ETV Bharat / state

పూడికతో నిండిపోతున్న జూరాల ప్రాజెక్టు - ఆందోళనలో అన్నదాతలు - JURALA PROJECT ISSUES

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 1:58 PM IST

Updated : Jun 27, 2024, 2:17 PM IST

Jurala Dam Water Crisis : జూరాల ప్రాజెక్టులో ఏటా పేరుకుపోయే పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతుండడంతో, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లకోసారి పూడిక సమస్య కారణంగా గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం తగ్గించాల్సిన పరిస్థితి వస్తోంది. జూరాల వద్ద నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

Jurala project
Jurala Dam (ETV Bharat)

Jurala project will be filled with silt: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జలప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. కానీ ఏటా పేరుకుపోయే పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో ఆయకట్టుపై అది తీవ్రప్రభావం చూపుతోంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతుండడంతో... రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. రెండు పంటలకు పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందాల్సిన చోట నీటి నిల్వ లేక రెండో పంటకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడుతోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన జలవనరు జూరాల ప్రాజెక్టు. జూరాల నిండితేనే నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు సాగునీరు అందేది. అలాంటి జూరాల జలాశయం ప్రధాన క్రస్ట్‌గేట్ల దిగువన స్లూయిజ్‌లు లేకపోవటంతో, ఏటా పైనుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టులో పూడిక పేరుకుపోతోంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ పదేళ్ల క్రితం 11.94 టీఎంసీలు కాగా పూడిక కారణంగా దీన్ని నీటిపారుదల శాఖ అధికారులు 2013లో 9.657 టీఎంసీలకు తగ్గించారు. అప్పట్లోనే పూడిక వల్ల జలాశయంలో నీటినిల్వ 2.283 టీఎంసీలు తగ్గిపోయింది. నీటి నిల్వ సామర్ధ్యం తగ్గడం వల్ల వానాకాలంలో రైతులకు ఇబ్బందులు ఏర్పడకపోయినా.. రబీలో ఐదారేళ్ల నుంచి సాగునీటి కష్టాలు తప్పటం లేదు.

గతేడాది జలాశయంలో నీటినిల్వ లేక ఏకంగా యాసంగిలో పంటవిరామం ప్రకటించాల్సిన పరిస్ధితి ఎదురైంది. పదేళ్లకోసారి పూడిక సమస్య కారణంగా గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం తగ్గించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదే కొనసాగితే భవిష్యత్తు పాలమూరు జిల్లాలోని ప్రధాన ఎత్తిపోతల పథకాలకు, తాగునీటి వనరులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ఇప్పటికే ఎత్తిపోతల పథకాల కింద కేవలం ఓ పంటకే నీరందిచాల్సిన పరిస్థితి ఉంది. రెండోపంటకు విరామం ప్రకటిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న జలప్రదాయని మనుగడకు పూడిక ముప్పుగా మారుతోంది. ప్రభుత్వం పూడికపై దృష్టి సారించి నీటి నిల్వలు పెంచేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

'ప్రాజెక్టులో నీటినిల్వ తగ్గింపు కారణంగా ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చిన నీళ్లు నిల్వ ఉంచలేక, జూరాలపై అధారపడ్డ ఇతర ఎత్తిపోతల పథకాలకు సైతం నీరందించలేని పరిస్థితి నెలకొంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేవిధంగా కృషి చేస్తాం.'బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే

Jurala canals Damaged: సాగుజలం వృథా మయం.. శిథిలావస్థకు చేరిన జూరాల కాలువలు

జూరాల జలాశయంలో వరద ప్రవాహం అత్యధికంగా ఉన్న సమయంలో సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం గరిష్ట నీటినిల్వలో 20 నుంచి 30శాతం తగ్గించి నీటిని నిల్వ చేస్తారు. పూడిక ఉన్న కారణంగా సామర్థ్యానికి మించి నిల్వ చేస్తే క్రస్ట్‌ గేట్లపై ఒత్తిడి పడుతోంది. పూర్తి స్థాయిలో నిల్వ చేస్తే వెనక జలాలు పరీవాహక గ్రామాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఏటేటా పూడిక పేరుకుపోతున్న నేపథ్యంలో పదేళ్ల తర్వాత మరోసారి నీటినిల్వ తగ్గిస్తారనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. అందుకే పూడికను తొలగించి నీటినిల్వ సామర్ధ్యాన్నిగరిష్ట స్థాయికి పెంచాలని రైతులు కోరుతున్నారు.

జూరాల ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచుకోలేని కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోతోంది. ఏటా సుమారు వెయ్యి టీఎంసీల నీళ్లు జారాల ద్వారా దిగువకు విడుదల చేస్తూ, సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జూరాల వద్ద నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

Jurala Project : రాష్ట్రమంతా జలకళ.. జూరాల మాత్రం వెల వెల

Jurala project will be filled with silt: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జలప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. కానీ ఏటా పేరుకుపోయే పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో ఆయకట్టుపై అది తీవ్రప్రభావం చూపుతోంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతుండడంతో... రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. రెండు పంటలకు పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందాల్సిన చోట నీటి నిల్వ లేక రెండో పంటకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడుతోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన జలవనరు జూరాల ప్రాజెక్టు. జూరాల నిండితేనే నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు సాగునీరు అందేది. అలాంటి జూరాల జలాశయం ప్రధాన క్రస్ట్‌గేట్ల దిగువన స్లూయిజ్‌లు లేకపోవటంతో, ఏటా పైనుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టులో పూడిక పేరుకుపోతోంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ పదేళ్ల క్రితం 11.94 టీఎంసీలు కాగా పూడిక కారణంగా దీన్ని నీటిపారుదల శాఖ అధికారులు 2013లో 9.657 టీఎంసీలకు తగ్గించారు. అప్పట్లోనే పూడిక వల్ల జలాశయంలో నీటినిల్వ 2.283 టీఎంసీలు తగ్గిపోయింది. నీటి నిల్వ సామర్ధ్యం తగ్గడం వల్ల వానాకాలంలో రైతులకు ఇబ్బందులు ఏర్పడకపోయినా.. రబీలో ఐదారేళ్ల నుంచి సాగునీటి కష్టాలు తప్పటం లేదు.

గతేడాది జలాశయంలో నీటినిల్వ లేక ఏకంగా యాసంగిలో పంటవిరామం ప్రకటించాల్సిన పరిస్ధితి ఎదురైంది. పదేళ్లకోసారి పూడిక సమస్య కారణంగా గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం తగ్గించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదే కొనసాగితే భవిష్యత్తు పాలమూరు జిల్లాలోని ప్రధాన ఎత్తిపోతల పథకాలకు, తాగునీటి వనరులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ఇప్పటికే ఎత్తిపోతల పథకాల కింద కేవలం ఓ పంటకే నీరందిచాల్సిన పరిస్థితి ఉంది. రెండోపంటకు విరామం ప్రకటిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న జలప్రదాయని మనుగడకు పూడిక ముప్పుగా మారుతోంది. ప్రభుత్వం పూడికపై దృష్టి సారించి నీటి నిల్వలు పెంచేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

'ప్రాజెక్టులో నీటినిల్వ తగ్గింపు కారణంగా ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చిన నీళ్లు నిల్వ ఉంచలేక, జూరాలపై అధారపడ్డ ఇతర ఎత్తిపోతల పథకాలకు సైతం నీరందించలేని పరిస్థితి నెలకొంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేవిధంగా కృషి చేస్తాం.'బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే

Jurala canals Damaged: సాగుజలం వృథా మయం.. శిథిలావస్థకు చేరిన జూరాల కాలువలు

జూరాల జలాశయంలో వరద ప్రవాహం అత్యధికంగా ఉన్న సమయంలో సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం గరిష్ట నీటినిల్వలో 20 నుంచి 30శాతం తగ్గించి నీటిని నిల్వ చేస్తారు. పూడిక ఉన్న కారణంగా సామర్థ్యానికి మించి నిల్వ చేస్తే క్రస్ట్‌ గేట్లపై ఒత్తిడి పడుతోంది. పూర్తి స్థాయిలో నిల్వ చేస్తే వెనక జలాలు పరీవాహక గ్రామాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఏటేటా పూడిక పేరుకుపోతున్న నేపథ్యంలో పదేళ్ల తర్వాత మరోసారి నీటినిల్వ తగ్గిస్తారనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. అందుకే పూడికను తొలగించి నీటినిల్వ సామర్ధ్యాన్నిగరిష్ట స్థాయికి పెంచాలని రైతులు కోరుతున్నారు.

జూరాల ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచుకోలేని కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోతోంది. ఏటా సుమారు వెయ్యి టీఎంసీల నీళ్లు జారాల ద్వారా దిగువకు విడుదల చేస్తూ, సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జూరాల వద్ద నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

Jurala Project : రాష్ట్రమంతా జలకళ.. జూరాల మాత్రం వెల వెల

Last Updated : Jun 27, 2024, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.