ETV Bharat / state

రూ.‌5 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 120 గురుకుల పాఠశాలల నిర్మాణం : డిప్యూటీ సీఎం భట్టి - Bhatti Review On Gurukul Schools

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 9:59 PM IST

Telangana Gurukula Educational Institutions : ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ పాఠశాలల భవనాల నిర్మాణాల కోసం ఆయా నియోజకవర్గాల్లో కావలసిన స్థలాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని స్థలాన్ని సేకరించి డిజైన్స్ వేయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ వార్షిక సంవత్సరం రూ. 5 వేల కోట్లతో 30 ప్రాంతాల్లో 120 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు.

Telangana Gurukula Educational Institutions
Deputy CM Bhatti Review On Gurukula Institutions (ETV Bharat)

Deputy CM Bhatti Review On Gurukula Institutions : రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 5వేల కోట్ల రూపాయలతో 30 ప్రాంతాల్లో 120 గురుకుల పాఠశాల భవనాలు నిర్మించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సమీకృత గురుకుల సముదాయాల కోసం నియోజకవర్గాల్లో స్థలాలు, డిజైన్ల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు, పట్టణాల్లో 10 నుంచి 15 ఎకరాలు సేకరించాలన్నారు. ఎనిమిది నెలల్లోనే ఈ భవనాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థి మంచంపైనే పడుకునేలా చర్యలు తీసుకోవాలని, వెంటనే నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.

Congress Govt Focus On Gurukul Issues : టాయిలెట్లు, బాత్ రూంలు, మంచినీరు, విద్యుత్ సదుపాయం, తలుపులు, కిటికీలు, దోమతెరలు తదితర వివరాలను హాస్టళ్లు, గురుకులాల్లో ప్రదర్శించాలన్నారు. గురుకులాల్లో అవసరమైన సదుపాయాలపై ఈనెల 29లోగా నివేదిక సమర్పించాలని విద్యాశాఖకు డిప్యూటీ సీఎం ఆదేశించారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్​షిప్​ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.

పెండింగులో ఉన్న ఓవర్సీస్ స్కాలర్​షిప్​ బకాయిల జాబితా ఇవ్వాలని అధికారులకు తెలిపారు. నిర్ణీత గడువులోగా ఓవర్సీస్ ఉపకార వేతనాల నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారులదేనిని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలపై సమీక్షించిన ఉపముఖ్యమంత్రి, విద్యార్థులకు మంచాలు, బెడ్స్, టాయిలెట్లు, బాత్ రూం, ప్రహారీ గోడ, భద్రత చర్యలు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

తెలంగాణను దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలి : సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth On Sports University

''పెద్దాపూర్' ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది - ఇక నుంచి గురుకులాలపై ప్రత్యేక దృష్టి' - DY CM visits Peddapur Gurukul

Deputy CM Bhatti Review On Gurukula Institutions : రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 5వేల కోట్ల రూపాయలతో 30 ప్రాంతాల్లో 120 గురుకుల పాఠశాల భవనాలు నిర్మించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సమీకృత గురుకుల సముదాయాల కోసం నియోజకవర్గాల్లో స్థలాలు, డిజైన్ల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు, పట్టణాల్లో 10 నుంచి 15 ఎకరాలు సేకరించాలన్నారు. ఎనిమిది నెలల్లోనే ఈ భవనాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థి మంచంపైనే పడుకునేలా చర్యలు తీసుకోవాలని, వెంటనే నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.

Congress Govt Focus On Gurukul Issues : టాయిలెట్లు, బాత్ రూంలు, మంచినీరు, విద్యుత్ సదుపాయం, తలుపులు, కిటికీలు, దోమతెరలు తదితర వివరాలను హాస్టళ్లు, గురుకులాల్లో ప్రదర్శించాలన్నారు. గురుకులాల్లో అవసరమైన సదుపాయాలపై ఈనెల 29లోగా నివేదిక సమర్పించాలని విద్యాశాఖకు డిప్యూటీ సీఎం ఆదేశించారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్​షిప్​ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.

పెండింగులో ఉన్న ఓవర్సీస్ స్కాలర్​షిప్​ బకాయిల జాబితా ఇవ్వాలని అధికారులకు తెలిపారు. నిర్ణీత గడువులోగా ఓవర్సీస్ ఉపకార వేతనాల నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారులదేనిని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలపై సమీక్షించిన ఉపముఖ్యమంత్రి, విద్యార్థులకు మంచాలు, బెడ్స్, టాయిలెట్లు, బాత్ రూం, ప్రహారీ గోడ, భద్రత చర్యలు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

తెలంగాణను దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలి : సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth On Sports University

''పెద్దాపూర్' ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది - ఇక నుంచి గురుకులాలపై ప్రత్యేక దృష్టి' - DY CM visits Peddapur Gurukul

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.