ETV Bharat / state

పోలీస్ బందోబస్తు మధ్య చేపల విక్రయం - అంత స్పెషల్ ఏంటంటే? - KG Fish Rs100 in Khammam

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 4:39 PM IST

Updated : Jun 21, 2024, 5:29 PM IST

KG Fish Rs.100 in Khammam Enkoor : పోలీసుల బందోబస్తుతో చేపలు విక్రయించడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? అంతేముండదు, ఎక్కడైన చేపలు అమ్మడానికి పోలీసులు కాపలా కాస్తారా ఏంటి అనుకుంటున్నారా? అయినా అవి ఎక్కడికి పోయినా దొరుకుతాయి, మార్కెట్లలో అయితే పుష్కలంగా లభిస్తాయి వాటికి అమ్మడానికి పోలీసులు బందోబస్తు ఏం ఉండదు ఉట్టి మాటలే అని అంటే మాత్రం మీరు తప్పుగా మాట్లాడినట్టే అవుతుంది. ఎందుకంటే ఖమ్మంకు చెందిన ఓ యజమాని చేపలు విక్రయించేందుకు పోలీసులు కాపలా కాశారు. కాదు కాయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకి ఏమైంది అంటే.

People Lined Up for Fish in Khammam
KG Fish Rs.100 in Khammam Enkoor (ETV Bharat)

People Lined Up for Fish in Khammam : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటలో చేపల కోసం జనం తొక్కిసలాడారు. ఆ గ్రామంలోని చెరువు వద్ద కిలో అతి తక్కువ ధరకే విక్రయించడంతో వివిధ మండలాల నుంచి జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. రద్దీ పెరిగి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వారి కాపలా మధ్య చేపల విక్రయం జరిగింది.

ఒక్క చేప రూ. 2 లక్షలు - పులస కూడా కాదండీ.. ఆయ్! - 2 KACHIDI FISH COST 4 LAKH RUPEES

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటకు చెందిన ఒక వ్యక్తికి చేపల చెరువు ఉంది. అందులో ఉన్న చేపలను విక్రయానికి పెట్టాడు. అది కూడా కిలో కేవలం రూ. 100కే. అతను చెరువు దగ్గరే చేపలను అమ్మడం మొదలు పెట్టాడు. కిలో చేపలు కేవలం రూ.100కే అన్న విషయం ఊరూరా పాకింది. ఎలాగో వాతావరణం చల్లబడుతుంది అలాగే మాంచి చేపల పులుసు, ఫ్రై చేసుకోవచ్చు అనుకున్నారో ఏమో అంతే వివిధ మండలాల నుంచి పెద్దఎత్తున ప్రజలు పోటెత్తారు.

వచ్చిన జనాన్ని చూసిన యజమాని ఏకంగా ఇనుప ముళ్లకంచె ఏర్పాటు చేశాడు. అయినా జనం తోపులాట తగ్గకపోవడం, గూమిగూడటంతో పోలీసులకు ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. వారి భద్రత మధ్య చేపల విక్రయం జరిగింది. అయితే క్యూలైన్ భారీగా ఉండటంతో కొనేందుకు వచ్చిన వారు గంటల తరబడి ఎండలో నిల్చోని అవస్థలు పడ్డారు. పైగా కొనడానికి వచ్చిన వారు 'చెరువు దగ్గరే మేము ఉండేది మాకే ముందుగా ఇవ్వాలంటూ' డిమాండ్ చేశారు. పోలీసుల సాయంతో చేపల చెరువు యజమాని విక్రయాలు ముగించాడు. మొత్తానికి మృగశిర కార్తె రోజు చూసిన డిమాండ్ ఇవాళ ఈ ఊరిలో కనిపించింది.

మత్స్యకారుల వలలో చిక్కిన 20 కిలోల భారీ చేప - 20 kg Fish Caught

350kg Fish Viral Video : జాలర్లకు చిక్కిన 350కిలోల 'మురు' చేప.. వీడియో చూశారా?

People Lined Up for Fish in Khammam : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటలో చేపల కోసం జనం తొక్కిసలాడారు. ఆ గ్రామంలోని చెరువు వద్ద కిలో అతి తక్కువ ధరకే విక్రయించడంతో వివిధ మండలాల నుంచి జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. రద్దీ పెరిగి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వారి కాపలా మధ్య చేపల విక్రయం జరిగింది.

ఒక్క చేప రూ. 2 లక్షలు - పులస కూడా కాదండీ.. ఆయ్! - 2 KACHIDI FISH COST 4 LAKH RUPEES

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటకు చెందిన ఒక వ్యక్తికి చేపల చెరువు ఉంది. అందులో ఉన్న చేపలను విక్రయానికి పెట్టాడు. అది కూడా కిలో కేవలం రూ. 100కే. అతను చెరువు దగ్గరే చేపలను అమ్మడం మొదలు పెట్టాడు. కిలో చేపలు కేవలం రూ.100కే అన్న విషయం ఊరూరా పాకింది. ఎలాగో వాతావరణం చల్లబడుతుంది అలాగే మాంచి చేపల పులుసు, ఫ్రై చేసుకోవచ్చు అనుకున్నారో ఏమో అంతే వివిధ మండలాల నుంచి పెద్దఎత్తున ప్రజలు పోటెత్తారు.

వచ్చిన జనాన్ని చూసిన యజమాని ఏకంగా ఇనుప ముళ్లకంచె ఏర్పాటు చేశాడు. అయినా జనం తోపులాట తగ్గకపోవడం, గూమిగూడటంతో పోలీసులకు ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. వారి భద్రత మధ్య చేపల విక్రయం జరిగింది. అయితే క్యూలైన్ భారీగా ఉండటంతో కొనేందుకు వచ్చిన వారు గంటల తరబడి ఎండలో నిల్చోని అవస్థలు పడ్డారు. పైగా కొనడానికి వచ్చిన వారు 'చెరువు దగ్గరే మేము ఉండేది మాకే ముందుగా ఇవ్వాలంటూ' డిమాండ్ చేశారు. పోలీసుల సాయంతో చేపల చెరువు యజమాని విక్రయాలు ముగించాడు. మొత్తానికి మృగశిర కార్తె రోజు చూసిన డిమాండ్ ఇవాళ ఈ ఊరిలో కనిపించింది.

మత్స్యకారుల వలలో చిక్కిన 20 కిలోల భారీ చేప - 20 kg Fish Caught

350kg Fish Viral Video : జాలర్లకు చిక్కిన 350కిలోల 'మురు' చేప.. వీడియో చూశారా?

Last Updated : Jun 21, 2024, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.