ETV Bharat / state

కోయంబత్తూరులో మార్గదర్శి చిట్​ ఫండ్​ 114వ బ్రాంచ్​ ప్రారంభం - Margadarsi Chit Fund 114th Branch

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 3:58 PM IST

Margadarsi Chit Fund New Branch : చిట్​ ఫండ్​ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న మార్గదర్శి చిట్​ ఫండ్ ప్రైవేట్​​ లిమిటెడ్​ కంపెనీ మరో కొత్త శాఖను ప్రారంభించింది. ఈ 114వ శాఖను తమిళనాడులోని కోయంబత్తూరులో అవినాశ్​ రోడ్డులో రెండో శాఖను ఏర్పాటు చేసింది. నూతన శాఖను మార్గదర్శి చిట్​ ఫండ్​ ముఖ్య కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ పాతూరి ప్రారంభించారు.

Margadarsi Chit Fund New Branch
Margadarsi Chit Fund New Branch (ETV Bharat)

Margadarsi Chit Fund 114th Branch in Coimbatore: నమ్మకానికి మారుపేరైన మార్గదర్శి చిట్​ ఫండ్​ తన 114వ శాఖను నేడు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ప్రారంభించారు. కోయంబత్తూరులోని అవినాశ్​ రోడ్​ హోప్​ కాలేజీ ప్రాంతంలో చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ సత్యనారాయణ పాతూరి, ఉపాధ్యక్షుడు బలరామకృష్ణ రిబ్బన్​ కట్​ చేసి దీపాలు వెలిగించి నూతన శాఖను ప్రారంభించారు. కోయంబత్తూరు ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఇక్కడ రెండో శాఖను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

అనంతరం మార్గదర్శి ముఖ్యకార్యనిర్వాహణాధికారి​ సత్యనారాయణ పాటూరి బ్రాంచ్​ మేనేజర్​ నిక్సన్​కు కొత్త శాఖ మొదటి రశీదును అందించారు. ఈ కొత్త శాఖ ద్వారా మార్గదర్శి చిట్​ ఫండ్​ తన ఖాతాదారులకు ఫైనాన్షియల్​ మేనేజ్​మెంట్​, అధునాతన సాంకేతిక సేవలను అందించనుందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మార్గదర్శి చిట్​ ఫండ్​ మేనేజర్లు, ఉద్యోగులు, అధిక సంఖ్యలో కస్టమర్లు హాజరయ్యారు.

మార్గదర్శి ప్రస్థానం : మార్గదర్శి చిట్​ ఫండ్​ 1962లో స్థాపించబడింది. ప్రస్తుతం సంస్థకు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక రాష్ట్రాల్లో 113 శాఖలు, 60 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో 114వ శాఖను ఏర్పాటు చేసి మార్గదర్శి ముందుకు సాగుతోంది. మేనేజింగ్​ డైరెక్టర్​ శైలజాకిరణ్​ నేతృత్వంలో దిగ్విజయంగా ముందుకు సాగుతోన్న మార్గదర్శి వార్షిక టర్నోవర్​ రూ.9,396 కోట్లు. వినియోగదారుల అవసరాలు, సౌకర్యాలకు అనుగుణంగా వివిధ రకాల చిట్​ గ్రూపులను నిర్వహిస్తోంది.

Margadarsi Chit Fund 114th Branch in Coimbatore: నమ్మకానికి మారుపేరైన మార్గదర్శి చిట్​ ఫండ్​ తన 114వ శాఖను నేడు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ప్రారంభించారు. కోయంబత్తూరులోని అవినాశ్​ రోడ్​ హోప్​ కాలేజీ ప్రాంతంలో చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ సత్యనారాయణ పాతూరి, ఉపాధ్యక్షుడు బలరామకృష్ణ రిబ్బన్​ కట్​ చేసి దీపాలు వెలిగించి నూతన శాఖను ప్రారంభించారు. కోయంబత్తూరు ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఇక్కడ రెండో శాఖను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

అనంతరం మార్గదర్శి ముఖ్యకార్యనిర్వాహణాధికారి​ సత్యనారాయణ పాటూరి బ్రాంచ్​ మేనేజర్​ నిక్సన్​కు కొత్త శాఖ మొదటి రశీదును అందించారు. ఈ కొత్త శాఖ ద్వారా మార్గదర్శి చిట్​ ఫండ్​ తన ఖాతాదారులకు ఫైనాన్షియల్​ మేనేజ్​మెంట్​, అధునాతన సాంకేతిక సేవలను అందించనుందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మార్గదర్శి చిట్​ ఫండ్​ మేనేజర్లు, ఉద్యోగులు, అధిక సంఖ్యలో కస్టమర్లు హాజరయ్యారు.

మార్గదర్శి ప్రస్థానం : మార్గదర్శి చిట్​ ఫండ్​ 1962లో స్థాపించబడింది. ప్రస్తుతం సంస్థకు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక రాష్ట్రాల్లో 113 శాఖలు, 60 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో 114వ శాఖను ఏర్పాటు చేసి మార్గదర్శి ముందుకు సాగుతోంది. మేనేజింగ్​ డైరెక్టర్​ శైలజాకిరణ్​ నేతృత్వంలో దిగ్విజయంగా ముందుకు సాగుతోన్న మార్గదర్శి వార్షిక టర్నోవర్​ రూ.9,396 కోట్లు. వినియోగదారుల అవసరాలు, సౌకర్యాలకు అనుగుణంగా వివిధ రకాల చిట్​ గ్రూపులను నిర్వహిస్తోంది.

'ఖాతాదారులే దేవుళ్లు వారికి సేవ చేయడమే మన విధి' - రామోజీ తారకమంత్రం ఇదే - అందుకే మార్గదర్శి సక్సెస్ - MARGADARSHI CHITFUNDS STORY 2024

జగిత్యాల, సూర్యాపేటలో మార్గదర్శి నూతన శాఖల ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.