ETV Bharat / state

ఐసీఐసీఐ బ్యాంక్ స్కాం డబ్బు ఎక్కడికి చేరిందో తెలిసిపోయింది!

నెక్సస్‌ సంస్థతో నరేష్‌ లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన సీఐడీ - ఖాతాదారుల డబ్బు కాజేసి నెక్సస్‌ గ్రోత్‌లో పెట్టుబడి పెట్టిన నరేష్‌ బృందం

ICICI BANK Scam In AP
ICICI BANK SCAM CASE IN PALNADU (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

ICICI BANK Scam In AP : ఏపీలో ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో ఖాతాదారుల నుంచి కొట్టేసిన డబ్బులు ఎక్కడకు వెళ్లాయో సీఐడీ గుర్తించింది. ఇవాళ మరోసారి బెజవాడలో సోదాలు నిర్వహించిన సీఐడీ బృందం.. ఖాతాదారుల నుంచి కొట్టేసిన డబ్బును అప్పటి మేనేజర్‌ నరేష్ టీం వాటిని విజయవాడలోని నెక్సస్‌ గ్రోత్‌ సంస్థలో పెట్టుబడులుగా మార్చింది. విషయం తెలుసుకున్న సీఐడీ ఇవాళ సదరు సంస్థకు నోటీసులు ఇచ్చింది. నరేష్ ఖాతా నుంచి పలు లావాదేవీలు నెక్సస్ సంస్థలో ఉన్నట్టు గుర్తించామని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే నెక్సస్‌ గ్రోత్‌ సంస్థను ప్రారంభించిన ప్రభు కిషోర్ పరారీలో ఉన్నాడు.

నరేష్‌ కాజేసిన సొమ్ముతో ప్రభుకిశోర్‌ అనే వ్యక్తి నెక్సస్‌ గ్రోత్‌ ఏర్పాటు చేశాడు. ఇందులో ఉన్న ప్రభుకిశోర్‌, కిరణ్‌, అజిత్‌ సింగ్‌తో నరేష్‌ లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రభు కిషోర్​తో పాటు నరేష్ లావాదేవీలు నడిపిన కిరణ్, అజిత్ సింగ్ నుంచి కూడా సీఐడీ వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో 3 సీఐడీ బృందాలు సోదాలు చేపట్టాయి. బెజవాడ, నరసరావుపేట, చిలకలూరిపేట బ్రాంచిలలో వివరాలను సేకరించారు.

ఐసీఐసీఐ బ్యాంక్ స్కాం : ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడ భారతినగర్‌ ఐసీఐసీఐ బ్యాంక్​ బ్రాంచ్‌ల్లో గతంలో మేనేజర్‌గా ఉన్న నరేష్​ కస్టమర్ల అకౌంట్ల నుంచి 28 కోట్ల రూపాయలు కొట్టేశాడు. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసిన డబ్బులకు నకిలీ డిపాజిట్ సర్టిఫికెట్ ఇచ్చి కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. బ్యాంకు ఖాతాదారుల నగదు, బంగారం, ఫిక్స్​డ్ డిపాజిట్లలో ఉన్న నగదును సైతం మాయం చేశాడు. రెండు నెలలుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో బాధితులు బ్యాంకుకు వెళ్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

నరేష్ చేసిన మోసాలపై జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ మెహ్రా విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. బ్యాంకులో సిబ్బందితో పాటు ఖాతాదారులను సీఐడీ అధికారులు ఇప్పటికే విచారించారు. మరోవైపు నరేష్​ సెల్ఫీ వీడియోతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఒక్కడినే మోసానికి పాల్పడలేదని పేర్కొంటూ, ఈ స్కామ్​లో ఉన్న వారి గురించి సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. దీంతో కేసు విషయంలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. మరోవైపు బ్యాంకు ఉన్నతాధికారులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఐసీఐసీఐ బ్యాంకు బాధితులకు ఊరట - పది రోజుల్లోనే నగదు చెల్లింపులు

'ఐసీఐసీఐ' నరేశ్​ సెల్ఫీ వీడియో కలకలం - అందరి చిట్టా విప్పాడు

ICICI BANK Scam In AP : ఏపీలో ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో ఖాతాదారుల నుంచి కొట్టేసిన డబ్బులు ఎక్కడకు వెళ్లాయో సీఐడీ గుర్తించింది. ఇవాళ మరోసారి బెజవాడలో సోదాలు నిర్వహించిన సీఐడీ బృందం.. ఖాతాదారుల నుంచి కొట్టేసిన డబ్బును అప్పటి మేనేజర్‌ నరేష్ టీం వాటిని విజయవాడలోని నెక్సస్‌ గ్రోత్‌ సంస్థలో పెట్టుబడులుగా మార్చింది. విషయం తెలుసుకున్న సీఐడీ ఇవాళ సదరు సంస్థకు నోటీసులు ఇచ్చింది. నరేష్ ఖాతా నుంచి పలు లావాదేవీలు నెక్సస్ సంస్థలో ఉన్నట్టు గుర్తించామని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే నెక్సస్‌ గ్రోత్‌ సంస్థను ప్రారంభించిన ప్రభు కిషోర్ పరారీలో ఉన్నాడు.

నరేష్‌ కాజేసిన సొమ్ముతో ప్రభుకిశోర్‌ అనే వ్యక్తి నెక్సస్‌ గ్రోత్‌ ఏర్పాటు చేశాడు. ఇందులో ఉన్న ప్రభుకిశోర్‌, కిరణ్‌, అజిత్‌ సింగ్‌తో నరేష్‌ లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రభు కిషోర్​తో పాటు నరేష్ లావాదేవీలు నడిపిన కిరణ్, అజిత్ సింగ్ నుంచి కూడా సీఐడీ వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో 3 సీఐడీ బృందాలు సోదాలు చేపట్టాయి. బెజవాడ, నరసరావుపేట, చిలకలూరిపేట బ్రాంచిలలో వివరాలను సేకరించారు.

ఐసీఐసీఐ బ్యాంక్ స్కాం : ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడ భారతినగర్‌ ఐసీఐసీఐ బ్యాంక్​ బ్రాంచ్‌ల్లో గతంలో మేనేజర్‌గా ఉన్న నరేష్​ కస్టమర్ల అకౌంట్ల నుంచి 28 కోట్ల రూపాయలు కొట్టేశాడు. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసిన డబ్బులకు నకిలీ డిపాజిట్ సర్టిఫికెట్ ఇచ్చి కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. బ్యాంకు ఖాతాదారుల నగదు, బంగారం, ఫిక్స్​డ్ డిపాజిట్లలో ఉన్న నగదును సైతం మాయం చేశాడు. రెండు నెలలుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో బాధితులు బ్యాంకుకు వెళ్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

నరేష్ చేసిన మోసాలపై జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ మెహ్రా విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. బ్యాంకులో సిబ్బందితో పాటు ఖాతాదారులను సీఐడీ అధికారులు ఇప్పటికే విచారించారు. మరోవైపు నరేష్​ సెల్ఫీ వీడియోతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఒక్కడినే మోసానికి పాల్పడలేదని పేర్కొంటూ, ఈ స్కామ్​లో ఉన్న వారి గురించి సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. దీంతో కేసు విషయంలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. మరోవైపు బ్యాంకు ఉన్నతాధికారులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఐసీఐసీఐ బ్యాంకు బాధితులకు ఊరట - పది రోజుల్లోనే నగదు చెల్లింపులు

'ఐసీఐసీఐ' నరేశ్​ సెల్ఫీ వీడియో కలకలం - అందరి చిట్టా విప్పాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.