ETV Bharat / state

48 గంటల్లో నాలుగు అత్యాచార ఘటనలా? - నిజంగా సిగ్గుచేటు : కేటీఆర్​ - ktr twwet on women safety in tg

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 4:18 PM IST

Updated : Aug 1, 2024, 10:48 PM IST

KTR Tweet on The Safety of Women in Telangana : రాష్ట్రంలో 48 గంటల్లో నాలుగు అత్యాచార ఘటనలు జరగడం సిగ్గు చేటని మాజీ మంత్రి కేటీఆర్​ విమర్శించారు. ఈ క్రూరమైన సంఘటనలతో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఎక్స్​ వేదికగా ధ్వజమెత్తారు.

KTR Tweet on The Safety of Women in Telangana
KTR Tweet on The Safety of Women in Telangana (ETV Bharat)

Ex Minister KTR on Women Safety in Telangana : రాష్ట్రంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గు చేటని ఆవేదన చెందారు. ఈ క్రూరమైన చర్యలతో మహిళలకు భద్రత లేదని అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న పరిస్థితిని ఎత్తిచూపుతున్నాయని తెలిపారు.

ఎనిమిది నెలలు గడిచినా రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభావం నేరాలు పెరగడానికి ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్​, పుప్పాలగూడలో జరిగిన దారుణ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్​ ఎక్స్​ వేదికగా డిమాండ్​ చేశారు.

ఒకే రోజు రెండు అత్యాచార ఘటనలు : గత నెల 30వ తేదీన కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్​ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిర్మల్​ జిల్లా నుంచి ప్రకాశం వెలుతున్న బస్సులో జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్​ అత్యాచారం చేశాడు. ఆమె డయల్​ 100కు ఫిర్యాదు చేయడంలో పోలీసులు మేడ్చల్​ సమీపంలో బస్సు ఉండగా మహిళ ఫిర్యాదుతో హరికృష్ణ ట్రావెల్స్​ బస్సు కోసం గాలించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్​చేసి పట్టుకున్నారు. డ్రైవర్​ కృష్ణ పరారీ అయ్యాడు. మరో డ్రైవర్​ సిద్ధయ్యను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. అనంతరం నేడు డ్రైవర్​ కృష్ణను పోలీసులు పట్టుకున్నారు.

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​పై స్నేహితులు అత్యాచారం : అదే రోజు హైదరాబాద్​లోని వనస్థలిపురంలో ఓ అత్యాచారం జరిగింది. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఉద్యోగినిపై స్నేహితులు అత్యాచారం చేశారు. వనస్థలిపురానికి చెందిన యువతి తనకు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఉద్యోగం వచ్చిందని తన ఫ్రెండ్​తో కలిసి రెస్టారెంట్​ అండ్​ బార్​కి వెళ్లింది. ఈక్రమంలో ఆమెకు తన స్నేహితుడు మద్యం పట్టించి బార్​లో ఓ రూంను అద్దెకు తీసుకొని అత్యాచారం చేశాడు. తన ఫ్రెండ్​కు కాల్​ చేసి రమ్మని చెప్పి వారిద్దరు కలిసి ఆ యువతిపై అఘాయిత్యం చేశారు.

అప్పటివరకు మద్యం మత్తులో ఉన్న యువతి అనంతరం స్పృహ రావడంతో ఇద్దరు వ్యక్తులు గదిలో కనిపించారు. రక్తస్రావం కావడంతో భయాందోళనకు గురైంది. వెంటనే గట్టిగా కేకలు వేసింది ఆ యువతి. దీంతో హోటల్​ సిబ్బంది రూంలోకి రావడంతో ఆ ఇద్దరు అక్కడి నుంచి పరారీ అయ్యారు. బాధితురాలిని హోటల్​ సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం ఆ యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని పట్టుకున్నారు. ఇలాంటి అత్యాచార ఘటనలు రాష్ట్రంలో జరగడంతో విపక్షాలు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత కరవైందని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

రాష్ట్రంలో కీచక పర్వం - రన్నింగ్​ బస్సులో ఒకరిపై, స్నేహం ముసుగులో మరొకరిపై అత్యాచారం - RAPE INCIDENTS IN TELANGANA

పోర్న్ వీడియోస్ చూసి సొంత చెల్లిపై రేప్​- ఆపై గొంతు నులిమి హత్య- తల్లి కళ్ల ముందే జరిగినా! - Sister Molested And Murder

Ex Minister KTR on Women Safety in Telangana : రాష్ట్రంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గు చేటని ఆవేదన చెందారు. ఈ క్రూరమైన చర్యలతో మహిళలకు భద్రత లేదని అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న పరిస్థితిని ఎత్తిచూపుతున్నాయని తెలిపారు.

ఎనిమిది నెలలు గడిచినా రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభావం నేరాలు పెరగడానికి ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్​, పుప్పాలగూడలో జరిగిన దారుణ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్​ ఎక్స్​ వేదికగా డిమాండ్​ చేశారు.

ఒకే రోజు రెండు అత్యాచార ఘటనలు : గత నెల 30వ తేదీన కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్​ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిర్మల్​ జిల్లా నుంచి ప్రకాశం వెలుతున్న బస్సులో జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్​ అత్యాచారం చేశాడు. ఆమె డయల్​ 100కు ఫిర్యాదు చేయడంలో పోలీసులు మేడ్చల్​ సమీపంలో బస్సు ఉండగా మహిళ ఫిర్యాదుతో హరికృష్ణ ట్రావెల్స్​ బస్సు కోసం గాలించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్​చేసి పట్టుకున్నారు. డ్రైవర్​ కృష్ణ పరారీ అయ్యాడు. మరో డ్రైవర్​ సిద్ధయ్యను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. అనంతరం నేడు డ్రైవర్​ కృష్ణను పోలీసులు పట్టుకున్నారు.

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​పై స్నేహితులు అత్యాచారం : అదే రోజు హైదరాబాద్​లోని వనస్థలిపురంలో ఓ అత్యాచారం జరిగింది. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఉద్యోగినిపై స్నేహితులు అత్యాచారం చేశారు. వనస్థలిపురానికి చెందిన యువతి తనకు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఉద్యోగం వచ్చిందని తన ఫ్రెండ్​తో కలిసి రెస్టారెంట్​ అండ్​ బార్​కి వెళ్లింది. ఈక్రమంలో ఆమెకు తన స్నేహితుడు మద్యం పట్టించి బార్​లో ఓ రూంను అద్దెకు తీసుకొని అత్యాచారం చేశాడు. తన ఫ్రెండ్​కు కాల్​ చేసి రమ్మని చెప్పి వారిద్దరు కలిసి ఆ యువతిపై అఘాయిత్యం చేశారు.

అప్పటివరకు మద్యం మత్తులో ఉన్న యువతి అనంతరం స్పృహ రావడంతో ఇద్దరు వ్యక్తులు గదిలో కనిపించారు. రక్తస్రావం కావడంతో భయాందోళనకు గురైంది. వెంటనే గట్టిగా కేకలు వేసింది ఆ యువతి. దీంతో హోటల్​ సిబ్బంది రూంలోకి రావడంతో ఆ ఇద్దరు అక్కడి నుంచి పరారీ అయ్యారు. బాధితురాలిని హోటల్​ సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం ఆ యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని పట్టుకున్నారు. ఇలాంటి అత్యాచార ఘటనలు రాష్ట్రంలో జరగడంతో విపక్షాలు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత కరవైందని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

రాష్ట్రంలో కీచక పర్వం - రన్నింగ్​ బస్సులో ఒకరిపై, స్నేహం ముసుగులో మరొకరిపై అత్యాచారం - RAPE INCIDENTS IN TELANGANA

పోర్న్ వీడియోస్ చూసి సొంత చెల్లిపై రేప్​- ఆపై గొంతు నులిమి హత్య- తల్లి కళ్ల ముందే జరిగినా! - Sister Molested And Murder

Last Updated : Aug 1, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.