వెంటనే ఆమె స్పందించి అక్కడే ఉన్న వైద్యులకు శిశువు బాధ్యతలు అప్పగించారు. చికిత్స ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలని బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి అధికారులు సమాచారం ఇచ్చారు.

తల్లీబిడ్డలను వైద్యుల పర్యవేక్షణలో ప్రజాభవన్‌లోనే ఉన్న అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ నిర్ణయంతో తల్లి సునీత, ప్రజాభవన్‌లో వినతి పత్రాలు సమర్పించేందుకు వచ్చిన వారంతా సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రెండు పడక గదుల ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపిన అధికారులు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

ప్రజావాణికి విశేష స్పందన - కలెక్టర్​ కార్యాలయాలకు పోటెత్తిన ప్రజలు

ప్రజావాణికి అనూహ్య స్పందన - ప్రజాభవన్ వద్ద చలిలోనే క్యూ కట్టిన ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.