ETV Bharat / state

పరదాల కిందే పాఠాలు - ఎండ, వానలకు ఇబ్బందులు పడుతూ పిల్లల చదువులు - Lack Of Facilities In Govt School

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 4:18 PM IST

Updated : Aug 6, 2024, 6:41 PM IST

Lack Of Facilities In Govt School : విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం రూ.కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ఓ ప్రభుత్వ బడిలో సరైన తరగతి గదులు కూడా లేకపోవడంతో విద్యార్థులు పరదాల కిందే కూర్చొని పాఠాలు వినాల్సిన దయనీయ స్థితి నెలకొంది. చినుకుపడితే పిల్లలంతా బడి నుంచి పరుగులు పెట్టాల్సిన దుస్థితిలో ఆ ప్రభుత్వ బడి ఉంది.

Lack Of Facilities In Govt School
Lack Of Facilities In Govt School (ETV Bharat)

Lack Of Facilities In Govt School In Khammam : అదో ప్రభుత్వ పాఠశాల. పేరుకు మాత్రమే సర్కారు బడి. పక్కా భవనం లేదు. తరగతి గదులకు అతీగతీ లేదు. అయినా అదీ విద్యాలయమే. ఉన్నది ఒకే ఒక్క రేకులషెడ్డు. దానిపక్కనే పరదాలతో వేసుకున్న మరో గది. గట్టిగా గాలివీస్తే విద్యార్థుల పుస్తకాలు చెల్లాచెదురవుతాయి. చినుకుపడితే పిల్లలంతా బడి నుంచి పరుగులు పెట్టాల్సిన దుస్థితి. అదే ఖమ్మం జిల్లా సాయినగర్​ పరిధిలోని రజకవీధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.

కనీస సౌకర్యాలు లేమి : ఇది ఏ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయమని అనుకుంటే మాత్రం పొరపడినట్టే. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్నా సమస్యల వలయంలో కునారిల్లుతున్న సరస్వతీ విద్యాలయం దయనీయ పరిస్థితి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

"మేము చదువుకునేందుకు ఒకటే గది ఉంది. 50 మంది విద్యార్థులం ఇక్కడ విద్యనభ్యసిస్తున్నాం. పాఠాలు వినేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎండవస్తే కళ్లు తిరుగుతాయి. వానవస్తే తడుస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది' -విద్యార్థులు

ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ : ఓ వైపు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ విద్యార్థులు చదువులు సాగిస్తున్న సరస్వతి నిలయం ఇది. ఏళ్లుగా ప్రభుత్వం నుంచి భవన సదుపాయం లేక విద్యార్థులు పరదాల కిందే చదువులు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పరదాలు, రేకుల షెడ్డు, వీటి కిందనే విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న విద్యార్థులు ఇక్కడ సమస్యల నడుమ చదువులు సాగిస్తున్నారు.

" 2016 నుంచి ఈ పాఠశాల అద్దె భవనంలో నడుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో కాలనీ ఏర్పాటు చేసే సమయంలో కొంత స్థలం ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయిస్తామని స్థానికులు చెప్పారు. ఈ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాం. అధికారులు వచ్చి స్థలాన్ని సర్వే చేసి ఇస్తామన్నారు. కానీ ఆ మాట ఆచరణకు నోచుకోలేదు. కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్​ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల పరిస్థితులు చూసి స్థలాన్ని కేటాయిస్తామన్నారు. సర్వేయర్​కు ఈ విషయమై ఆదేశించారు. పాఠశాలకు స్థలం కేటాయించినట్లయితే పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది" - రాంబాబు, హెచ్ఎం

పాఠశాల దయనీయ స్థితిపై స్పందించిన మంత్రి : ప్రభుత్వ పాఠశాల దీనస్థితిపై ఈనాడు-ఈటీవీ భారత్​ కథనంపై మంత్రి తుమ్మల స్పందించారు. పాఠశాల దయనీయ దుస్థితిపై ఆయన జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడారు. స్కూల్​కు కావాల్సిన వసతులపై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఖమ్మం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు.

పాఠాలు వింటుంటే ప్రాణం పోతుందేమో - బడికి వెళ్లాలంటే భయమేస్తోంది - MALCHELMA GOVT SCHOOL PROBLEMS

7 తరగతులు 100 మంది విద్యార్థులు ఒక్కరే టీచర్​ - ఇదీ బదిలీల ఎఫెక్ట్ - SINGLE TEACHER FOR SEVEN CLASSES

Lack Of Facilities In Govt School In Khammam : అదో ప్రభుత్వ పాఠశాల. పేరుకు మాత్రమే సర్కారు బడి. పక్కా భవనం లేదు. తరగతి గదులకు అతీగతీ లేదు. అయినా అదీ విద్యాలయమే. ఉన్నది ఒకే ఒక్క రేకులషెడ్డు. దానిపక్కనే పరదాలతో వేసుకున్న మరో గది. గట్టిగా గాలివీస్తే విద్యార్థుల పుస్తకాలు చెల్లాచెదురవుతాయి. చినుకుపడితే పిల్లలంతా బడి నుంచి పరుగులు పెట్టాల్సిన దుస్థితి. అదే ఖమ్మం జిల్లా సాయినగర్​ పరిధిలోని రజకవీధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.

కనీస సౌకర్యాలు లేమి : ఇది ఏ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయమని అనుకుంటే మాత్రం పొరపడినట్టే. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్నా సమస్యల వలయంలో కునారిల్లుతున్న సరస్వతీ విద్యాలయం దయనీయ పరిస్థితి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

"మేము చదువుకునేందుకు ఒకటే గది ఉంది. 50 మంది విద్యార్థులం ఇక్కడ విద్యనభ్యసిస్తున్నాం. పాఠాలు వినేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎండవస్తే కళ్లు తిరుగుతాయి. వానవస్తే తడుస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది' -విద్యార్థులు

ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ : ఓ వైపు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ విద్యార్థులు చదువులు సాగిస్తున్న సరస్వతి నిలయం ఇది. ఏళ్లుగా ప్రభుత్వం నుంచి భవన సదుపాయం లేక విద్యార్థులు పరదాల కిందే చదువులు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పరదాలు, రేకుల షెడ్డు, వీటి కిందనే విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న విద్యార్థులు ఇక్కడ సమస్యల నడుమ చదువులు సాగిస్తున్నారు.

" 2016 నుంచి ఈ పాఠశాల అద్దె భవనంలో నడుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో కాలనీ ఏర్పాటు చేసే సమయంలో కొంత స్థలం ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయిస్తామని స్థానికులు చెప్పారు. ఈ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాం. అధికారులు వచ్చి స్థలాన్ని సర్వే చేసి ఇస్తామన్నారు. కానీ ఆ మాట ఆచరణకు నోచుకోలేదు. కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్​ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల పరిస్థితులు చూసి స్థలాన్ని కేటాయిస్తామన్నారు. సర్వేయర్​కు ఈ విషయమై ఆదేశించారు. పాఠశాలకు స్థలం కేటాయించినట్లయితే పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది" - రాంబాబు, హెచ్ఎం

పాఠశాల దయనీయ స్థితిపై స్పందించిన మంత్రి : ప్రభుత్వ పాఠశాల దీనస్థితిపై ఈనాడు-ఈటీవీ భారత్​ కథనంపై మంత్రి తుమ్మల స్పందించారు. పాఠశాల దయనీయ దుస్థితిపై ఆయన జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడారు. స్కూల్​కు కావాల్సిన వసతులపై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఖమ్మం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు.

పాఠాలు వింటుంటే ప్రాణం పోతుందేమో - బడికి వెళ్లాలంటే భయమేస్తోంది - MALCHELMA GOVT SCHOOL PROBLEMS

7 తరగతులు 100 మంది విద్యార్థులు ఒక్కరే టీచర్​ - ఇదీ బదిలీల ఎఫెక్ట్ - SINGLE TEACHER FOR SEVEN CLASSES

Last Updated : Aug 6, 2024, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.