ETV Bharat / state

సైబర్​ వలలో చిక్కుకున్న సాఫ్ట్​వేర్​ - కేవలం 11 నిమిషాల్లో రూ.18 లక్షలు రికవరీ చేసిన పోలీసులు - Cyber Crime Police Recovered Money

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 10:48 PM IST

Cyber Crime Police Recovered Money : కేవలం 11 నిమిషాల్లోనే సైబర్​ నేరగాళ్ల చేతిలోని రూ.18 లక్షలను సైబర్​ క్రైం పోలీసులు నిలుపుదల చేశారు. సైబర్​ చీటర్స్​ ఒక టెకీకి ఫోన్​ చేసి డ్రగ్స్​ సరఫరా చేస్తున్నాంటూ బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన సాఫ్ట్​వేర్​ నగదు పంపించాడు. నిమిషాల్లోనే మోసపోయినట్లు గుర్తించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో కథ సుఖాంతం అయింది. ఇది హైదరాబాద్​ నగరంలో జరిగింది.

Cyber Crime Police Recovered Money
Cyber Crime Police Recovered Money (ETV Bharat)

Cyber Police Recovered RS 18 Lakhs in 11 Minutes at Hyderabad : సైబర్​ చీటర్స్​ వలలో నుంచి ఓ టెకీని సైబర్​ క్రైం పోలీసులు కాపాడారు. కేవలం 11 నిమిషాల వ్యవధిలోని రూ.18 లక్షల నగదును సైబర్​ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో తిరిగి పొందగలిగాడు. లేకపోతే సైబర్​ నేరగాళ్ల చేతిలో మోసపోయేవాడు. ఈ సంఘటన హైదరాబాద్​లో జరిగింది. ఇక నుంచి ఇలాంటి కాల్స్​ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజానికానికి తెలియజేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే అంబర్​ పేట్​ ప్రాంతంలో నివాసం ఉండే ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి ఈనెల 27న ఫెడెక్స్​ కంపెనీ నుంచి ఓ కాల్​ వచ్చింది. కాల్​లో తన ఆధార్​ కార్డు ఉపయోగించి ముంబయి నుంచి ఇరాన్​కు డ్రగ్స్​ కొరియర్​ అవుతున్నట్లు తెలిపారు. అనంతరం ముంబయి క్రైమ్ అధికారి అంటూ బాధితుడుకు స్కైప్​ వీడియో కాల్​ చేశారు. అక్రమంగా డ్రగ్స్​ సరఫరా అవుతున్నాయని అతనిపై కేసు నమోదు అయిందని నకిలీ ఎఫ్​ఐఆర్​ను పంపించారు.

అలాగే అతని అకౌంట్​లో ఉన్న డబ్బును పంపిస్తే ఆర్​బీఐ నిబంధనల ప్రకారం వేరిఫై చేసి తిరిగి పంపిస్తామని సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని నమ్మించారు. అందుకు సంబంధించిన నకిలీ ఆర్​బీఐ నోటీసును పంపించారు. వాటిని నమ్మిన బాధితుడు తన అకౌంట్​లో డబ్బులు లేవని తనకు కొంత సమయం కావాలని అడిగాడు. సైబర్​ చీటర్స్​ సమయం ఇవ్వమని, నీ అకౌంట్​ నుంచి పర్సనల్​ లోన్​ తీసుకొని తమకు డబ్బులు పంపించాలని ఒత్తిడి చేశారు. వారి మాటలు నమ్మి బ్యాంకు నుంచి రూ.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. సైబర్​ నేరగాళ్ల అకౌంట్​కు ట్రాన్​ఫర్​ చేశాడు. ఆ డబ్బును సైబర్​ నేరగాళ్ల ఖాతాకు పంపిన తర్వాత వారు కాల్​ను కట్​ చేశారు.

11 నిమిషాల్లోనే నగదు రికవరీ : వెంటనే ఎన్నిసార్లు ఫోన్​ చేసిన స్విచ్ఛాప్​ రావడంతో బాధితుడు తాను సైబర్​ దాడిలో మోసపోయాయని తెలుసుకొని వెంటనే సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించాడు. అదే రోజు సాయంత్రం 6.58 గంటలకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్​ శ్రీకాంత్​ నాయక్​ ఎన్​సీఆర్​పీ పోర్టల్​లో ఆన్​లైన్​లో ఫిర్యాదు నమోదు చేశారు. వెంటనే ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బందితో మాట్లాడారు. బాధితుడి అకౌంట్​ నుంచి ట్రాన్స్​ఫర్​ అయిన రూ.18 లక్షల నగదును రాత్రి 07.09 గంటలకు బ్లాక్​ చేశారు. దీంతో బాధితుడు ఊపిరి పీల్చుకుని తన నగదు ఖాతాలో జమ అవుతాయన్న ఆనందంలో మునిగిపోయాడు. ఈ ఆపరేషన్​ మొత్తం 11 నిమిషాల వ్యవధిలోనే సక్సెస్​ అయింది. దీనిలో ముఖ్య పాత్ర వహించిన కానిస్టేబుల్​ శ్రీకాంత్​ నాయక్​ను సైబర్​ క్రైమ్​ డీసీపీ కవిత అభినందించారు.

లోన్ యాప్స్ పేరిట మోసం.. రూ.300 కోట్లు స్వాహా.. నిందితులంతా చైనీయులే!

నీ భర్తను అరెస్ట్ చేశాం డబ్బు ఇస్తే వదిలేస్తామంటూ ఫేక్ సీబీఐ కాల్ - మహిళ రియాక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే!! - FAKE CBI VIDEO CALL IN HYDERABAD

Cyber Police Recovered RS 18 Lakhs in 11 Minutes at Hyderabad : సైబర్​ చీటర్స్​ వలలో నుంచి ఓ టెకీని సైబర్​ క్రైం పోలీసులు కాపాడారు. కేవలం 11 నిమిషాల వ్యవధిలోని రూ.18 లక్షల నగదును సైబర్​ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో తిరిగి పొందగలిగాడు. లేకపోతే సైబర్​ నేరగాళ్ల చేతిలో మోసపోయేవాడు. ఈ సంఘటన హైదరాబాద్​లో జరిగింది. ఇక నుంచి ఇలాంటి కాల్స్​ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజానికానికి తెలియజేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే అంబర్​ పేట్​ ప్రాంతంలో నివాసం ఉండే ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి ఈనెల 27న ఫెడెక్స్​ కంపెనీ నుంచి ఓ కాల్​ వచ్చింది. కాల్​లో తన ఆధార్​ కార్డు ఉపయోగించి ముంబయి నుంచి ఇరాన్​కు డ్రగ్స్​ కొరియర్​ అవుతున్నట్లు తెలిపారు. అనంతరం ముంబయి క్రైమ్ అధికారి అంటూ బాధితుడుకు స్కైప్​ వీడియో కాల్​ చేశారు. అక్రమంగా డ్రగ్స్​ సరఫరా అవుతున్నాయని అతనిపై కేసు నమోదు అయిందని నకిలీ ఎఫ్​ఐఆర్​ను పంపించారు.

అలాగే అతని అకౌంట్​లో ఉన్న డబ్బును పంపిస్తే ఆర్​బీఐ నిబంధనల ప్రకారం వేరిఫై చేసి తిరిగి పంపిస్తామని సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని నమ్మించారు. అందుకు సంబంధించిన నకిలీ ఆర్​బీఐ నోటీసును పంపించారు. వాటిని నమ్మిన బాధితుడు తన అకౌంట్​లో డబ్బులు లేవని తనకు కొంత సమయం కావాలని అడిగాడు. సైబర్​ చీటర్స్​ సమయం ఇవ్వమని, నీ అకౌంట్​ నుంచి పర్సనల్​ లోన్​ తీసుకొని తమకు డబ్బులు పంపించాలని ఒత్తిడి చేశారు. వారి మాటలు నమ్మి బ్యాంకు నుంచి రూ.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. సైబర్​ నేరగాళ్ల అకౌంట్​కు ట్రాన్​ఫర్​ చేశాడు. ఆ డబ్బును సైబర్​ నేరగాళ్ల ఖాతాకు పంపిన తర్వాత వారు కాల్​ను కట్​ చేశారు.

11 నిమిషాల్లోనే నగదు రికవరీ : వెంటనే ఎన్నిసార్లు ఫోన్​ చేసిన స్విచ్ఛాప్​ రావడంతో బాధితుడు తాను సైబర్​ దాడిలో మోసపోయాయని తెలుసుకొని వెంటనే సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించాడు. అదే రోజు సాయంత్రం 6.58 గంటలకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్​ శ్రీకాంత్​ నాయక్​ ఎన్​సీఆర్​పీ పోర్టల్​లో ఆన్​లైన్​లో ఫిర్యాదు నమోదు చేశారు. వెంటనే ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బందితో మాట్లాడారు. బాధితుడి అకౌంట్​ నుంచి ట్రాన్స్​ఫర్​ అయిన రూ.18 లక్షల నగదును రాత్రి 07.09 గంటలకు బ్లాక్​ చేశారు. దీంతో బాధితుడు ఊపిరి పీల్చుకుని తన నగదు ఖాతాలో జమ అవుతాయన్న ఆనందంలో మునిగిపోయాడు. ఈ ఆపరేషన్​ మొత్తం 11 నిమిషాల వ్యవధిలోనే సక్సెస్​ అయింది. దీనిలో ముఖ్య పాత్ర వహించిన కానిస్టేబుల్​ శ్రీకాంత్​ నాయక్​ను సైబర్​ క్రైమ్​ డీసీపీ కవిత అభినందించారు.

లోన్ యాప్స్ పేరిట మోసం.. రూ.300 కోట్లు స్వాహా.. నిందితులంతా చైనీయులే!

నీ భర్తను అరెస్ట్ చేశాం డబ్బు ఇస్తే వదిలేస్తామంటూ ఫేక్ సీబీఐ కాల్ - మహిళ రియాక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే!! - FAKE CBI VIDEO CALL IN HYDERABAD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.