ETV Bharat / state

'ఇకపై అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ కీలక సూచన - Anti Drugs and Cyber Safety

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 3:30 PM IST

Updated : Jul 2, 2024, 3:52 PM IST

CM Revanth on Anti Drugs and Cyber Safety : సినీ చిత్రీకరణ అనుమతులు, టికెట్​ రేట్ల పెంపునకు అనుమతి అంటూ వచ్చే వారికి సీఎం రేవంత్​ రెడ్డి ఓ షరతు పెట్టారు. తప్పనిసరిగా సినిమా హాలులో రెండు నిమిషాల డ్రగ్స్​, సైబర్​ నేరాల అవగాహనపై ఫ్రీగా వీడియో ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఉన్న కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో పోలీసుల ప్రత్యేక వాహనాలను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు.

CM Revanth on Anti Drugs and Cyber Safety
CM Revanth on Anti Drugs and Cyber Safety (ETV Bharat)

CM Revanth Reddy Goal is a Drug Free Telangana : డ్రగ్స్​ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని మెగాస్టార్​ చిరంజీవి పిలుపునిచ్చారు. డ్రగ్స్​ రహిత తెలంగాణపై తన వంతు బాధ్యతగా చిరంజీవి ఇటీవల ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోపై సీఎం రేవంత్​ రెడ్డి తాజాగా స్పందించారు. డ్రగ్స్​పై పోరాడుతున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఉన్న కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో పోలీసుల ప్రత్యేక వాహనాలను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్​, సైబర్​ క్రైమ్​పై సినీ పరిశ్రమ యువతకు అవగాహన కల్పించట్లేదని పేర్కొన్నారు. టికెట్​ ధరల పెంపు, సినిమా చిత్రీకరణ అనుమతుల కోసం వచ్చే వారికి ముందస్తు షరతులు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్​, సైబర్​ నేరాలపై అవగాహన వీడియో చిత్రీకరించాలని సూచించారు. ఇలా రెండు నిమిషాల పాటు వీడియో చిత్రీకరించి ఇవ్వాలన్నారు. ఈ విధంగా సినిమా హాల్​లో సైబర్​ నేరాలు, డ్రగ్స్​పై అవగాహన వీడియోలు ఫ్రీగా ప్రదర్శించాలని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. ఈ విషయంపై త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాలను సినీ పెద్దలకు వివరిస్తామని పేర్కొన్నారు. టీవీలో కూడా డ్రగ్స్​, సైబర్​ నేరాలపై అవగాహన చిత్రాలు ప్రదర్శించాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు.

అధికారుల్లో నైపుణ్యంతో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపడం తమ బాధ్యత అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. పోలీసులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించడం ప్రభుత్వ బాధ్యతనని వివరించారు. చదువుకున్న వారు కూడా సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని ఆవేదన చెందారు. సైబర్​ నేరాళ ఫిర్యాదుకు 1930 టోల్​ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశామని అన్నారు. నేరగాళ్ల నుంచి సైబర్​ క్రైమ్​ పోలీసులు రూ.31 కోట్లు రాబట్టారని తెలిపారు. కొత్త నేర న్యాయ చట్టాలపై కూడా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు.

గంజాయికి బానిస అవుతున్న విద్యార్థులు : హత్య, అత్యాచారం కన్నా ఈ కాలంలో సైబర్​ నేరాలే పెద్దవని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. హత్య చేస్తే ఒకరో, ఇద్దరో చనిపోతారని, సైబర్​ మోసంలో చాలా మంది బాధితులు అని పేర్కొన్నారు. మధ్యతరగతి, పేదలే సైబర్​ నేరాలకు గురవుతున్నారని ఆందోళన చెందారు. విద్యార్థులు ఎక్కువగా గంజాయికి బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థత ప్రదర్శించి అధికారులకు పదోన్నతులు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డ్రగ్స్​, సైబర్​ నేరాలు అని చెప్పారు. డ్రగ్స్​ నేరగాళ్లు తెలంగాణ నేలపై అడుగు పెట్టాలంటే భయపడాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి సమావేశంలో తెలిపారు.

మార్పు మన ప్రభుత్వ బాధ్యత : అంతకు ముందు కమాండ్​ కంట్రోల్​ సెంటర్​కు వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డి, నార్కోటిక్​ బ్యూరో ఫొటో ఎగ్జిబిషన్​ను తిలకరించారు. వాల్​బోర్డుపై మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్​ రెడ్డి రాశారు. పోలీసుల ప్రత్యేక వాహనాలను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. టీజీ న్యాబ్​, సైబర్​ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ప్రారంభించారు. యాంటీ నార్కోటిక్​ బ్యూరో కోసం 27 కార్లు, 40 ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. అలాగే సైబర్​ సెక్యూరిటీ బ్యూరో కోసం 14 కార్లు, 30 ద్విచక్ర వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా - టీఎస్‌ న్యాబ్‌ బలోపేతానికి అధికారుల ప్రణాళిక

రాష్ట్రంలో డ్రగ్స్​ పదం వింటేనే భయపడేలా చర్యలు ఉండాలి : సీఎం రేవంత్ - CM Revanth Visits Command Center

CM Revanth Reddy Goal is a Drug Free Telangana : డ్రగ్స్​ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని మెగాస్టార్​ చిరంజీవి పిలుపునిచ్చారు. డ్రగ్స్​ రహిత తెలంగాణపై తన వంతు బాధ్యతగా చిరంజీవి ఇటీవల ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోపై సీఎం రేవంత్​ రెడ్డి తాజాగా స్పందించారు. డ్రగ్స్​పై పోరాడుతున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఉన్న కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో పోలీసుల ప్రత్యేక వాహనాలను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్​, సైబర్​ క్రైమ్​పై సినీ పరిశ్రమ యువతకు అవగాహన కల్పించట్లేదని పేర్కొన్నారు. టికెట్​ ధరల పెంపు, సినిమా చిత్రీకరణ అనుమతుల కోసం వచ్చే వారికి ముందస్తు షరతులు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్​, సైబర్​ నేరాలపై అవగాహన వీడియో చిత్రీకరించాలని సూచించారు. ఇలా రెండు నిమిషాల పాటు వీడియో చిత్రీకరించి ఇవ్వాలన్నారు. ఈ విధంగా సినిమా హాల్​లో సైబర్​ నేరాలు, డ్రగ్స్​పై అవగాహన వీడియోలు ఫ్రీగా ప్రదర్శించాలని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. ఈ విషయంపై త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాలను సినీ పెద్దలకు వివరిస్తామని పేర్కొన్నారు. టీవీలో కూడా డ్రగ్స్​, సైబర్​ నేరాలపై అవగాహన చిత్రాలు ప్రదర్శించాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు.

అధికారుల్లో నైపుణ్యంతో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపడం తమ బాధ్యత అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. పోలీసులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించడం ప్రభుత్వ బాధ్యతనని వివరించారు. చదువుకున్న వారు కూడా సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని ఆవేదన చెందారు. సైబర్​ నేరాళ ఫిర్యాదుకు 1930 టోల్​ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశామని అన్నారు. నేరగాళ్ల నుంచి సైబర్​ క్రైమ్​ పోలీసులు రూ.31 కోట్లు రాబట్టారని తెలిపారు. కొత్త నేర న్యాయ చట్టాలపై కూడా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు.

గంజాయికి బానిస అవుతున్న విద్యార్థులు : హత్య, అత్యాచారం కన్నా ఈ కాలంలో సైబర్​ నేరాలే పెద్దవని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. హత్య చేస్తే ఒకరో, ఇద్దరో చనిపోతారని, సైబర్​ మోసంలో చాలా మంది బాధితులు అని పేర్కొన్నారు. మధ్యతరగతి, పేదలే సైబర్​ నేరాలకు గురవుతున్నారని ఆందోళన చెందారు. విద్యార్థులు ఎక్కువగా గంజాయికి బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థత ప్రదర్శించి అధికారులకు పదోన్నతులు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డ్రగ్స్​, సైబర్​ నేరాలు అని చెప్పారు. డ్రగ్స్​ నేరగాళ్లు తెలంగాణ నేలపై అడుగు పెట్టాలంటే భయపడాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి సమావేశంలో తెలిపారు.

మార్పు మన ప్రభుత్వ బాధ్యత : అంతకు ముందు కమాండ్​ కంట్రోల్​ సెంటర్​కు వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డి, నార్కోటిక్​ బ్యూరో ఫొటో ఎగ్జిబిషన్​ను తిలకరించారు. వాల్​బోర్డుపై మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్​ రెడ్డి రాశారు. పోలీసుల ప్రత్యేక వాహనాలను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. టీజీ న్యాబ్​, సైబర్​ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ప్రారంభించారు. యాంటీ నార్కోటిక్​ బ్యూరో కోసం 27 కార్లు, 40 ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. అలాగే సైబర్​ సెక్యూరిటీ బ్యూరో కోసం 14 కార్లు, 30 ద్విచక్ర వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా - టీఎస్‌ న్యాబ్‌ బలోపేతానికి అధికారుల ప్రణాళిక

రాష్ట్రంలో డ్రగ్స్​ పదం వింటేనే భయపడేలా చర్యలు ఉండాలి : సీఎం రేవంత్ - CM Revanth Visits Command Center

Last Updated : Jul 2, 2024, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.