ETV Bharat / state

తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదన్న టీజీపీఎస్సీ - నిరుద్యోగుల్లో గందరగోళం

ఉద్యోగ పరీక్షలకు ఇప్పటివరకు తెలుగు అకాడమీ పుస్తకాలనే నమ్ముతున్న అభ్యర్థులు- ఇందుకు భిన్నంగా హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు - నిరుద్యోగుల్లో గందరగోళం

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Telugu Academy Books In Telangana
Telugu Academy Books For Competitive Exams (ETV Bharat)

Telugu Academy Books For Competitive Exams : ఉద్యోగ పరీక్షల్లో ఏ ప్రశ్న వచ్చినా తెలుగు అకాడమీ ముద్రిస్తున్న పుస్తకాలే ప్రామాణికం. ఈ పుస్తకాల ద్వారానే అభ్యర్థులు రాసిన పరీక్షలకు జవాబులు చూసుకుంటారు. తాజాగా టీజీపీఎస్సీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆ పుస్తకాలు ప్రామాణికం కాదని, నిపుణుల కమిటీదే తుది నిర్ణయమని పేర్కొనడంతో అభ్యర్థులు, నిరుద్యోగులు ఆలోచనలో పడ్డారు. రానున్నరోజుల్లో ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఏ పుస్తకాలు, మెటీరియల్‌ చదవాలన్నది సమాధానం దొరకని ప్రశ్నలుగా తయారయ్యాయి.

గ్రూపు-1 తుది కీపై కొందరు ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం తెలుగు అకాడమీ పుస్తకాల్లోని జవాబులను గుర్తించినా వాటిని పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌ తరఫు న్యాయవాది వాదించడం ఆ పుస్తకాల్లో రిఫరెన్స్‌లు లేవని, రీసెర్చ్‌ వర్క్‌ చేయలేదని, నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే తుది ఫలితాలు విడుదల చేశామని టీజీపీఎస్సీ పేర్కొన్న నేపథ్యంలో ఈ గందరగోళం నెలకొంది. దీనిపై హైకోర్టులో ఈనెల 18న తదుపరి విచారణ జరగనుంది.

నిరుద్యోగుల్లో గందరగోళం : ఇప్పటివరకు ఉద్యోగ పోటీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా భావిస్తూ ఉంటారు. వాటికోసం ఎదురుచూస్తుంటారు. మార్కెట్లోకి ఎన్నో పుస్తకాలు వస్తున్నా అకాడమీ పుస్తకం చదవకుండా కొనకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు చాలా తక్కువ. గ్రూప్‌ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడినప్పుడు పెద్ద ఎత్తున ఈ పుస్తకాలకు డిమాండ్‌ ఉంటుంది. అకాడమీ సకాలంలో డిమాండ్‌ మేరకు సమకూర్చలేక చేతులెత్తేసిన సందర్భాలు ఎన్నో. ఈ పరిస్థితుల్లో టీజీపీఎస్సీ తాజాగా హైకోర్టులో వినిపించిన వాదనలు అభ్యర్థులను అయోమయంలోకి నెట్టాయి.

అకాడమీ డిగ్రీ పాఠ్య పుస్తకాలతోపాటు ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమైన చరిత్ర, జాగ్రఫీ, వర్తమాన వ్యవహారాలు, ఆర్థికశాస్త్రం తదితర పుస్తకాలను ముద్రిస్తోంది. రచయితలను ఎంపిక చేసి పుస్తకాలను రాయిస్తుంది. ప్రతి పుస్తకానికి ఎడిటర్‌ కూడా ఉంటారు. వాటిని అకాడమీలో సబ్జెక్టుల వారీగా ఉండే ఇన్‌ఛార్జులు సైతం పరిశీలిస్తారు. ఆ తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తారు.అయినా ఆ పుస్తకాలపై టీజీపీఎస్సీ అభ్యంతరాలను లేవనెత్తడంతో అకాడమీ వర్గాలు సైతం అయోమయంలో పడ్డాయి. తరచూ తాజా అంశాలను జోడిస్తూ పునఃముద్రణ చేయడం, పుస్తకాల్లో ఏమైన తప్పులుంటే ఈ-మెయిల్, వాట్సప్‌ ద్వారా అభ్యంతరాలను స్వీకరించడం నిరంతరం జరగాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు అకాడమీ వర్గాలు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత టీజీపీఎస్సీ లేవనెత్తిన అంశాలపై కమిషన్‌ అధికారులతో సమావేశమై చర్చిస్తామని తెలిపాయి.

చెత్త కాగితాల దుకాణంలో పాఠ్యపుస్తకాలు- డబ్బుల కక్కుర్తితో అమ్మినట్లు ఆరోపణలు - Govt textbooks In Scrap shop

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా? ఈ టాప్​-10 పర్సనల్​ ఫైనాన్స్​ బుక్స్​పై ఓ లుక్కేయండి! - Best Personal Finance Books

Telugu Academy Books For Competitive Exams : ఉద్యోగ పరీక్షల్లో ఏ ప్రశ్న వచ్చినా తెలుగు అకాడమీ ముద్రిస్తున్న పుస్తకాలే ప్రామాణికం. ఈ పుస్తకాల ద్వారానే అభ్యర్థులు రాసిన పరీక్షలకు జవాబులు చూసుకుంటారు. తాజాగా టీజీపీఎస్సీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆ పుస్తకాలు ప్రామాణికం కాదని, నిపుణుల కమిటీదే తుది నిర్ణయమని పేర్కొనడంతో అభ్యర్థులు, నిరుద్యోగులు ఆలోచనలో పడ్డారు. రానున్నరోజుల్లో ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఏ పుస్తకాలు, మెటీరియల్‌ చదవాలన్నది సమాధానం దొరకని ప్రశ్నలుగా తయారయ్యాయి.

గ్రూపు-1 తుది కీపై కొందరు ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం తెలుగు అకాడమీ పుస్తకాల్లోని జవాబులను గుర్తించినా వాటిని పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌ తరఫు న్యాయవాది వాదించడం ఆ పుస్తకాల్లో రిఫరెన్స్‌లు లేవని, రీసెర్చ్‌ వర్క్‌ చేయలేదని, నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే తుది ఫలితాలు విడుదల చేశామని టీజీపీఎస్సీ పేర్కొన్న నేపథ్యంలో ఈ గందరగోళం నెలకొంది. దీనిపై హైకోర్టులో ఈనెల 18న తదుపరి విచారణ జరగనుంది.

నిరుద్యోగుల్లో గందరగోళం : ఇప్పటివరకు ఉద్యోగ పోటీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా భావిస్తూ ఉంటారు. వాటికోసం ఎదురుచూస్తుంటారు. మార్కెట్లోకి ఎన్నో పుస్తకాలు వస్తున్నా అకాడమీ పుస్తకం చదవకుండా కొనకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు చాలా తక్కువ. గ్రూప్‌ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడినప్పుడు పెద్ద ఎత్తున ఈ పుస్తకాలకు డిమాండ్‌ ఉంటుంది. అకాడమీ సకాలంలో డిమాండ్‌ మేరకు సమకూర్చలేక చేతులెత్తేసిన సందర్భాలు ఎన్నో. ఈ పరిస్థితుల్లో టీజీపీఎస్సీ తాజాగా హైకోర్టులో వినిపించిన వాదనలు అభ్యర్థులను అయోమయంలోకి నెట్టాయి.

అకాడమీ డిగ్రీ పాఠ్య పుస్తకాలతోపాటు ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమైన చరిత్ర, జాగ్రఫీ, వర్తమాన వ్యవహారాలు, ఆర్థికశాస్త్రం తదితర పుస్తకాలను ముద్రిస్తోంది. రచయితలను ఎంపిక చేసి పుస్తకాలను రాయిస్తుంది. ప్రతి పుస్తకానికి ఎడిటర్‌ కూడా ఉంటారు. వాటిని అకాడమీలో సబ్జెక్టుల వారీగా ఉండే ఇన్‌ఛార్జులు సైతం పరిశీలిస్తారు. ఆ తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తారు.అయినా ఆ పుస్తకాలపై టీజీపీఎస్సీ అభ్యంతరాలను లేవనెత్తడంతో అకాడమీ వర్గాలు సైతం అయోమయంలో పడ్డాయి. తరచూ తాజా అంశాలను జోడిస్తూ పునఃముద్రణ చేయడం, పుస్తకాల్లో ఏమైన తప్పులుంటే ఈ-మెయిల్, వాట్సప్‌ ద్వారా అభ్యంతరాలను స్వీకరించడం నిరంతరం జరగాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు అకాడమీ వర్గాలు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత టీజీపీఎస్సీ లేవనెత్తిన అంశాలపై కమిషన్‌ అధికారులతో సమావేశమై చర్చిస్తామని తెలిపాయి.

చెత్త కాగితాల దుకాణంలో పాఠ్యపుస్తకాలు- డబ్బుల కక్కుర్తితో అమ్మినట్లు ఆరోపణలు - Govt textbooks In Scrap shop

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా? ఈ టాప్​-10 పర్సనల్​ ఫైనాన్స్​ బుక్స్​పై ఓ లుక్కేయండి! - Best Personal Finance Books

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.