ETV Bharat / state

తెలంగాణ విద్యుత్​ విచారణ కమిషన్​ కొత్త ఛైర్మన్​గా జస్టిస్​ మదన్​ భీమ్​రావు లోకూర్ - Justice Madan B Lokur commission

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 10:42 PM IST

Telangana Electricity Inquiry New Commission : తెలంగాణ విద్యుత్​ విచారణ కమిషన్​ కొత్త ఛైర్మన్​గా జస్టిస్​ మదన్​ భీమ్​రావు లోకూర్​ను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో హైకోర్టు సీజేగా పని చేశారు.

Justice Madan B Lokur commission
Justice Madan B Lokur commission (ETV Bharat)

Telangana Power Commission New Chairman Justice Madan B Lokur : తెలంగాణ విద్యుత్​ విచారణ కమిషన్​ నూతన ఛైర్మన్​గా జస్టిస్​ మదన్​ భీమ్​ రావు లోకూర్​ నియామకమయ్యారు. అంతకుముందు ఉన్న జస్టిస్​ ఎల్​. నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్​ మదన్​ భీమ్​ రావు లోకూర్​ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ మదన్​ భీమ్​ రావు లోకూర్​ పని చేశారు. ప్రస్తుతం యాద్రాద్రి, భద్రాద్రి విద్యుత్​ సంస్థల నిర్మాణాలు, ఛత్తీస్​గఢ్​ విద్యుత్​ కొనుగోళ్ల అంశంపై జస్టిస్​ మదన్​ భీమ్​ రావు లోకూర్​ విచారణ జరుపుతారు.

ఇప్పటికే సగం విచారణ పూర్తి : ఇప్పటికే అనేక మంది అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నోటీసులు పంపడంతో పాటు వారిని జస్టిస్​ ఎల్​. నరసింహారెడ్డి విచారించారు. వీరితో పాటు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్​ సంస్థల నిర్మాణం, ఛత్తీస్​గఢ్​ విద్యుత్​ కొనుగోళ్ల అంశంపై గతంలో విద్యుత్​ సంస్థల్లో పని చేసిన మాజీ అధికారులను జస్టిస్​ ఎల్​. నరసింహారెడ్డి విచారించారు.

మాజీ ఇంధన కార్యదర్శులు, ప్రిన్సిపల్​ సెక్రటరీలుగా పని చేసిన సురేశ్​ చందా, అరవింద్​ కుమార్​, ఎస్​.కే. జోషీ, అజయ్​ మిశ్రాలతో పాటు మాజీ ట్రాన్స్​ కో, జెన్​ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్​ రావున నుంచి విచారణలో భాగంగా వివిధ అంశాలపై వివరాలు తీసుకున్నారు. వీరితో పాటు ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ ఉద్యోగి రఘు, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్​లు కూడా విచారణకు హాజరై తమవద్ద ఉన్న సమాచారాన్ని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డికి తెలియజేశారు.

Justice Madan B Lokur : రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ విద్యుత్​ కొనుగోళ్లపై విచారణ జరిపేందుకు జస్టిస్​ ఎల్​. నరసింహారెడ్డి కమిషన్​ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్​ విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్​కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్​ చేస్తూ హైకోర్టులో పిటిషన్​ దాఖలు వేశారు. ఈ పిటిషన్​ చెల్లదంటూ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్​ సవాల్​ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో తెలంగాణ విద్యుత్​ కమిషన్​ ఛైర్మన్​ను మార్చాలని ఆదేశించింది. దీనికి ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం మిగిలి ఉన్న విచారణను పూర్తి చేయడానికి ఇవాళ జస్టిస్​ మదన్​ భీమ్​ రావు లోకూర్​ను నియమించారు. ఆయన ఈ విచారణను పూర్తి చేయనున్నారు.

విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని సుప్రీం ఆదేశం - వెంటనే జస్టిస్‌ నరసింహారెడ్డి రాజీనామా - SUPREME COURT ON KCR PETITION

హైకోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​కు షాక్ - పిటిషన్ కొట్టివేసిన సీజే ధర్మాసనం - TELANGANA HC DISMISSED KCR PETITION

Telangana Power Commission New Chairman Justice Madan B Lokur : తెలంగాణ విద్యుత్​ విచారణ కమిషన్​ నూతన ఛైర్మన్​గా జస్టిస్​ మదన్​ భీమ్​ రావు లోకూర్​ నియామకమయ్యారు. అంతకుముందు ఉన్న జస్టిస్​ ఎల్​. నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్​ మదన్​ భీమ్​ రావు లోకూర్​ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ మదన్​ భీమ్​ రావు లోకూర్​ పని చేశారు. ప్రస్తుతం యాద్రాద్రి, భద్రాద్రి విద్యుత్​ సంస్థల నిర్మాణాలు, ఛత్తీస్​గఢ్​ విద్యుత్​ కొనుగోళ్ల అంశంపై జస్టిస్​ మదన్​ భీమ్​ రావు లోకూర్​ విచారణ జరుపుతారు.

ఇప్పటికే సగం విచారణ పూర్తి : ఇప్పటికే అనేక మంది అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నోటీసులు పంపడంతో పాటు వారిని జస్టిస్​ ఎల్​. నరసింహారెడ్డి విచారించారు. వీరితో పాటు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్​ సంస్థల నిర్మాణం, ఛత్తీస్​గఢ్​ విద్యుత్​ కొనుగోళ్ల అంశంపై గతంలో విద్యుత్​ సంస్థల్లో పని చేసిన మాజీ అధికారులను జస్టిస్​ ఎల్​. నరసింహారెడ్డి విచారించారు.

మాజీ ఇంధన కార్యదర్శులు, ప్రిన్సిపల్​ సెక్రటరీలుగా పని చేసిన సురేశ్​ చందా, అరవింద్​ కుమార్​, ఎస్​.కే. జోషీ, అజయ్​ మిశ్రాలతో పాటు మాజీ ట్రాన్స్​ కో, జెన్​ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్​ రావున నుంచి విచారణలో భాగంగా వివిధ అంశాలపై వివరాలు తీసుకున్నారు. వీరితో పాటు ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ ఉద్యోగి రఘు, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్​లు కూడా విచారణకు హాజరై తమవద్ద ఉన్న సమాచారాన్ని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డికి తెలియజేశారు.

Justice Madan B Lokur : రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ విద్యుత్​ కొనుగోళ్లపై విచారణ జరిపేందుకు జస్టిస్​ ఎల్​. నరసింహారెడ్డి కమిషన్​ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్​ విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్​కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్​ చేస్తూ హైకోర్టులో పిటిషన్​ దాఖలు వేశారు. ఈ పిటిషన్​ చెల్లదంటూ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్​ సవాల్​ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో తెలంగాణ విద్యుత్​ కమిషన్​ ఛైర్మన్​ను మార్చాలని ఆదేశించింది. దీనికి ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం మిగిలి ఉన్న విచారణను పూర్తి చేయడానికి ఇవాళ జస్టిస్​ మదన్​ భీమ్​ రావు లోకూర్​ను నియమించారు. ఆయన ఈ విచారణను పూర్తి చేయనున్నారు.

విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని సుప్రీం ఆదేశం - వెంటనే జస్టిస్‌ నరసింహారెడ్డి రాజీనామా - SUPREME COURT ON KCR PETITION

హైకోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​కు షాక్ - పిటిషన్ కొట్టివేసిన సీజే ధర్మాసనం - TELANGANA HC DISMISSED KCR PETITION

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.