ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు దస్త్రాలు దగ్ధం - అధికారులే కాల్చేశారనే ఆరోపణలు - Polavaram Files Burnt

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 6:27 PM IST

Polavaram Project Files Burnt : ఏపీలోని మదనపల్లె ఫైల్స్ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు పోలవరం ఫైల్స్ దగ్దం కలకలం సృష్టిస్తోంది. పీపీఏ కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. భూసేకరణ సంబంధించిన దస్త్రాలే మంటల్లో కాలిపోయాయని తెలుస్తోంది. నిర్వాసితుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే ఫైల్స్ కాల్చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Polavaram Project Files Burnt
Polavaram Project Files Burnt (ETV Bharat)

Polavaram Project Files Burnt : ఆంధ్రప్రదేశ్ అధికారం కోల్పోగానే కీలకమైన దస్త్రాలను మంటలపాలు కావడం రివాజుగా మారింది. మొన్నటికి మొన్న మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖకు సంబంధించిన దస్త్రాలు దహనం అయిపోయాయి. భూ అక్రమాలకు ఆధారాల్లేకుండా నిజాలకు నిప్పు పెట్టారు. ఆ ఘటనపై దర్యాప్తు సాగుతుండగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రాలు దగ్ధం కావడం కలకలం రేపుతోంది.

నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు ఏదైనా కిరికిరి ఉంటే తప్ప దస్త్రాలు కాల్చేయడానికి పెద్ద కారణాలు ఉండవు. ఈ పోలవరం ఫైల్స్‌లోనూ అదే స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేతలు ఐదేళ్ల పాలనలో చేసిన అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో దస్త్రాలు తగలబెట్టారని జోరుగా ప్రచారం సాగుతోంది.

భూసేకరణ సంబంధించిన దస్త్రాలు దగ్ధం? : ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం కావడం చర్చనీయాంశమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ సంబంధించిన దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే కార్యాలయంలోని అధికారులే దస్త్రాలు కాల్చేశారని అనుమానం కలుగుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. శుక్రవారం రాత్రి దస్త్రాలు తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఫైల్స్ ఎందుకు కాల్చేశారు? : కాల్చివేసిన దస్త్రాలను ఇంఛార్జి సబ్ కలెక్టర్ శివ జ్యోతి, డీఎస్పీ భవ్య కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించారు. సగం కాలిపోయిన దస్త్రాలను స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేసిన పరిహారం సంబంధించిన దస్త్రాలుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుమతి తీసుకోకుండానే శుక్రవారం రాత్రి కార్యాలయం సిబ్బంది దస్త్రాలు తగలబెట్టేశారని తెలుస్తోంది.

ఫైల్స్ ఎందుకు కాల్చేశారు? అనే అంశాలపై అధికారుల బృందం ఆరా తీస్తోంది. దస్త్రాల దగ్ధంపై విచారణ చేస్తున్నట్లు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వేదవల్లి తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ రెండ్రోజుల క్రితం లీవ్‌పై వెళ్లారని తనను ఇంఛార్జిగా నియమించినట్లు వెల్లడించారు. తనకు తెలియకుండా స్వీపర్ దస్త్రాలను కాల్చేశారని చెబుతున్నారు.

ఎంత పెద్దవారైనా శిక్షిస్తాం : వైఎస్సార్సీపీ అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్త్రాలు దగ్ధం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దీనికి బాధ్యలెవరో దర్యాప్తు ఎంత పెద్దవారైనా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు శాపంలా జగన్‌ - నిపుణుల కమిటీ నివేదికే కీలకం: చంద్రబాబు - white paper on polavaram project

జగన్‌ రెడ్డి నిర్లక్ష్యంతో పోలవరానికి కొత్త చిక్కులు - ఐదేళ్లు వెనక్కి వెళ్లిందిగా! - Polavaram Project in AP

Polavaram Project Files Burnt : ఆంధ్రప్రదేశ్ అధికారం కోల్పోగానే కీలకమైన దస్త్రాలను మంటలపాలు కావడం రివాజుగా మారింది. మొన్నటికి మొన్న మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖకు సంబంధించిన దస్త్రాలు దహనం అయిపోయాయి. భూ అక్రమాలకు ఆధారాల్లేకుండా నిజాలకు నిప్పు పెట్టారు. ఆ ఘటనపై దర్యాప్తు సాగుతుండగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రాలు దగ్ధం కావడం కలకలం రేపుతోంది.

నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు ఏదైనా కిరికిరి ఉంటే తప్ప దస్త్రాలు కాల్చేయడానికి పెద్ద కారణాలు ఉండవు. ఈ పోలవరం ఫైల్స్‌లోనూ అదే స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేతలు ఐదేళ్ల పాలనలో చేసిన అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో దస్త్రాలు తగలబెట్టారని జోరుగా ప్రచారం సాగుతోంది.

భూసేకరణ సంబంధించిన దస్త్రాలు దగ్ధం? : ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం కావడం చర్చనీయాంశమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ సంబంధించిన దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే కార్యాలయంలోని అధికారులే దస్త్రాలు కాల్చేశారని అనుమానం కలుగుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. శుక్రవారం రాత్రి దస్త్రాలు తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఫైల్స్ ఎందుకు కాల్చేశారు? : కాల్చివేసిన దస్త్రాలను ఇంఛార్జి సబ్ కలెక్టర్ శివ జ్యోతి, డీఎస్పీ భవ్య కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించారు. సగం కాలిపోయిన దస్త్రాలను స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేసిన పరిహారం సంబంధించిన దస్త్రాలుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుమతి తీసుకోకుండానే శుక్రవారం రాత్రి కార్యాలయం సిబ్బంది దస్త్రాలు తగలబెట్టేశారని తెలుస్తోంది.

ఫైల్స్ ఎందుకు కాల్చేశారు? అనే అంశాలపై అధికారుల బృందం ఆరా తీస్తోంది. దస్త్రాల దగ్ధంపై విచారణ చేస్తున్నట్లు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వేదవల్లి తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ రెండ్రోజుల క్రితం లీవ్‌పై వెళ్లారని తనను ఇంఛార్జిగా నియమించినట్లు వెల్లడించారు. తనకు తెలియకుండా స్వీపర్ దస్త్రాలను కాల్చేశారని చెబుతున్నారు.

ఎంత పెద్దవారైనా శిక్షిస్తాం : వైఎస్సార్సీపీ అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్త్రాలు దగ్ధం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దీనికి బాధ్యలెవరో దర్యాప్తు ఎంత పెద్దవారైనా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు శాపంలా జగన్‌ - నిపుణుల కమిటీ నివేదికే కీలకం: చంద్రబాబు - white paper on polavaram project

జగన్‌ రెడ్డి నిర్లక్ష్యంతో పోలవరానికి కొత్త చిక్కులు - ఐదేళ్లు వెనక్కి వెళ్లిందిగా! - Polavaram Project in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.