ETV Bharat / state

మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన మేళ్లచెరువు ఆలయం - ఐదు రోజులు సాగనున్న ఉత్సవాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 2:48 PM IST

Mellacheruvu Mahashivaratri Jatara 2024 : సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి జాతర ఈనెల 8 నుంచి 12 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఐదు రోజులు పాటు జరిగే ఉత్సవాలకు అధికారాలు అన్ని ఏర్పాట్లు చేశారు.

Mellacheruvu Shambhu Lingeswara Temple
Mellacheruvu Maha Shivaratri Jathara In Suryapet 2024
మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైన మేళ్లచెరువు ఆలయం - ఐదు రోజులు సాగనున్న ఉత్సవాలు

Mellacheruvu Mahashivaratri Jatara 2024 : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివాలయాన్ని కాకతీయులు క్రీస్తుశకం.1311 లో నిర్మాణం చేసినట్లు ఇక్కడున్న శిలాశాసనంలో రాసి ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాతన కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రం వెయ్యి ఏండ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు లింగేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధి. దేశంలోనే అతికొద్ది దర్శనీయ దైవ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో స్వామి లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కొంత శివలింగం పెరుగుతూ ఉంటదని స్థానికులు చెపుతూ ఉంటారు. శివలింగం మీద ఒక చిన్న రంధ్రం ఉంది. అందులో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అందులో నీళ్లు ఎన్నిసార్లు తీసిన మళ్లీ జల ఊరుతూనే ఉంటుంది.

మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి?

అందుకే సాక్షాత్తు గంగమ్మ కొలువై ఉందని చెబుతుంటారు. ద్వీలింగం కావడం వల్ల సగభాగం పార్వతి దేవి మరో సగభాగం శివుడుగా అర్ధనారీశ్వర రూపంలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. శివలింగానికి ఐదు చోట్ల బొట్టు పెట్టినట్లు ఒక మార్కు ఉంటుంది. శివలింగం పెరుగుతున్న కొద్దీ ఆరో బొట్టు ఏర్పడుతుంది. వెనుక భాగంలో పార్వతి దేవి అమ్మవారి కురుల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ క్షేత్రం వెయ్యి ఏండ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది.

"ఈ ఆలయం చాలా పురాతనమైది. క్రీస్తు శకం. 1311లో కాకతీయులు ఆలయాన్ని నిర్మించారు. పూర్వం గొల్లకుంట అనే పల్లెలోని గొల్లలు పశువులు కాస్తూ బతికేవాళ్లు. వాళ్లకు ఒక గుండ్రని రాయి కనిపించింది. అది పశువుల కొట్టంలో అడ్డంగా ఉండటంతో దూరంగా తీసి వదిలేశారు. ఇదే పదేపదే జరిగేది. ఒకరోజు వాళ్ళ పశువు ఓ కామదేవుడు నిత్యం రాయిపై పొదుగుపాలు పోయడం వాళ్లు గమనించారు. అప్పుడే వాళ్లకు శివుడు కలలో దర్శనమిచ్చి రాయి రూపంలో ఉన్నది నేనే నాకు ఆలయాన్ని కట్టండి అని చెప్పారు. దీంతో అక్కడ స్వయంభు శివాలయం కట్టించారు." - విష్ణువర్ధన్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు

Mellacheruvu Shambhu Lingeswara Temple : మేళ్లచెరువు శివాలయంలో ఈ నెల 8నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. జాతరకు చుట్టుపక్క గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు రానున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని కళ్యాణంలో పాల్గొననున్నారు. మేళ్లచెరువు జాతరలో ఎడ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

ఈ పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్లు పోటీల్లో నిలుస్తాయి. మేళ్లచెరువు జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకర్షణీయంగా నిలుస్తాయి. విద్యుత్ దీపాల కాంతులతో ఏర్పాటు చేసిన ప్రబల వద్ద నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మేళ్లచెరువు శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైన మేళ్లచెరువు ఆలయం

మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా? - ఈ స్మూతీ తాగితే నీరసం అనేది ఉండదు!

మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైన మేళ్లచెరువు ఆలయం - ఐదు రోజులు సాగనున్న ఉత్సవాలు

Mellacheruvu Mahashivaratri Jatara 2024 : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివాలయాన్ని కాకతీయులు క్రీస్తుశకం.1311 లో నిర్మాణం చేసినట్లు ఇక్కడున్న శిలాశాసనంలో రాసి ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాతన కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రం వెయ్యి ఏండ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు లింగేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధి. దేశంలోనే అతికొద్ది దర్శనీయ దైవ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో స్వామి లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కొంత శివలింగం పెరుగుతూ ఉంటదని స్థానికులు చెపుతూ ఉంటారు. శివలింగం మీద ఒక చిన్న రంధ్రం ఉంది. అందులో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అందులో నీళ్లు ఎన్నిసార్లు తీసిన మళ్లీ జల ఊరుతూనే ఉంటుంది.

మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి?

అందుకే సాక్షాత్తు గంగమ్మ కొలువై ఉందని చెబుతుంటారు. ద్వీలింగం కావడం వల్ల సగభాగం పార్వతి దేవి మరో సగభాగం శివుడుగా అర్ధనారీశ్వర రూపంలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. శివలింగానికి ఐదు చోట్ల బొట్టు పెట్టినట్లు ఒక మార్కు ఉంటుంది. శివలింగం పెరుగుతున్న కొద్దీ ఆరో బొట్టు ఏర్పడుతుంది. వెనుక భాగంలో పార్వతి దేవి అమ్మవారి కురుల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ క్షేత్రం వెయ్యి ఏండ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది.

"ఈ ఆలయం చాలా పురాతనమైది. క్రీస్తు శకం. 1311లో కాకతీయులు ఆలయాన్ని నిర్మించారు. పూర్వం గొల్లకుంట అనే పల్లెలోని గొల్లలు పశువులు కాస్తూ బతికేవాళ్లు. వాళ్లకు ఒక గుండ్రని రాయి కనిపించింది. అది పశువుల కొట్టంలో అడ్డంగా ఉండటంతో దూరంగా తీసి వదిలేశారు. ఇదే పదేపదే జరిగేది. ఒకరోజు వాళ్ళ పశువు ఓ కామదేవుడు నిత్యం రాయిపై పొదుగుపాలు పోయడం వాళ్లు గమనించారు. అప్పుడే వాళ్లకు శివుడు కలలో దర్శనమిచ్చి రాయి రూపంలో ఉన్నది నేనే నాకు ఆలయాన్ని కట్టండి అని చెప్పారు. దీంతో అక్కడ స్వయంభు శివాలయం కట్టించారు." - విష్ణువర్ధన్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు

Mellacheruvu Shambhu Lingeswara Temple : మేళ్లచెరువు శివాలయంలో ఈ నెల 8నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. జాతరకు చుట్టుపక్క గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు రానున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని కళ్యాణంలో పాల్గొననున్నారు. మేళ్లచెరువు జాతరలో ఎడ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

ఈ పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్లు పోటీల్లో నిలుస్తాయి. మేళ్లచెరువు జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకర్షణీయంగా నిలుస్తాయి. విద్యుత్ దీపాల కాంతులతో ఏర్పాటు చేసిన ప్రబల వద్ద నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మేళ్లచెరువు శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైన మేళ్లచెరువు ఆలయం

మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా? - ఈ స్మూతీ తాగితే నీరసం అనేది ఉండదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.