ETV Bharat / state

అధికార లాంఛనాలతో మాజీ మంత్రి డీఎస్​ అంత్యక్రియలు పూర్తి - భారీగా తరలివచ్చిన అభిమానులు - D Srinivas Final Funeral

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 5:51 PM IST

Ex Minister D Srinivas Final Funeral : మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ అంత్యక్రియలు నిజామాబాద్​లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలను నిర్వహించారు. ఆయన అంతిమ యాత్రలో పలువురు కాంగ్రెస్​ నేతలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Ex Minister D Srinivas Final Funeral
Ex Minister D Srinivas Final Funeral (ETV Bharat)

Ex Minister D Srinivas Final Funeral Completed : మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ అంత్యక్రియలు నిజామాబాద్​ బైపాస్ ​రోడ్డు సమీపంలోని ఫామ్​హౌజ్​లో ఘనంగా జరిగాయి. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అంతకు ముందు నిజామాబాద్​లోని ప్రగతినగర్​ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్​ నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర, కంఠేశ్వర్​, బైపాస్​ రోడ్డు మీదుగా ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు సాగింది. అక్కడ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను ముందే చేసి ఉంచారు. ఈ అంతిమ యాత్రలో రాజకీయ పార్టీల నేతలు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్​ రెడ్డి నివాళి : అంతకు ముందు నిజామాబాద్​లోని నివాసంలో శ్రీనివాస్​ పార్థివ దేహానికి సీఎం రేవంత్​ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం డీఎస్​ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీసీసీ చీఫ్​గా, మంత్రిగా డీఎస్​ సేవలు అందించారని తెలిపారు. నిజామాబాద్​ నుంచి బలహీన వర్గాల వారికి అవకాశం కల్పించింది డీఎస్సే అని కొనియాడారు. కుటుంబ సభ్యుల ఆలోచనలతోనే డీఎస్​ను గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కొంతకాలం పార్టీకి దూరమైనా పార్లమెంటులో డీఎస్​ను సోనియాగాంధీ ఆప్యాయంగా పలకరించేవారని తెలిపారు. డీఎస్​ చనిపోయినప్పుడు కాంగ్రెస్​ జెండా తనపై కప్పాలనే ఆయన కోరికను నెరవేర్చడానికే కాంగ్రెస్​ జెండాను ఆయనపై కప్పామని తెలిపారు. ఇలా ఆయన చివరి కోరికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​ బాబు ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి పంపించి నెరవేర్చామన్నారు.

గుండెపోటుతో డీఎస్​ మృతి : హైదరాబాద్​లోని బంజారాహిల్స్​ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో డీఎస్​ శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజకీయ పార్టీ నాయకులు, అభిమానుల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని నివాసంలో ఉంచారు. అనంతరం భౌతిక కాయాన్ని అంబులెన్స్​లో నిజామాబాద్​లోని నివాసానికి తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్ధం ఉంచి నేడు అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

మరణించాక తనపై కాంగ్రెస్ జెండా కప్పాలనేది డీఎస్ కోరిక - అందుకే మేం అలా చేశాం : రేవంత్ రెడ్డి - CM REVANTH PAYS HOMAGE TO DS

కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత- పలువురు నాయకుల సంతాపం - tributes to dharmapuri srinivas

Ex Minister D Srinivas Final Funeral Completed : మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ అంత్యక్రియలు నిజామాబాద్​ బైపాస్ ​రోడ్డు సమీపంలోని ఫామ్​హౌజ్​లో ఘనంగా జరిగాయి. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అంతకు ముందు నిజామాబాద్​లోని ప్రగతినగర్​ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్​ నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర, కంఠేశ్వర్​, బైపాస్​ రోడ్డు మీదుగా ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు సాగింది. అక్కడ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను ముందే చేసి ఉంచారు. ఈ అంతిమ యాత్రలో రాజకీయ పార్టీల నేతలు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్​ రెడ్డి నివాళి : అంతకు ముందు నిజామాబాద్​లోని నివాసంలో శ్రీనివాస్​ పార్థివ దేహానికి సీఎం రేవంత్​ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం డీఎస్​ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీసీసీ చీఫ్​గా, మంత్రిగా డీఎస్​ సేవలు అందించారని తెలిపారు. నిజామాబాద్​ నుంచి బలహీన వర్గాల వారికి అవకాశం కల్పించింది డీఎస్సే అని కొనియాడారు. కుటుంబ సభ్యుల ఆలోచనలతోనే డీఎస్​ను గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కొంతకాలం పార్టీకి దూరమైనా పార్లమెంటులో డీఎస్​ను సోనియాగాంధీ ఆప్యాయంగా పలకరించేవారని తెలిపారు. డీఎస్​ చనిపోయినప్పుడు కాంగ్రెస్​ జెండా తనపై కప్పాలనే ఆయన కోరికను నెరవేర్చడానికే కాంగ్రెస్​ జెండాను ఆయనపై కప్పామని తెలిపారు. ఇలా ఆయన చివరి కోరికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​ బాబు ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి పంపించి నెరవేర్చామన్నారు.

గుండెపోటుతో డీఎస్​ మృతి : హైదరాబాద్​లోని బంజారాహిల్స్​ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో డీఎస్​ శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజకీయ పార్టీ నాయకులు, అభిమానుల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని నివాసంలో ఉంచారు. అనంతరం భౌతిక కాయాన్ని అంబులెన్స్​లో నిజామాబాద్​లోని నివాసానికి తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్ధం ఉంచి నేడు అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

మరణించాక తనపై కాంగ్రెస్ జెండా కప్పాలనేది డీఎస్ కోరిక - అందుకే మేం అలా చేశాం : రేవంత్ రెడ్డి - CM REVANTH PAYS HOMAGE TO DS

కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత- పలువురు నాయకుల సంతాపం - tributes to dharmapuri srinivas

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.