ETV Bharat / state

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ నిమజ్జనాలకు అనుమతి లేదు - ట్యాంక్​బండ్​పై ఫ్లెక్సీల ఏర్పాటు - NO GANESH IMMERSION AT TANK BUND

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 12:04 PM IST

Updated : Sep 10, 2024, 3:11 PM IST

Hussain Sagar Ganesh Immersion Issue 2024 : హైదరాబాద్ హుస్సేన్ సాగర్​లో వినాయక నిమజ్జనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈసారి హుస్సేన్ సాగర్​లో వినాయక నిమజ్జనాలను అనుమతించడం లేదని ట్యాంక్​బండ్​పై ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్లకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాకుండా భారీ ఎత్తున ట్యాంక్​బండ్ గ్రిల్స్​కు ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ వైపున భారీ క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుండటం గమనార్హం.

NOT ALLOWING GANESHA IMMERSION
Ganesha immersion is not allowed in Hussainsagar (ETV Bharat)

Not Allowing Ganesh Immersion in Hussain Sagar : భాగ్యనగరంలో ఏటా వినాయక నిమజ్జన కోలాహలం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హుస్సేన్ సాగర్​కు శోభయాత్రగా తరలివచ్చి తమ బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తారు. అయితే ఈ ఏడాది హుస్సేన్ సాగర్​లో నిమజ్జనాలపై నగర పోలీసులు, జీహెచ్ఎంసీ ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్​లో నిమజ్జనాలకు అనుమతి లేదని విజ్ఞప్తి చేస్తూ ట్యాంక్​బండ్ పై ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

హుస్సేన్​సాగర్​లో నిమజ్జనాలపై ఆంక్షలు : ట్రాఫిక్ పోలీసు భారికేడ్లతో పాటు ట్యాంక్​బండ్​పై ఉన్న గ్రిల్స్​కు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రిల్స్​కు అదనంగా ట్యాంక్​బండ్ పొడవునా భారీ ఇనుప కంచెలను ఏర్పాటు చేసి భక్తులెవరూ సాగర్​లో వినాయక విగ్రహాలు వేయకుండా పకడ్బందీగా బిగించారు. వాటిపై ప్రతి వంద మీటర్లకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి భక్తులెవరూ పీవోపీ విగ్రహాలను సాగర్​లో నిమజ్జనం చేయవద్దని సూచించారు.

భారీ క్రేన్లు ఏర్పాటు : మరోవైపు ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ వైపున భారీ క్రేన్లను ఏర్పాటు చేసి రెండు రోజుల నుంచి నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు పీవోపీ, మట్టి విగ్రహాలను తీసుకొచ్చి పీవీ మార్గ్​లోని క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ జోరుగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే విషయంపై హైకోర్టు కూడా గతంలో ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్‌లో ఈనెల 10 నుంచి గణేశ్‌ నిమజ్జనాలు - ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైకోర్టు ఆదేశాలు : జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్, హెచ్ఎండీఏలను ఆదేశిస్తూ ట్యాంక్​బండ్​లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం కాకుండా చూడాలని ఆదేశించింది. అయినప్పటికీ ప్రతి ఏటా వేలాదిగా పీవోపీ విగ్రహాలు ట్యాంక్ బండ్​లో నిమజ్జనం జరుగుతూనే ఉంది. గతేడాది దాదాపు 20 వేలకుపైగా పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ లెక్కలు చెబుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు ఈ ఏడాది హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి దాదాపు 5 లక్షలకు పైగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు: నిమజ్జనం కోసం కూడా నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరు జోన్లలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 20 ఎక్సావేషన్ పాండ్స్​ను ఏర్పాటు చేసింది. సమీపంలో ఉన్న ప్రజలంతా వీటిని వినియోగించుకొని నిమజ్జన ప్రక్రియను సాఫీగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జీహెచ్ఎంసీ ట్యాంక్ బండ్​పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

గణపతి బప్పా మోరియా : ఖైరతాబాద్‌ సప్తముఖ మహా గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు - KHAIRATABAD GANESH 2024

చిరుధాన్యాలతో ఆశీర్వదిస్తున్న విజ్ఞాధిపతి - Ganesha with millets in nampally

Not Allowing Ganesh Immersion in Hussain Sagar : భాగ్యనగరంలో ఏటా వినాయక నిమజ్జన కోలాహలం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హుస్సేన్ సాగర్​కు శోభయాత్రగా తరలివచ్చి తమ బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తారు. అయితే ఈ ఏడాది హుస్సేన్ సాగర్​లో నిమజ్జనాలపై నగర పోలీసులు, జీహెచ్ఎంసీ ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్​లో నిమజ్జనాలకు అనుమతి లేదని విజ్ఞప్తి చేస్తూ ట్యాంక్​బండ్ పై ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

హుస్సేన్​సాగర్​లో నిమజ్జనాలపై ఆంక్షలు : ట్రాఫిక్ పోలీసు భారికేడ్లతో పాటు ట్యాంక్​బండ్​పై ఉన్న గ్రిల్స్​కు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రిల్స్​కు అదనంగా ట్యాంక్​బండ్ పొడవునా భారీ ఇనుప కంచెలను ఏర్పాటు చేసి భక్తులెవరూ సాగర్​లో వినాయక విగ్రహాలు వేయకుండా పకడ్బందీగా బిగించారు. వాటిపై ప్రతి వంద మీటర్లకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి భక్తులెవరూ పీవోపీ విగ్రహాలను సాగర్​లో నిమజ్జనం చేయవద్దని సూచించారు.

భారీ క్రేన్లు ఏర్పాటు : మరోవైపు ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ వైపున భారీ క్రేన్లను ఏర్పాటు చేసి రెండు రోజుల నుంచి నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు పీవోపీ, మట్టి విగ్రహాలను తీసుకొచ్చి పీవీ మార్గ్​లోని క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ జోరుగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే విషయంపై హైకోర్టు కూడా గతంలో ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్‌లో ఈనెల 10 నుంచి గణేశ్‌ నిమజ్జనాలు - ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైకోర్టు ఆదేశాలు : జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్, హెచ్ఎండీఏలను ఆదేశిస్తూ ట్యాంక్​బండ్​లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం కాకుండా చూడాలని ఆదేశించింది. అయినప్పటికీ ప్రతి ఏటా వేలాదిగా పీవోపీ విగ్రహాలు ట్యాంక్ బండ్​లో నిమజ్జనం జరుగుతూనే ఉంది. గతేడాది దాదాపు 20 వేలకుపైగా పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ లెక్కలు చెబుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు ఈ ఏడాది హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి దాదాపు 5 లక్షలకు పైగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు: నిమజ్జనం కోసం కూడా నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరు జోన్లలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 20 ఎక్సావేషన్ పాండ్స్​ను ఏర్పాటు చేసింది. సమీపంలో ఉన్న ప్రజలంతా వీటిని వినియోగించుకొని నిమజ్జన ప్రక్రియను సాఫీగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జీహెచ్ఎంసీ ట్యాంక్ బండ్​పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

గణపతి బప్పా మోరియా : ఖైరతాబాద్‌ సప్తముఖ మహా గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు - KHAIRATABAD GANESH 2024

చిరుధాన్యాలతో ఆశీర్వదిస్తున్న విజ్ఞాధిపతి - Ganesha with millets in nampally

Last Updated : Sep 10, 2024, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.