ETV Bharat / state

మగ సంతానం కోసం రెండో పెళ్లి చేసుకున్న లాయర్ - ఇంటి ముందు ధర్నాకు దిగిన బాధితురాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 4:22 PM IST

LB Nagar Lawyer Second Marriage Issue : సాధారణంగా మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు లేదా మొదటి భాగస్వామి మరణం తర్వాత మాత్రమే రెండో వివాహం చేసుకునే వీలుంటుంది. కాని మగ సంతానం కోసం మొదటి భార్య చనిపోయిందని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ న్యాయవాది.

Advocate 2nd Marriage Issue
LB Nagar Lawyer Second Marriage Issue

LB Nagar Lawyer Second Marriage Issue : మొదటి భార్య చనిపోయిందని రెండో పెళ్లి చేసుకున్న ఓ న్యాయవాది న్యాయ వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చాడు. కేవలం మొదటి భార్యకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారని మగ సంతానం కోసం మరో పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడు. ఈ ఘటన సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్‌లో పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తనకు, తన పిల్లలకు అన్యాయం జరిగిందంటూ లాయర్ మొదటి భార్య సరూర్ నగర్ పీఎస్​లో ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించింది. ఎల్బీనగర్ నాగోల్ ప్రాంతానికి చెందిన న్యాయవాది అమరేందర్‌ పల్లవి అనే యువతిని కొన్నేండ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల జష్మిత రాయ్‌, ఐదేళ్ల అన్షిత రాయ్‌ అనే కుమార్తెలు ఉన్నారు.

Husband Tortured Wife With Electric Shock : 'రెండో పెళ్లి చేసుకునేందుకు భర్త ప్లాన్.. కరెంట్​ షాక్​ ఇచ్చి చంపేందుకు స్కెచ్​.. పెట్రోల్​ పోసి కూడా!'

"నాకు 2017లో హైకోర్టు న్యాయవాది అమరేందర్‌తో పెళ్లి జరిగింది. నాకు ఇద్దరు అమ్మాయిలు. మగ సంతానం కోసం నా భర్త నాలుగు సార్లు గర్భస్రావం చేయించాడు. గర్భసంచి బలహీనంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో పిల్లలు పుట్టరు అని తెలిసి నేను చనిపోయానని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను. " -బాధితురాలు

Advocate 2nd Marriage Issue : గతంలో చాలా సార్లు తనకు వారసుడు కావాలంటూ పల్లవిని వేధించడం మొదలు పెట్టాడని బాధితురాలు వాపోయింది. కొడుకు కోసం నాలుగు సార్లు గర్భస్రావం కూడా చేయించాడని తెలిపారు. అనంతరం గర్భసంచి బలహీనంగా ఉందని వైద్యులు తెలిపారని బాధితురాలు పల్లవి తెలిపింది. మగ సంతానం కోసం మొదటి భార్య చనిపోయిందని సిద్దిపేటకు చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది.

తనకి తెలియకుండానే గత నవంబర్‌లో రెండో వివాహం చేసుకున్నాడని దీంతో ఆగ్రహించిన మొదటి భార్య కుటుంబ సభ్యులు న్యాయవాదిని పట్టుకుని చితకబాదారు. న్యాయం చేయాలంటూ సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు నాకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

Wife Cheating Case on Husband Hyderabad : మనువాడి.. భర్తకు రెండో పెళ్లి జరిపించి.. కట్ చేస్తే..!

రియల్​ లైఫ్​లో 'మళ్లీ పెళ్లి'.. ట్రెండ్ సెట్​ చేసిన స్టార్స్​ వీరే!

LB Nagar Lawyer Second Marriage Issue : మొదటి భార్య చనిపోయిందని రెండో పెళ్లి చేసుకున్న ఓ న్యాయవాది న్యాయ వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చాడు. కేవలం మొదటి భార్యకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారని మగ సంతానం కోసం మరో పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడు. ఈ ఘటన సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్‌లో పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తనకు, తన పిల్లలకు అన్యాయం జరిగిందంటూ లాయర్ మొదటి భార్య సరూర్ నగర్ పీఎస్​లో ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించింది. ఎల్బీనగర్ నాగోల్ ప్రాంతానికి చెందిన న్యాయవాది అమరేందర్‌ పల్లవి అనే యువతిని కొన్నేండ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల జష్మిత రాయ్‌, ఐదేళ్ల అన్షిత రాయ్‌ అనే కుమార్తెలు ఉన్నారు.

Husband Tortured Wife With Electric Shock : 'రెండో పెళ్లి చేసుకునేందుకు భర్త ప్లాన్.. కరెంట్​ షాక్​ ఇచ్చి చంపేందుకు స్కెచ్​.. పెట్రోల్​ పోసి కూడా!'

"నాకు 2017లో హైకోర్టు న్యాయవాది అమరేందర్‌తో పెళ్లి జరిగింది. నాకు ఇద్దరు అమ్మాయిలు. మగ సంతానం కోసం నా భర్త నాలుగు సార్లు గర్భస్రావం చేయించాడు. గర్భసంచి బలహీనంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో పిల్లలు పుట్టరు అని తెలిసి నేను చనిపోయానని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను. " -బాధితురాలు

Advocate 2nd Marriage Issue : గతంలో చాలా సార్లు తనకు వారసుడు కావాలంటూ పల్లవిని వేధించడం మొదలు పెట్టాడని బాధితురాలు వాపోయింది. కొడుకు కోసం నాలుగు సార్లు గర్భస్రావం కూడా చేయించాడని తెలిపారు. అనంతరం గర్భసంచి బలహీనంగా ఉందని వైద్యులు తెలిపారని బాధితురాలు పల్లవి తెలిపింది. మగ సంతానం కోసం మొదటి భార్య చనిపోయిందని సిద్దిపేటకు చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది.

తనకి తెలియకుండానే గత నవంబర్‌లో రెండో వివాహం చేసుకున్నాడని దీంతో ఆగ్రహించిన మొదటి భార్య కుటుంబ సభ్యులు న్యాయవాదిని పట్టుకుని చితకబాదారు. న్యాయం చేయాలంటూ సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు నాకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

Wife Cheating Case on Husband Hyderabad : మనువాడి.. భర్తకు రెండో పెళ్లి జరిపించి.. కట్ చేస్తే..!

రియల్​ లైఫ్​లో 'మళ్లీ పెళ్లి'.. ట్రెండ్ సెట్​ చేసిన స్టార్స్​ వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.