ETV Bharat / state

తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - రేణిగుంట రన్‌వేపైకి భారీగా వరద నీరు

తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు- ట్రాఫిక్​ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టిన టీటీడీ - భారీ వర్షాలతో రేణిగుంట రన్‌వేపైకి చేరిన నీరు-హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు వస్తున్న విమానం చెన్నైకు దారిమళ్లింపు

author img

By ETV Bharat Telangana Team

Published : 16 hours ago

Updated : 15 hours ago

Landslide fell down in Tirumala Ghat Road
Landslide fell down in Tirumala Ghat Road (ETV Bharat)

Landslide fell down in Tirumala Ghat Road : భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో సిబ్బంది జేసీబీల ద్వారా వాటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా టీటీడీ ముందుస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భక్తలను శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి టీటీడీ అనుమతించడం లేదు. ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కూడా రద్దు చేశారు. వర్షాల కారణంగా భక్తుల భద్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు వస్తున్న విమానాన్ని చెన్నైకు దారి మళ్లించారు. భారీ వర్షాలతో తిరుపతి జిల్లాలో రేణిగుంట రన్‌వేపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో ఇండిగో విమానాన్ని చెన్నైకు దారి మళ్లించారు. భారీ వర్షంతో రేణిగుంట సమీపంలోని భగత్‌సింగ్‌ కాలనీ, జ్యోతిరావు ఫులే కాలనీలోకి వరద చేరింది. రేణిగుంట-మామండూరు మార్గంలో భారీ వృక్షం కూలింది. దీంతో ట్రాఫిక్​ స్తంభించిపోయింది. రేణిగుంట మండలం ఎల్లమంద్యంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఎల్లమంద్యంలోని ఉన్న 15 కుటుంబాలను అధికారులు ఎంపీపీ పాఠశాలకు తరలించారు. తిరుపతి అర్బన్ పరిధిలో 17 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అందుబాటులో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు : తిరుమల గిరుల్లో భారీ వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తోంది. కొండల నుంచి వస్తున్న నీరు తిరుపతి కాలనీల్లోకి వచ్చి చేరుతోంది. ఆటోనగర్‌ కాలనీ, రాజీవ్‌గాంధీ కాలనీ, కొరమీనుగుంటలో వరద వస్తోంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం వద్ద సీత కాల్వ కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తోంది. ఏపీలోని భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. గూడూరు సబ్‌ కలెక్టరేట్‌లో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు.

సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీరప్రాంతాల్లో కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట, చిల్లకూరులో వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఏపీలో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఏర్పడింది. దీంతో మూడు రోజులపాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం సిబ్బందితో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. ఇందులో భాగంగా ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

తిరుమల వెళ్లే వారికి బిగ్ అలెర్ట్ - బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు!

Landslide fell down in Tirumala Ghat Road : భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో సిబ్బంది జేసీబీల ద్వారా వాటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా టీటీడీ ముందుస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భక్తలను శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి టీటీడీ అనుమతించడం లేదు. ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కూడా రద్దు చేశారు. వర్షాల కారణంగా భక్తుల భద్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు వస్తున్న విమానాన్ని చెన్నైకు దారి మళ్లించారు. భారీ వర్షాలతో తిరుపతి జిల్లాలో రేణిగుంట రన్‌వేపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో ఇండిగో విమానాన్ని చెన్నైకు దారి మళ్లించారు. భారీ వర్షంతో రేణిగుంట సమీపంలోని భగత్‌సింగ్‌ కాలనీ, జ్యోతిరావు ఫులే కాలనీలోకి వరద చేరింది. రేణిగుంట-మామండూరు మార్గంలో భారీ వృక్షం కూలింది. దీంతో ట్రాఫిక్​ స్తంభించిపోయింది. రేణిగుంట మండలం ఎల్లమంద్యంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఎల్లమంద్యంలోని ఉన్న 15 కుటుంబాలను అధికారులు ఎంపీపీ పాఠశాలకు తరలించారు. తిరుపతి అర్బన్ పరిధిలో 17 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అందుబాటులో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు : తిరుమల గిరుల్లో భారీ వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తోంది. కొండల నుంచి వస్తున్న నీరు తిరుపతి కాలనీల్లోకి వచ్చి చేరుతోంది. ఆటోనగర్‌ కాలనీ, రాజీవ్‌గాంధీ కాలనీ, కొరమీనుగుంటలో వరద వస్తోంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం వద్ద సీత కాల్వ కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తోంది. ఏపీలోని భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. గూడూరు సబ్‌ కలెక్టరేట్‌లో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు.

సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీరప్రాంతాల్లో కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట, చిల్లకూరులో వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఏపీలో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఏర్పడింది. దీంతో మూడు రోజులపాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం సిబ్బందితో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. ఇందులో భాగంగా ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

తిరుమల వెళ్లే వారికి బిగ్ అలెర్ట్ - బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు!

Last Updated : 15 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.