ETV Bharat / state

మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ - హైదరాబాద్ నుంచి మంగళగిరికి తరలింపు - EX MP Nandigam Suresh Arrest

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 8:19 AM IST

AP EX MP Nandigam Suresh Arrest : ఏపీ వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయణ్ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరికి తరలిస్తున్నారు.

AP YSRCP Former MP Nandigam Suresh Arrested
AP EX MP Nandigam Suresh Arrest (ETV Bharat)

AP YSRCP Former MP Nandigam Suresh Arrested : ఏపీ వైఎస్సార్సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు హైదరాబాద్​లో అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయణ్ని అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని వారి ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు.

అయితే అరెస్ట్ భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు సురేష్‌ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది.

దీంతో హైదరాబాద్‌ వెళ్లిన ప్రత్యేక బలగాలు సురేష్​ను అరెస్ట్ చేసి మంగళగిరి తరలిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు.

AP YSRCP Former MP Nandigam Suresh Arrested : ఏపీ వైఎస్సార్సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు హైదరాబాద్​లో అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయణ్ని అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని వారి ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు.

అయితే అరెస్ట్ భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు సురేష్‌ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది.

దీంతో హైదరాబాద్‌ వెళ్లిన ప్రత్యేక బలగాలు సురేష్​ను అరెస్ట్ చేసి మంగళగిరి తరలిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు.

దుబాయ్​కు పారిపోయేందుకు దేవినేని అవినాశ్ ​ప్లాన్ - అడ్డు చెప్పిన శంషాబాద్​ ఎయిర్​పోర్టు పోలీసులు - Police Stop to D Avinash in airport

'ఇన్నాళ్లకు ఊపుకొంటూ వచ్చారా?' - వైఎస్సార్​సీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు - Public Fire on YSRCP Leaders

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.