ETV Bharat / state

అవ్వ - తాతలకు గుడ్​న్యూస్​ - జనవరి నుంచి కొత్త పింఛన్లు

జనవరిలోపే అనర్హుల ఏరివేత - విధివిధానాల రూపకల్పనకు 8 మంది మంత్రులతో ఉపసంఘం

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

NTR BHAROSA SCEME IN AP
NEW PENSION FOR AP PEOPLE (ETV Bharat)

New Pensions Released From January in AP : ఏపీ ప్రభుత్వం జనవరిలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. జన్మభూమి-2 కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు మార్గసూచి సిద్ధం చేసినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో అనర్హులకు ఇబ్బడిముబ్బడిగా పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ప్రధానంగా కొన్ని వేల మంది అనర్హులు దివ్యాంగుల కేటగిరీలో తప్పుడు సదరం ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వైఎస్సార్‌, అనంతపురం జిల్లాలతో పాటు మరికొన్నిచోట్ల ఇది బట్టబయలైంది.

చేనేత పింఛన్లలోనూ అనర్హులు ఉన్నట్లు తేలింది. దీంతో అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. పింఛన్ల తనిఖీ, కొత్త పింఛన్ల మంజూరుకు విధివిధానాల రూపకల్పన కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్, డోలా బాల వీరాంజనేయస్వామి, గుమ్మిడి సంధ్యారాణి, సవితలతో ఉపసంఘం ఏర్పాటుకు రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కమిటీ ఏర్పాటైన 10-15 రోజుల్లోగా ప్రభుత్వానికి అందించనున్నట్టు తెలిసింది.

పింఛను కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? - ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది!! - HOW TO APPLY FOR PENSION IN ONLINE

50 రోజుల ప్రణాళిక : కొత్త పింఛన్ల ఎంపికకు నవంబర్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదే నెలలో పింఛన్ల తనిఖీ చేపడతారు. 45 రోజుల్లో అనర్హులకు నోటీసులిచ్చి, పింఛన్లు తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. అర్హులెవరికీ అన్యాయం జరగకుండా పింఛన్ల జాబితాను గ్రామ సభల్లో ప్రజల ముందు పెడతారు. అక్కడ ఏవైనా ఫిర్యాదులు వస్తే సరిచేస్తారు. మొత్తంగా డిసెంబర్‌ చివరి నాటికి కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రస్తుత పింఛన్లలో అనర్హుల ఏరివేత పూర్తి చేయనున్నట్టు తెలిసింది.

2.32 లక్షల మందికి పింఛన్ ఇవ్వకుండా జగన్‌ మోసం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ పింఛను అందిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్‌, ఎన్నికల నాటికి 2.32 లక్షల మందికి పింఛన్ ఇవ్వకుండా నిలిపేశారు. 2023 సెప్టెంబర్‌ నాటికే వీరందరూ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం వీరిలో కొంతమందికి మాత్రమే మంజూరు చేసి, మిగతా వారికి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలిస్తుందా లేదా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తారా అనేది మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించనుంది.

అర్హులందరికీ త్వరలోనే రేషన్‌కార్డులు, పింఛన్లు - మంత్రి పొంగులేటి - minister ponguleti srinivas reddy

గత ప్రభుత్వ ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయి : కాగ్​

New Pensions Released From January in AP : ఏపీ ప్రభుత్వం జనవరిలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. జన్మభూమి-2 కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు మార్గసూచి సిద్ధం చేసినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో అనర్హులకు ఇబ్బడిముబ్బడిగా పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ప్రధానంగా కొన్ని వేల మంది అనర్హులు దివ్యాంగుల కేటగిరీలో తప్పుడు సదరం ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వైఎస్సార్‌, అనంతపురం జిల్లాలతో పాటు మరికొన్నిచోట్ల ఇది బట్టబయలైంది.

చేనేత పింఛన్లలోనూ అనర్హులు ఉన్నట్లు తేలింది. దీంతో అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. పింఛన్ల తనిఖీ, కొత్త పింఛన్ల మంజూరుకు విధివిధానాల రూపకల్పన కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్, డోలా బాల వీరాంజనేయస్వామి, గుమ్మిడి సంధ్యారాణి, సవితలతో ఉపసంఘం ఏర్పాటుకు రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కమిటీ ఏర్పాటైన 10-15 రోజుల్లోగా ప్రభుత్వానికి అందించనున్నట్టు తెలిసింది.

పింఛను కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? - ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది!! - HOW TO APPLY FOR PENSION IN ONLINE

50 రోజుల ప్రణాళిక : కొత్త పింఛన్ల ఎంపికకు నవంబర్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదే నెలలో పింఛన్ల తనిఖీ చేపడతారు. 45 రోజుల్లో అనర్హులకు నోటీసులిచ్చి, పింఛన్లు తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. అర్హులెవరికీ అన్యాయం జరగకుండా పింఛన్ల జాబితాను గ్రామ సభల్లో ప్రజల ముందు పెడతారు. అక్కడ ఏవైనా ఫిర్యాదులు వస్తే సరిచేస్తారు. మొత్తంగా డిసెంబర్‌ చివరి నాటికి కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రస్తుత పింఛన్లలో అనర్హుల ఏరివేత పూర్తి చేయనున్నట్టు తెలిసింది.

2.32 లక్షల మందికి పింఛన్ ఇవ్వకుండా జగన్‌ మోసం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ పింఛను అందిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్‌, ఎన్నికల నాటికి 2.32 లక్షల మందికి పింఛన్ ఇవ్వకుండా నిలిపేశారు. 2023 సెప్టెంబర్‌ నాటికే వీరందరూ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం వీరిలో కొంతమందికి మాత్రమే మంజూరు చేసి, మిగతా వారికి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలిస్తుందా లేదా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తారా అనేది మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించనుంది.

అర్హులందరికీ త్వరలోనే రేషన్‌కార్డులు, పింఛన్లు - మంత్రి పొంగులేటి - minister ponguleti srinivas reddy

గత ప్రభుత్వ ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయి : కాగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.