Heavy Rain Forecast in Tamil Nadu but Not a Single Drop of Rain Fall : చెన్నై నగరానికి వాతావరణ శాఖ ఇచ్చిన వర్ష సూచనలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. 15న అతిభారీ వర్షాలు అంటూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినా అదేరోజు ఉదయం అత్యంత భారీ వర్షాలు సూచించేసరికి రెడ్ అలర్ట్గా మార్చారు. 16న అత్యంత భారీ వర్షాలొస్తాయని రెడ్ అలర్ట్ ఇచ్చినా కనీసం నగరంలో చాలాచోట్ల వర్షాలు నమోదుకాకపోగా చుక్క వర్షం కూడా పడలేదు. ఈ తరహా వాతావరణ హెచ్చరికలతో నగరవాసులు గందరగోళానికి గురయ్యారు.
అంచనాలకు భిన్నంగా : వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా చెన్నైకు ఉత్తరంవైపుగా గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తీరం దాటినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అది ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించింది. తీరానికి దగ్గరగా వచ్చిన సమయంలో ఎలాంటి వర్షాలు కురవకుండా దాటేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు అదితీరం దాటగానే చెన్నైలో ఎండ రావడంతో మరో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవన్నీ వాతావరణశాఖ అంచనాలకు భిన్నంగా జరిగాయి.
గురువారం చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు తప్పాయి. చెన్నైతు పాటు కొన్ని జిల్లాల్ని అప్రమత్తం చేశారు. బుధవారం సీన్ మారడంతో గురువారం కూడా నగరంలో అలాంటి పరిస్థితులో కనిపించాయి. ఎక్కడ చుక్క వర్షం లేకపోవడంతో ప్రజలకు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగానే ఇవన్నీ జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో కేవలం కొన్నిచోట్ల మాత్రమే వోస్తరు వానలు పడ్డాయి. మణలి, తిరువొత్తియూర్లో 3 సెంటీమీటర్లు, కత్తివాక్కం, తండియార్పేటలో 2 సెం.మీ., చెన్నై కలెక్టరేట్, రాయపురం, పెరంబూర్, అయనావరంలో సెం.మీ. వర్షపాతం నమోదైంది. 16న మధ్యాహ్నం నుంచి ఎక్కడా చుక్క వాననే లేదు.
వర్షం ఎంత కురిసిందో ఎలా తెలుస్తుంది? - ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్లకు అర్థం తెలుసా?
హెచ్చరికలను గౌరవించాల్సిందే : విమర్శలు వచ్చినా వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికలను గౌరవించాల్సిందేనని వాతావరణ నిపుణుడు ప్రదీప్ జాన్ అన్నారు. కొన్ని సందర్భాల్లో భారీవర్షాలు పడతాయనే సూచన వచ్చినా తర్వాత పరిస్థితులు మారాయని తెలిపారు. 16న అత్యంత భారీ వానలు పడతాయని వాతావరణశాఖ ప్రకటనతో తాను ఏకీభవించలేదన్నట్లు పేర్కొన్నారు. మనుషులు తమకున్న సాంకేతికత పరిజ్ఞానంతో ఊహించి అంచనాలు మాత్రమే వేయగలరని, కొన్ని మోడల్స్ ఆధారంగా వాతావరణ సూచనలు ఉంటాయని వివరించారు. తాను కూడా తనకున్న సామర్థ్యం మేరకు మాత్రమే వాతావరణ సూచనలు చెబుతూ వస్తున్నట్లు చెప్పారు. ఆయన అంచనాల ప్రకారం 15, 16 తేదీల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం దాటిన ప్రాంతాలు 75 వరకు ఉన్నాయని ఇవన్నీ కూడా 24గంటల్లో ఇంతటి వర్షపాతాన్ని నమోదుచేశాయని తెలిపారు.
చెరువుల్లోకి భారీగా నీరు : 15, 16 తేదీల్లో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 891 చెరువులు జలాలతో కళకళలాడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ప్రధానంగా కన్నియాకుమరిలో 310, మదురైలో 244 చెరువులున్నాయని చెప్పారు. ఉత్తర తమిళనాడు తీర, డెల్టా జిల్లాలో 180 చెరువుల్లోకి భారీగా నీళ్లు చేరాయని వివరించారు. తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 14,139 చెరువులుంటే అందులో 1,832 చెరువుల్లో 75శాతం, 2,096 చెరువుల్లో 50 శాతానికి మించి నీరు చేరిందని తెలిపారు. కోయంబత్తూరు, దిండుక్కల్ ఈరోడ్ జిల్లాల్లోని పలు రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరిందన్నారు.
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వానలు - ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ