ETV Bharat / state

ట్రాఫిక్ రూల్స్ మారాయి బాస్ - హద్దు దాటారో తాట తీస్తారు! - NEW TRAFFIC RULES IN TELANGANA

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 10:08 AM IST

New traffic Rules in Telangana : రాష్ట్రంలో నూతన రహదారి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

New traffic rules
New traffic rules (ETV Bharat)

New Traffic Rules in Telangana From Today : రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, తాగి డ్రైవింగ్ చేయడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి స్థాయి ఫలితాలు కనిపించడం లేదు. అందులో భాంగంగా, కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన రహదారి నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

మద్యం మత్తులో, ఇష్టారీతిన వాహనాలు నడపడం, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు కుటుంబాలకు చేదు జ్ఞాపకాలు మిగుల్చుతున్నాయి. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు(మైనర్లు) వాహనాలు ఇవ్వడం ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగితే అందరూ రెండు రోజులు హడావుడి చేసి మర్చిపోతారు. కన్నవారు, కట్టుకున్న వారికి మాత్రం జీవితాంతం చేదు జ్ఞాపకమే మిగులుతోంది. ఇలాంటి వాటి కట్టడికి నిబంధనలు కఠినతరం కానున్నాయి.

మారిన ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. బాలల చేతుల్లో మారణాయుధాలుగా మారుతున్న వాహనాలను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరమని అన్నారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.

మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేల జరిమానాతో విధిస్తారు. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందకుండా ఆంక్షలు ఉంటాయి. అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపినా, పరిమితికి మించి ప్రయాణించినా, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోయినా, రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు జరిమానా వేయనున్నారు.

ఒకే బండిపై 103 చలానాలు.. బకాయి ఎంతంటే..?

డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనల మార్పు: ఇప్పటి వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. అక్కడ స్లాట్‌ బుక్‌ చేసుకొని గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. డ్రైవింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణులైతే లైసెన్స్‌ జారీ చేసేవారు. నూతన నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌ పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రైవేటు డ్రైవింగ్‌ స్కూల్​లో ప్రభుత్వం లైసెన్స్‌లు జారీ చేసే అధికారం ఇచ్చింది.

మారిన ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు వారం పాటు అవగాహన కల్పిస్తాం. అనంతరం చర్యలకు ఉపక్రమిస్తాం. అయితే బాలల చేతుల్లో మారణాయుధాలుగా మారుతున్న వాహనాలను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరం. లేకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గరాజు, సీఐ, వికారాబాద్

హైదరాబాద్​లో ట్రాఫిక్ కొత్త రూల్స్.. గీతదాటితే రూ.100, అడ్డుపడితే రూ.1000 కట్టాల్సిందే..

New Traffic Rules in Telangana From Today : రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, తాగి డ్రైవింగ్ చేయడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి స్థాయి ఫలితాలు కనిపించడం లేదు. అందులో భాంగంగా, కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన రహదారి నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

మద్యం మత్తులో, ఇష్టారీతిన వాహనాలు నడపడం, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు కుటుంబాలకు చేదు జ్ఞాపకాలు మిగుల్చుతున్నాయి. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు(మైనర్లు) వాహనాలు ఇవ్వడం ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగితే అందరూ రెండు రోజులు హడావుడి చేసి మర్చిపోతారు. కన్నవారు, కట్టుకున్న వారికి మాత్రం జీవితాంతం చేదు జ్ఞాపకమే మిగులుతోంది. ఇలాంటి వాటి కట్టడికి నిబంధనలు కఠినతరం కానున్నాయి.

మారిన ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. బాలల చేతుల్లో మారణాయుధాలుగా మారుతున్న వాహనాలను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరమని అన్నారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.

మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేల జరిమానాతో విధిస్తారు. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందకుండా ఆంక్షలు ఉంటాయి. అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపినా, పరిమితికి మించి ప్రయాణించినా, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోయినా, రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు జరిమానా వేయనున్నారు.

ఒకే బండిపై 103 చలానాలు.. బకాయి ఎంతంటే..?

డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనల మార్పు: ఇప్పటి వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. అక్కడ స్లాట్‌ బుక్‌ చేసుకొని గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. డ్రైవింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణులైతే లైసెన్స్‌ జారీ చేసేవారు. నూతన నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌ పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రైవేటు డ్రైవింగ్‌ స్కూల్​లో ప్రభుత్వం లైసెన్స్‌లు జారీ చేసే అధికారం ఇచ్చింది.

మారిన ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు వారం పాటు అవగాహన కల్పిస్తాం. అనంతరం చర్యలకు ఉపక్రమిస్తాం. అయితే బాలల చేతుల్లో మారణాయుధాలుగా మారుతున్న వాహనాలను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరం. లేకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గరాజు, సీఐ, వికారాబాద్

హైదరాబాద్​లో ట్రాఫిక్ కొత్త రూల్స్.. గీతదాటితే రూ.100, అడ్డుపడితే రూ.1000 కట్టాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.