ETV Bharat / state

కుటుంబ బంధాలను అప‌హాస్యం చేస్తే చట్టపరంగా చర్యలు : మంత్రి సీతక్క - Seethakka on Abuse of Social Media

Minister Seethakka Serious on Child Abuse : తండ్రీ కుమార్తెల బంధాన్ని వక్రీకరిస్తూ, సామాజిక మాధ్యమంలో అసభ్యకర వ్యాఖ్యలకు పాల్పడిన ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి సహించేది లేదన్న ఆమె, నిందితులకు కఠిన శిక్షణ పడేలా చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, సోషల్ మీడియా దుర్వినియోగంపై క‌ఠినంగా వ్యవహరిస్తామని ఉద్ఘాటించారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 8:37 PM IST

Updated : Jul 8, 2024, 10:15 PM IST

Seethakka Fire on Abuse of Social Media
Minister Seethakka Serious on Child Abuse (ETV Bharat)

Minister Seethakka Fire on Abuse of Social Media : సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్షణ పడేలా చేస్తామని మంత్రి తెలిపారు. పోలీసులు ఇప్పటికే కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు.

సోషల్ మీడియా దుర్వినియోగంపై క‌ఠినంగా వ్యవహరిస్తాం : తండ్రీ కుమార్తె మధ్య అనుబంధం, అనురాగాల్ని కొన్ని మృగాలు అసభ్యంగా వక్రీకరించడం దారుణమని సీతక్క వ్యాఖ్యానించారు. కొందరు వారి అసభ్యకరమైన ఆలోచనను తండ్రీ కుమార్తెకు అంటగట్టడం దుర్మార్గమైన చర్యగా మంత్రి అభివర్ణించారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, చవక హాస్యం కోసం కుటుంబ సంబంధాల‌ను అప‌హ‌స్యం చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగ ప‌రుస్తున్న అసాంఘిక శ‌క్తుల‌కు అడ్డుకట్ట పడేలా చ‌ట్టప‌రంగా క‌ఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

"తండ్రీ కుమార్తెల మధ్య ఉన్న అనుబంధాన్ని కొంతమంది నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాళ్ల తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైన ఆలోచనను అంటగడుతున్నారు. ఈ మేరకు వాళ్లకు ఉండేటటువంటి నికృష్ట ఆలోచనకు సోషల్​ మీడియా వేదిక అవ్వటం జరుగుతుంది. ఈ ఘటనపట్ల తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్​గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేశాం. అదేవిధంగా భవిష్యత్​లో కూడా ఇటువంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠినచర్యలు తీసుకుంటాం."-సీతక్క, రాష్ట్ర మంత్రి

Tollywood Heroes Slams on Child Abuse : ఇదే అంశంపై ఇప్పటికే హీరో సాయి తేజ్‌ పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే. నియంత్రించలేనంతగా సామాజిక మాధ్యమాలు క్రూరంగా, భయానకంగా మారిపోయాయని ఆయన​ అన్నారు. మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని తల్లిదండ్రులు అందరికీ విజ్ఞప్తి చేశారు. పిల్లల ఫొటోలు, వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్‌ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలని కోరారు.

ఈ పోస్ట్‌కు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల భద్రత తమ గవర్నమెంట్​ లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు నటుడు మంచు మనోజ్​ సైతం తాజాగా ఇదే అంశంపై స్పందించారు. చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసేవారు సమాజానికి ప్రమాదమని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఘాటుగా స్పందిస్తూ, పిల్లలపై అసభ్యకర కామెంట్స్‌ చేసిన ఓ వ్యక్తికి వార్నింగ్‌ ఇచ్చారు.

'పిల్లల ఫొటోలు, వీడియోలు షేర్ చేసే ముందు కాస్త ఆలోచించండి' - తల్లిదండ్రులకు మెగా హీరో విజ్ఞప్తి - Hero Sai Durga Tej On Social Media

'అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను' - ఆ వ్యక్తికి మంచు మనోజ్ మాస్ వార్నింగ్ - MANCHU MANOJ ABOUT CHILD ABUSE

Minister Seethakka Fire on Abuse of Social Media : సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్షణ పడేలా చేస్తామని మంత్రి తెలిపారు. పోలీసులు ఇప్పటికే కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు.

సోషల్ మీడియా దుర్వినియోగంపై క‌ఠినంగా వ్యవహరిస్తాం : తండ్రీ కుమార్తె మధ్య అనుబంధం, అనురాగాల్ని కొన్ని మృగాలు అసభ్యంగా వక్రీకరించడం దారుణమని సీతక్క వ్యాఖ్యానించారు. కొందరు వారి అసభ్యకరమైన ఆలోచనను తండ్రీ కుమార్తెకు అంటగట్టడం దుర్మార్గమైన చర్యగా మంత్రి అభివర్ణించారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, చవక హాస్యం కోసం కుటుంబ సంబంధాల‌ను అప‌హ‌స్యం చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగ ప‌రుస్తున్న అసాంఘిక శ‌క్తుల‌కు అడ్డుకట్ట పడేలా చ‌ట్టప‌రంగా క‌ఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

"తండ్రీ కుమార్తెల మధ్య ఉన్న అనుబంధాన్ని కొంతమంది నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాళ్ల తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైన ఆలోచనను అంటగడుతున్నారు. ఈ మేరకు వాళ్లకు ఉండేటటువంటి నికృష్ట ఆలోచనకు సోషల్​ మీడియా వేదిక అవ్వటం జరుగుతుంది. ఈ ఘటనపట్ల తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్​గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేశాం. అదేవిధంగా భవిష్యత్​లో కూడా ఇటువంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠినచర్యలు తీసుకుంటాం."-సీతక్క, రాష్ట్ర మంత్రి

Tollywood Heroes Slams on Child Abuse : ఇదే అంశంపై ఇప్పటికే హీరో సాయి తేజ్‌ పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే. నియంత్రించలేనంతగా సామాజిక మాధ్యమాలు క్రూరంగా, భయానకంగా మారిపోయాయని ఆయన​ అన్నారు. మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని తల్లిదండ్రులు అందరికీ విజ్ఞప్తి చేశారు. పిల్లల ఫొటోలు, వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్‌ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలని కోరారు.

ఈ పోస్ట్‌కు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల భద్రత తమ గవర్నమెంట్​ లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు నటుడు మంచు మనోజ్​ సైతం తాజాగా ఇదే అంశంపై స్పందించారు. చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసేవారు సమాజానికి ప్రమాదమని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఘాటుగా స్పందిస్తూ, పిల్లలపై అసభ్యకర కామెంట్స్‌ చేసిన ఓ వ్యక్తికి వార్నింగ్‌ ఇచ్చారు.

'పిల్లల ఫొటోలు, వీడియోలు షేర్ చేసే ముందు కాస్త ఆలోచించండి' - తల్లిదండ్రులకు మెగా హీరో విజ్ఞప్తి - Hero Sai Durga Tej On Social Media

'అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను' - ఆ వ్యక్తికి మంచు మనోజ్ మాస్ వార్నింగ్ - MANCHU MANOJ ABOUT CHILD ABUSE

Last Updated : Jul 8, 2024, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.