ETV Bharat / state

రుణమాఫీ కాలేదా అయితే అర్జీ ఇవ్వండి - ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే? - Farmers on Loan Waiver Issues

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 11:19 AM IST

Updated : Aug 23, 2024, 2:33 PM IST

Farmers on Loan Waiver Issues : మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ సాగుతున్న వేళ కర్షకుల్లో ఆనందం నెలకొంటే వివిధ సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో మాఫీ కాని అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని కొండంత సంబరపడ్డా అన్ని అర్హతలు ఉన్నా తమకు మాఫీ కాలేదంటూ రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులు, యంత్రాంగానికి మొర పెట్టుకుంటున్నారు. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండలాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణమాఫీ ప్రజావాణికి బాధిత రైతులు బారులు తీరుతున్నారు.

Farmers on Loan Waiver Issues
Farmers on Loan Waiver Issues (ETV Bharat)

Farmers on Loan Waiver Issues : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అన్నదాతకు రుణమాఫీ కష్టాలు తీరడం లేదు. తీరా రుణాలు మాఫీ అయ్యే సమయంలో సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఒక్కసారిగా ఖాతాల్లో సొమ్ము జమ కావడం ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు జిల్లాల్లోనూ రుణాల మాఫీకి తమకు అన్ని అర్హతలు ఉన్నా కాలేదంటూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంలో కర్షకుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతుండటంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అందించేందుకు భరోసా ఇచ్చేలా కార్యాచరణకు సిద్ధమయ్యారు.

మండలాల వారీగా ప్రత్యేక డ్రైవ్​లు : ఈ మేరకు ఉభయ జిల్లాల్లో మండలాల వారీగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. రైతు వేదికలు, మండల వ్యవసాయశాఖ అధికారుల కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల్ని నియమించారు. రైతుల సమక్షంలోనే ఆన్‌లైన్‌లో ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను రైతులకు వివరిస్తున్నారు. వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు.

'నేను రూ.28వేలు వ్యవసాయ రుణం తీసుకున్నాను. ఇక్కడకి వస్తే మాఫీ అయిందని మొదట చెప్పారు. ఆ తర్వాత కాలేదన్నారు. ఈవో దగ్గరకి వెళ్లాలని చెప్పారు. ఇక్కడకి వస్తే రుణమాఫీ కాలేదంటున్నారు. అక్కడకీ వెళ్లు ఇక్కడికి వెళ్లు అని చెప్పడం తప్ప పనిమాత్రం కావడం లేదు' అని ఓ రైతు వాపోయారు.

రుణమాఫీ సమస్యల పరిష్కారం దిశగా : ఈ ప్రత్యేక డ్రైవ్​లో లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు దరఖాస్తుల్ని యంత్రాంగం వెంటనే వ్యవసాయ శాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ చేయనున్నారు. తర్వాత ఉన్నతాధికారులు దరఖాస్తుల్ని స్వయంగా పరిశీలించి రుణాల మాఫీకి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. వీటిలో ప్రధానంగా ఆధార్ నెంబర్లలో తప్పులు, పాసు పుస్తకాలు లేకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం వంటి కారణాలు ఆన్‌లైన్‌లో చూపుతున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

"రుణమాఫీ లబ్ధిదారుల్లో కొంతమందికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల కుటుంబ సర్టిఫికేషన్ చేయడం కష్టసాధ్యమవుతోంది. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు తప్పులు ఉండటం, పాసుపుస్తకాలు లేకపోవడం, 2018-2024 మధ్యలో రైతులు తీసుకున్న రుణం కంటే వడ్డీ ఎక్కువగా ఉండటం లాంటి సమస్యలపైనే రైతులు ఎక్కువగా మా వద్దకు వస్తున్నారు"- శిరిన్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి, ఖమ్మం

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మరోవైపు రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రెండు జిల్లాల్లో పదిరోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు.

'ప్రభుత్వానికి బ్యాంకులు ఇచ్చిన లబ్దిదారుల వివరాల మేరకే రైతులకు రుణమాఫీ చేశాం. కానీ కొంతమంది అధికారం పోయిందని నిర్వేదంతోనే మరే ఇతరకారణాలతోనో ప్రభుత్వంపై నిరాధారపూరితమైన ఆరోపణలు చేస్తున్నారు' అని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

రుణమాఫీపై రైతుల ఆందోళన - మాటిచ్చిన ప్రకారమే మాఫీ చేయాలని డిమాండ్ - ADILABAD LOAN WAIVER ISSUES

సాంకేతిక చిక్కులు, కర్షకులకు చుక్కలు - రుణమాఫీ కాలేదంటూ వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు - Farmers on RunaMafi

Farmers on Loan Waiver Issues : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అన్నదాతకు రుణమాఫీ కష్టాలు తీరడం లేదు. తీరా రుణాలు మాఫీ అయ్యే సమయంలో సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఒక్కసారిగా ఖాతాల్లో సొమ్ము జమ కావడం ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు జిల్లాల్లోనూ రుణాల మాఫీకి తమకు అన్ని అర్హతలు ఉన్నా కాలేదంటూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంలో కర్షకుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతుండటంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అందించేందుకు భరోసా ఇచ్చేలా కార్యాచరణకు సిద్ధమయ్యారు.

మండలాల వారీగా ప్రత్యేక డ్రైవ్​లు : ఈ మేరకు ఉభయ జిల్లాల్లో మండలాల వారీగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. రైతు వేదికలు, మండల వ్యవసాయశాఖ అధికారుల కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల్ని నియమించారు. రైతుల సమక్షంలోనే ఆన్‌లైన్‌లో ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను రైతులకు వివరిస్తున్నారు. వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు.

'నేను రూ.28వేలు వ్యవసాయ రుణం తీసుకున్నాను. ఇక్కడకి వస్తే మాఫీ అయిందని మొదట చెప్పారు. ఆ తర్వాత కాలేదన్నారు. ఈవో దగ్గరకి వెళ్లాలని చెప్పారు. ఇక్కడకి వస్తే రుణమాఫీ కాలేదంటున్నారు. అక్కడకీ వెళ్లు ఇక్కడికి వెళ్లు అని చెప్పడం తప్ప పనిమాత్రం కావడం లేదు' అని ఓ రైతు వాపోయారు.

రుణమాఫీ సమస్యల పరిష్కారం దిశగా : ఈ ప్రత్యేక డ్రైవ్​లో లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు దరఖాస్తుల్ని యంత్రాంగం వెంటనే వ్యవసాయ శాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ చేయనున్నారు. తర్వాత ఉన్నతాధికారులు దరఖాస్తుల్ని స్వయంగా పరిశీలించి రుణాల మాఫీకి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. వీటిలో ప్రధానంగా ఆధార్ నెంబర్లలో తప్పులు, పాసు పుస్తకాలు లేకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం వంటి కారణాలు ఆన్‌లైన్‌లో చూపుతున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

"రుణమాఫీ లబ్ధిదారుల్లో కొంతమందికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల కుటుంబ సర్టిఫికేషన్ చేయడం కష్టసాధ్యమవుతోంది. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు తప్పులు ఉండటం, పాసుపుస్తకాలు లేకపోవడం, 2018-2024 మధ్యలో రైతులు తీసుకున్న రుణం కంటే వడ్డీ ఎక్కువగా ఉండటం లాంటి సమస్యలపైనే రైతులు ఎక్కువగా మా వద్దకు వస్తున్నారు"- శిరిన్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి, ఖమ్మం

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మరోవైపు రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రెండు జిల్లాల్లో పదిరోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు.

'ప్రభుత్వానికి బ్యాంకులు ఇచ్చిన లబ్దిదారుల వివరాల మేరకే రైతులకు రుణమాఫీ చేశాం. కానీ కొంతమంది అధికారం పోయిందని నిర్వేదంతోనే మరే ఇతరకారణాలతోనో ప్రభుత్వంపై నిరాధారపూరితమైన ఆరోపణలు చేస్తున్నారు' అని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

రుణమాఫీపై రైతుల ఆందోళన - మాటిచ్చిన ప్రకారమే మాఫీ చేయాలని డిమాండ్ - ADILABAD LOAN WAIVER ISSUES

సాంకేతిక చిక్కులు, కర్షకులకు చుక్కలు - రుణమాఫీ కాలేదంటూ వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు - Farmers on RunaMafi

Last Updated : Aug 23, 2024, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.