ETV Bharat / state

రాష్ట్రంలో వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి మూడు టాస్క్​ఫోర్స్​లు : మంత్రి రాజనర్సింహ - Damodar Raja Narasimha Face to Face

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 6:49 PM IST

Minister Damodar Raja Narasimha Face to Face Interview : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సర్వే చేయకుండా వైద్య కళాశాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఆయా కళాశాలల్లో మెడికల్​ ప్రొఫెసర్లు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

Minister Damodar Raja Narasimha Face to Face Interview
Minister Damodar Raja Narasimha Face to Face Interview (ETV Bharat)

Chit Chat with Telangana Health Minister Damodar Raja Narasimha : రాష్ట్రంలో వైద్య ఆరోగ్యానికి సంబంధించి మూడు రకాల టాస్క్​ఫోర్స్​లను ఏర్పాటు చేయబోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల పర్యవేక్షణకు క్లినికల్​ ఎస్టాబ్లిష్​, ఫార్మా మెడికల్​లో డ్రగ్స్​ నియంత్రణకు, ఫుడ్​ క్వాలిటీ కోసం ఇలా మూడు టాస్క్​ఫోర్స్​లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మీడియాతో జరిగిన చిట్​చాట్​లో ఆయన వైద్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే గత ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మంత్రి విమర్శలు చేశారు.

ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గత ప్రభుత్వం గవర్నమెంటు మెడికల్​ కాలేజీలు ప్రాంతాల వారీగా సర్వే చేయకుండా అవసరం లేకుండా ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు మెడికల్​ కాలేజీల్లో ప్రొఫెసర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకే మెడికల్​ ప్రొఫెషన్ ఎప్పుడూ​ స్లోగా పెరగాలని హితవు పలికారు. ప్రతి 35 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్​ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇలా కొత్తగా 75ట్రామా కేర్​ సెంటర్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. డయాగ్నోస్టిక్​ సెంటర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు లింక్​ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

ఉస్మానియా ఆసుపత్రిని గాలికొదిలేశారు : సిద్దిపేట ఆసుపత్రిపై దృష్టి పెట్టి ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకోలేదని మంత్రి దామోదర రాజనర్సింహ ధ్వజమెత్తారు. పదేళ్లు పాలించి కనీసం ఉస్మానియా ఆసుపత్రిని కొత్తగా కట్టలేదన్నారు. సిటీకి పక్కనే ఉన్న మహేశ్వరానికి మెడికల్​ కాలేజీ ఎందుకు ఇచ్చారో తెలియదని తెలిపారు. ఇంజినీరింగ్​ కాలేజీల మాదిరిగా మెడికల్​ కాలేజీలు కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.

కేసీఆరే డాక్టర్​ అయ్యాడు, కేసీఆరే ఇంజినీర్​ అయ్యాడు, కరోనాకు పారాసిటమాల్​ తీసుకొమ్మని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన్నే డిజైన్​ చేశారని మంత్రి దామోదర నర్సింహ ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో4 సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం రూ.9 వేల కోట్లను లోన్ రూపంలో తీసేసుకున్నారని ఆరోపించారు. మరోవైపు కేసీఆర్​ కిట్​లో మార్పులు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు దిశగా ప్రతి ఒక్క అధికారి పని చేయాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

KTR Speech at Sircilla Government Medical College Inauguration : 'ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ నంబర్​ వన్​గా ఉంది'

Chit Chat with Telangana Health Minister Damodar Raja Narasimha : రాష్ట్రంలో వైద్య ఆరోగ్యానికి సంబంధించి మూడు రకాల టాస్క్​ఫోర్స్​లను ఏర్పాటు చేయబోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల పర్యవేక్షణకు క్లినికల్​ ఎస్టాబ్లిష్​, ఫార్మా మెడికల్​లో డ్రగ్స్​ నియంత్రణకు, ఫుడ్​ క్వాలిటీ కోసం ఇలా మూడు టాస్క్​ఫోర్స్​లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మీడియాతో జరిగిన చిట్​చాట్​లో ఆయన వైద్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే గత ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మంత్రి విమర్శలు చేశారు.

ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గత ప్రభుత్వం గవర్నమెంటు మెడికల్​ కాలేజీలు ప్రాంతాల వారీగా సర్వే చేయకుండా అవసరం లేకుండా ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు మెడికల్​ కాలేజీల్లో ప్రొఫెసర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకే మెడికల్​ ప్రొఫెషన్ ఎప్పుడూ​ స్లోగా పెరగాలని హితవు పలికారు. ప్రతి 35 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్​ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇలా కొత్తగా 75ట్రామా కేర్​ సెంటర్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. డయాగ్నోస్టిక్​ సెంటర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు లింక్​ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

ఉస్మానియా ఆసుపత్రిని గాలికొదిలేశారు : సిద్దిపేట ఆసుపత్రిపై దృష్టి పెట్టి ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకోలేదని మంత్రి దామోదర రాజనర్సింహ ధ్వజమెత్తారు. పదేళ్లు పాలించి కనీసం ఉస్మానియా ఆసుపత్రిని కొత్తగా కట్టలేదన్నారు. సిటీకి పక్కనే ఉన్న మహేశ్వరానికి మెడికల్​ కాలేజీ ఎందుకు ఇచ్చారో తెలియదని తెలిపారు. ఇంజినీరింగ్​ కాలేజీల మాదిరిగా మెడికల్​ కాలేజీలు కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.

కేసీఆరే డాక్టర్​ అయ్యాడు, కేసీఆరే ఇంజినీర్​ అయ్యాడు, కరోనాకు పారాసిటమాల్​ తీసుకొమ్మని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన్నే డిజైన్​ చేశారని మంత్రి దామోదర నర్సింహ ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో4 సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం రూ.9 వేల కోట్లను లోన్ రూపంలో తీసేసుకున్నారని ఆరోపించారు. మరోవైపు కేసీఆర్​ కిట్​లో మార్పులు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు దిశగా ప్రతి ఒక్క అధికారి పని చేయాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

KTR Speech at Sircilla Government Medical College Inauguration : 'ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ నంబర్​ వన్​గా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.