ETV Bharat / state

వెలుగులోకి విడదల రజని ముఠా వసూళ్ల దందా - Vidadala Rajini Corruptions

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 9:20 PM IST

Updated : Jun 28, 2024, 10:39 PM IST

Former Minister Vidadala Rajini Illegal Corruptions: వైఎస్సార్​సీపీ వసూళ్ల దందా లెక్కతేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైన వేళ ఆ పార్టీ నేతలు తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారు. జగనన్న ఇళ్ల స్థలాల సేకరణ పేరిట కోట్లు దండుకున్న మాజీ మంత్రి విడదల రజనీ ముఠా బాధితులకు డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నారు.

vidadala_rajini_corruptions
vidadala_rajini_corruptions (ETV Bharat)

Former Minister Vidadala Rajini Illegal Corruptions: పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో సేకరించిన భూములలో అప్పటి మంత్రి విడదల రజిని అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా రూ12 లక్షలు పలుకుతోంది. ఐతే జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు 31 లక్షలుఇప్పిస్తానంటూ అప్పటి మంత్రి రజిని రైతులకు ఎరేశారు. ఐతే అందులో కొంత కమిషన్‌ కోరుకున్నారు. మధ్యవర్తులుగా కొందరిని పంపారు.

మొదటి రెండు విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు రెండున్నర లక్షల చొప్పుున మొత్తం కోటి 16 లక్షలు రైతుల నుంచి వసూలు చేశారు. మూడు, నాలుగు విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించారు. అందులో ఎకరాకు ఏడున్నర లక్షలు చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారు.

ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ రాజీనామా - AU VC and Registrar Resigned

ఈ విషయంపై అప్పట్లో ఈనాడు కథనం ప్రచురించడం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహించడంతో రైతుల వద్ద తీసుకున్న చెక్కులు, నోట్లు తిరిగి ఇచ్చేశారు. అయితే ఈ వ్యవహారంలో అప్పట్లో మధ్యవర్తిగా ఉన్న అప్పటి వైఎస్సార్​సీపీ, ప్రస్తుత టీడీపీ నాయకుడు మల్లెల రాజేష్ నాయుడు ముందుగానే రజినీకి రూ 5 కోట్లు చెల్లించాడు. పసుమర్రు శివారులోని గుదేవారిపాలెం గ్రామ పరిధిలో మరో పదెకరాలు సేకరించగా దానికి నాదెండ్ల మండలం వైఎస్సార్​సీపీ జడ్పీటీసీ మస్తాన్‌రావు మధ్యవర్తిగా కోటి రూపాయలు వసూలు చేసి రజినీకి ఇచ్చాడు.

పసుమర్రుకు చెందిన రైతులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని కూడా కలిశారు. విచారణ జరిగితే గుట్టు రట్టవుతుందని భావించిన రజనీ మనుషులు మొదట తీసుకున్న కోటి 16 లక్షలు తిరిగి ఇచ్చేశారు. గుదేవారిపాలెం రైతులు కూడా తమ వద్ద తీసుకున్న కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రజనీ ముఠా బాధితులు మరికొందరు బయటికొస్తున్నారు. తమ వద్ద రెండున్నర కోట్ల వరకూ వసూలు చేశారంటూ బోయపాలెంలోని స్టోన్‌ క్రషర్ల యాజమాన్యాల కూడా SPకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

అజిత్​సింగ్​ నగర్​ మదర్సాలో విద్యార్థిని మృతి - అసలేం జరిగింది ? - Student Death Mystery in madarsa

పోలీసు వ్యవస్థను వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసింది - సంస్కరణలు తీసుకొస్తాం: హోంమంత్రి - Home Minister Anitha Comments

Former Minister Vidadala Rajini Illegal Corruptions: పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో సేకరించిన భూములలో అప్పటి మంత్రి విడదల రజిని అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా రూ12 లక్షలు పలుకుతోంది. ఐతే జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు 31 లక్షలుఇప్పిస్తానంటూ అప్పటి మంత్రి రజిని రైతులకు ఎరేశారు. ఐతే అందులో కొంత కమిషన్‌ కోరుకున్నారు. మధ్యవర్తులుగా కొందరిని పంపారు.

మొదటి రెండు విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు రెండున్నర లక్షల చొప్పుున మొత్తం కోటి 16 లక్షలు రైతుల నుంచి వసూలు చేశారు. మూడు, నాలుగు విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించారు. అందులో ఎకరాకు ఏడున్నర లక్షలు చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారు.

ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ రాజీనామా - AU VC and Registrar Resigned

ఈ విషయంపై అప్పట్లో ఈనాడు కథనం ప్రచురించడం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహించడంతో రైతుల వద్ద తీసుకున్న చెక్కులు, నోట్లు తిరిగి ఇచ్చేశారు. అయితే ఈ వ్యవహారంలో అప్పట్లో మధ్యవర్తిగా ఉన్న అప్పటి వైఎస్సార్​సీపీ, ప్రస్తుత టీడీపీ నాయకుడు మల్లెల రాజేష్ నాయుడు ముందుగానే రజినీకి రూ 5 కోట్లు చెల్లించాడు. పసుమర్రు శివారులోని గుదేవారిపాలెం గ్రామ పరిధిలో మరో పదెకరాలు సేకరించగా దానికి నాదెండ్ల మండలం వైఎస్సార్​సీపీ జడ్పీటీసీ మస్తాన్‌రావు మధ్యవర్తిగా కోటి రూపాయలు వసూలు చేసి రజినీకి ఇచ్చాడు.

పసుమర్రుకు చెందిన రైతులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని కూడా కలిశారు. విచారణ జరిగితే గుట్టు రట్టవుతుందని భావించిన రజనీ మనుషులు మొదట తీసుకున్న కోటి 16 లక్షలు తిరిగి ఇచ్చేశారు. గుదేవారిపాలెం రైతులు కూడా తమ వద్ద తీసుకున్న కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రజనీ ముఠా బాధితులు మరికొందరు బయటికొస్తున్నారు. తమ వద్ద రెండున్నర కోట్ల వరకూ వసూలు చేశారంటూ బోయపాలెంలోని స్టోన్‌ క్రషర్ల యాజమాన్యాల కూడా SPకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

అజిత్​సింగ్​ నగర్​ మదర్సాలో విద్యార్థిని మృతి - అసలేం జరిగింది ? - Student Death Mystery in madarsa

పోలీసు వ్యవస్థను వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసింది - సంస్కరణలు తీసుకొస్తాం: హోంమంత్రి - Home Minister Anitha Comments

Last Updated : Jun 28, 2024, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.