ETV Bharat / state

జూరాలకు జలకళ - పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి - Huge Water Inflow To Jurala Project

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 2:08 PM IST

Updated : Jul 20, 2024, 2:13 PM IST

Huge Water Inflow To Jurala Project : జూరాల జలాశయం జలకళను సంతరించుకుంది. ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రెండురోజులుగా ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదలతో కృష్ణమ్మ జూరాలను చేరుకుంటోంది.

Huge Water Inflow To Jurala Project
జూరాలకు జలకళ - పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి (ETV Bharat)

Huge Water Inflow To Jurala Project : జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయం నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరీవాహక ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆల్మట్టి జలాశయంలోకి 61 వేల క్యూసెక్కులు చేరుతుండగా, 65 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 519.60 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 517.97 మీటర్లుగా ఉంది. నీటి నిలువ 123.08 టీఎంసీలు కాగా ప్రస్తుతం 97.277 టీఎంసీలుగా ఉంది.

నిండుకుండను తలపిస్తున్న జలశయాలు : నారాయణపూర్ జలాశయంలోకి 65వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతుండగా 22 గేట్లు తెరిచి 68,480 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 492.25 మీటర్లు కాగా ప్రస్తుతం 491.55 మీటర్లుగా ఉంది. పూర్తి నీటి నిలువ 33.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.30 టీఎంసీలుగా ఉంది.

పూర్తి స్థాయిలో విద్యుత్​ ఉత్పత్తి : ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో జూరాల జలాశయానికి 76, వేల 238 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు 5 గేట్లు తెరిచి 60 వేల 986 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.520 మీటర్లుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.682 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ ఎగువ జలవిద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లు, దిగువ జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

మేడిగడ్డకు పెరిగిన వరద ఉద్ధృతి : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది. ఈ సారి సీజన్లో బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితుల నేపథ్యంలో మొదటిసారిగా మేడిగడ్డ బ్యారేజీకి 3,84,400 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిని, కుంగిపోవడంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారీటి (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. బ్యారేజీ దెబ్బతిన్న సమయం నుంచి తొలిసారిగా భారీ వరద ప్రవాహం శనివారం నమోదైంది.

జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు - నారాయణపూర్ నుంచి భారీగా నీటి విడుదల - Huge Water Inflow To Jurala Project

పూడికతో నిండిపోతున్న జూరాల ప్రాజెక్టు - ఆందోళనలో అన్నదాతలు - JURALA PROJECT ISSUES

Huge Water Inflow To Jurala Project : జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయం నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరీవాహక ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆల్మట్టి జలాశయంలోకి 61 వేల క్యూసెక్కులు చేరుతుండగా, 65 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 519.60 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 517.97 మీటర్లుగా ఉంది. నీటి నిలువ 123.08 టీఎంసీలు కాగా ప్రస్తుతం 97.277 టీఎంసీలుగా ఉంది.

నిండుకుండను తలపిస్తున్న జలశయాలు : నారాయణపూర్ జలాశయంలోకి 65వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతుండగా 22 గేట్లు తెరిచి 68,480 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 492.25 మీటర్లు కాగా ప్రస్తుతం 491.55 మీటర్లుగా ఉంది. పూర్తి నీటి నిలువ 33.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.30 టీఎంసీలుగా ఉంది.

పూర్తి స్థాయిలో విద్యుత్​ ఉత్పత్తి : ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో జూరాల జలాశయానికి 76, వేల 238 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు 5 గేట్లు తెరిచి 60 వేల 986 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.520 మీటర్లుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.682 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ ఎగువ జలవిద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లు, దిగువ జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

మేడిగడ్డకు పెరిగిన వరద ఉద్ధృతి : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది. ఈ సారి సీజన్లో బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితుల నేపథ్యంలో మొదటిసారిగా మేడిగడ్డ బ్యారేజీకి 3,84,400 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిని, కుంగిపోవడంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారీటి (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. బ్యారేజీ దెబ్బతిన్న సమయం నుంచి తొలిసారిగా భారీ వరద ప్రవాహం శనివారం నమోదైంది.

జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు - నారాయణపూర్ నుంచి భారీగా నీటి విడుదల - Huge Water Inflow To Jurala Project

పూడికతో నిండిపోతున్న జూరాల ప్రాజెక్టు - ఆందోళనలో అన్నదాతలు - JURALA PROJECT ISSUES

Last Updated : Jul 20, 2024, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.