ETV Bharat / state

సీమ జిల్లాల్లో జోరు వానలు - జలమయమైన పలు ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో భారీ వర్షం - రెయిన్‌ ఎఫెక్ట్‌కు శ్రీవారి మెట్టుమార్గం మూసివేత

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Heavy Rains in Rayalaseema Updates
Heavy Rains in Rayalaseema Updates (ETV Bharat)

Heavy Rains in Rayalaseema Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తిరుమలలో రెండో రోజూ ఎడతెరిపిలేని వర్షం కారణంగా భక్తులకు ఇక్కట్లు తప్పలేదు.

విస్తారంగా వర్షాలు : వాయుగుండం ప్రభావంతో వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానజల్లులు కురుస్తున్నాయి. కడప జిల్లా జలదిగ్బంధమైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఉన్న ప్రాంతంతో పాటు, కోర్టు ఎదురుగా, ఆర్.ఎం. కార్యాలయం వద్ద రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీటిని అధికారులు యంత్రాల ద్వారా బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా మోకాళ్లలోతు నీటితో నిండిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

జలమయమైన రహదారులు : వైఎస్సార్​ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండగా జిల్లాలోని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్​ సెలవు ప్రకటించారు. కమలాపురంలో రోడ్లన్నీ జలమయమయ్యాయ. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వరదనీ రు చేరింది. పులివెందుల నియోజకవర్గంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. వరి, అరటి, వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లిందని రైతన్నలు వాపోయారు. ఒంటిమిట్ట, పోరుమామిళ్ల, వేంపల్లె, కడప మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పోరుమామిళ్లలో 90 మిల్లీమీటర్లమేర వర్షం కురిసింది. జమ్మలముడుగు నియోజకవర్గంలోనూ వర్షాలు దంచికొట్టాయి. గండికోట జలాయశం నుంచి మైలవరానికి, అక్కడి నుంచి నాలుగుగేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని దిగువకు విడుదల చేశారు.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు : ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలోని 30 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం కురిసింది. రైల్వే కోడూరు సమీపంలో గుంజునేరు ఉద్ధృతితో నరసరాంపేట, ధర్మాపురం వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నందలూరు, పెనగలూరు చిట్వేలి, కోడూరు, మదనపల్లె, మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. వరదనీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయచోటి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లోనూ ఎడతెరిపిలేని వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాజంపేటలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాజంపేట, రాయచోటి, మదనపల్లి పురపాలికల్లో మురుగునీటి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి చెరువుల గట్లను పరిశీలించి అధికారులకు అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు చేశారు.

తిరుమలలో రెండో రోజూ వర్షం కురిసింది. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రెండో కనుమదారిలో రెండు, మూడుచోట్ల బండ రాళ్లు స్వల్పంగా రోడ్డుపైకి జారిపడగా వాటిని వెంటనే ఘాట్ రోడ్డు సిబ్బంది తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. శ్రీవారి సన్నిధిలో చలితీవ్రత పెరిగింది. వర్షంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్లే భక్తులు టీటీడీ దేవస్థానం ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. తిరుపతి నగరంలోనూ జోరువాన కురిసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షం కారణంగా శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలింగా మూసివేశారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగానూ వర్షాలు పడ్డాయి.

దూసుకొస్తున్న వాయుగుండం - రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - రేణిగుంట రన్‌వేపైకి భారీగా వరద నీరు

Heavy Rains in Rayalaseema Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తిరుమలలో రెండో రోజూ ఎడతెరిపిలేని వర్షం కారణంగా భక్తులకు ఇక్కట్లు తప్పలేదు.

విస్తారంగా వర్షాలు : వాయుగుండం ప్రభావంతో వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానజల్లులు కురుస్తున్నాయి. కడప జిల్లా జలదిగ్బంధమైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఉన్న ప్రాంతంతో పాటు, కోర్టు ఎదురుగా, ఆర్.ఎం. కార్యాలయం వద్ద రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీటిని అధికారులు యంత్రాల ద్వారా బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా మోకాళ్లలోతు నీటితో నిండిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

జలమయమైన రహదారులు : వైఎస్సార్​ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండగా జిల్లాలోని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్​ సెలవు ప్రకటించారు. కమలాపురంలో రోడ్లన్నీ జలమయమయ్యాయ. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వరదనీ రు చేరింది. పులివెందుల నియోజకవర్గంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. వరి, అరటి, వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లిందని రైతన్నలు వాపోయారు. ఒంటిమిట్ట, పోరుమామిళ్ల, వేంపల్లె, కడప మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పోరుమామిళ్లలో 90 మిల్లీమీటర్లమేర వర్షం కురిసింది. జమ్మలముడుగు నియోజకవర్గంలోనూ వర్షాలు దంచికొట్టాయి. గండికోట జలాయశం నుంచి మైలవరానికి, అక్కడి నుంచి నాలుగుగేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని దిగువకు విడుదల చేశారు.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు : ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలోని 30 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం కురిసింది. రైల్వే కోడూరు సమీపంలో గుంజునేరు ఉద్ధృతితో నరసరాంపేట, ధర్మాపురం వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నందలూరు, పెనగలూరు చిట్వేలి, కోడూరు, మదనపల్లె, మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. వరదనీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయచోటి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లోనూ ఎడతెరిపిలేని వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాజంపేటలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాజంపేట, రాయచోటి, మదనపల్లి పురపాలికల్లో మురుగునీటి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి చెరువుల గట్లను పరిశీలించి అధికారులకు అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు చేశారు.

తిరుమలలో రెండో రోజూ వర్షం కురిసింది. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రెండో కనుమదారిలో రెండు, మూడుచోట్ల బండ రాళ్లు స్వల్పంగా రోడ్డుపైకి జారిపడగా వాటిని వెంటనే ఘాట్ రోడ్డు సిబ్బంది తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. శ్రీవారి సన్నిధిలో చలితీవ్రత పెరిగింది. వర్షంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్లే భక్తులు టీటీడీ దేవస్థానం ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. తిరుపతి నగరంలోనూ జోరువాన కురిసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షం కారణంగా శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలింగా మూసివేశారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగానూ వర్షాలు పడ్డాయి.

దూసుకొస్తున్న వాయుగుండం - రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - రేణిగుంట రన్‌వేపైకి భారీగా వరద నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.