ETV Bharat / state

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - ఈ ఏడాది చివరి వరకు మరో 35 వేల ఉద్యోగాలు - CM REVANTH PROMISES 35000 NEW JOBS

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 5:29 PM IST

Updated : Sep 15, 2024, 6:09 PM IST

CM Revanth On Job Notifications 2024: కాంగ్రెస్‌ మాట ఇస్తే, తప్పక జరిగి తీరుతుందని నిరూపించామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించామని పునరుద్ఘాటించారు. ముందుగా తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందలు తెలిపారు.

CM Revanth Slams On Harish Rao Over Runamafi Issue
CM Revanth On Congress Assurances (ETV Bharat)

CM Revanth Reddy On Congress Assurances : ప్రభుత్వం, పార్టీ జోడెద్దులుగా సాగాలనే ఉద్దేశంతో అధిష్ఠానం బలహీన వర్గాలకు చెందిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షునిగా ఎంపిక చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నూతన పీసీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని జనంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ బాధ్యతల స్వీకరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, కాంగ్రెస్ హామీలపై స్పష్టమైన ప్రకటనలు చేశారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టులోపే రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ రుణం రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులు భయపడొద్దని, అందరికి న్యాయం చేస్తామని తెలిపారు. రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్న హరీశ్‌రావు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. ఇప్పటికే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న రేవంత్‌రెడ్డి, ఈ ఏడాది చివరి నాటికి మరో 35వేల ఉద్యోగ ప్రకటనలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఏడాదిలోనే 65వేల నింపిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.

"రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్​ ఎన్నికల్లో ఓ పార్టీ నేత రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. ఆనాడే దైవం సాక్షిగా చెప్పినా, పంద్రాగస్ట్​ లోపల రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని మాట ఇచ్చాను. పార్లమెంట్​లో 42 శాతం ఓట్లు, 8 ఎంపీ సీట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి 23 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. ఇప్పడు రాజీనామా చేస్తానన్న ఆ వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడు."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

Revanth Fires On BRS Party : కాంగ్రెస్‌ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అరెకపూడిగాంధీ, కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై పరోక్షంగా స్పందించిన రేవంత్‌, మా ఇంటికి వస్తామని బెదిరిస్తే, మావారే వెళ్లి వారి పనిపట్టారన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ సౌమ్యుడు అని ఎవరైనా తోకజాడిస్తే, ఆయన వెనుక నేనున్నానన్న విషయం మరచిపోవద్దని స్పష్టం చేశారు.

రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసినప్పుడే ఫైనల్స్‌లో విన్​ : ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, విజయాలు సెమీఫైనల్స్‌ మాత్రమేనని రేవంత్‌ స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసినప్పుడే మనం ఫైనల్స్‌లో విజయం సాధించినట్లు అప్పటివరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. 1994 నుంచి రాష్ట్రంలో ప్రతిపార్టీ రెండుసార్లు చొప్పున గెలిచిందని, కాంగ్రెస్‌ కూడా కచ్చితంగా వరసగా రెండుసార్లు అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంపద సృష్టిస్తున్నాం- ప్రజలకు పంచుతున్నాం : కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరికి సముచిత పదవులు, ప్రాధాన్యం ఇచ్చి గౌరవిస్తుందని ఇందుకు పీసీసీ అధ్యక్షునిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ నియామకమే నిదర్శమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే హామీలు అమలు ప్రారంభించామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా రూ.400 కోట్లు చెల్లిస్తున్నామన్న భట్టి, ఒకే విడతలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు.

ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నామన్న డిప్యూటీ సీఎం, మళ్లీ ప్రజలకు పంచుతున్నామని వివరించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు ఎంతో కీలకమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్​ మున్షీ అన్నారు. త్వరలో జరిగే స్థానికసంస్థల ఎన్నికలు పార్టీకి, నేతలకు సవాలు వంటివని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ రాజకీయాలపై పోరాడాలని అందరం సంకల్పం తీసుకుందామన్న ఆమె, పార్టీ క్రమశిక్షణ విషయంలో తాను కఠినంగానే ఉంటానని స్పష్టం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్ గౌడ్ - TPCC NEW CHIEF TAKES CHARGE TODAY

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ - ఈ అంశాలపై చర్చ! - Cabinet meet chaired by CM Revanth

CM Revanth Reddy On Congress Assurances : ప్రభుత్వం, పార్టీ జోడెద్దులుగా సాగాలనే ఉద్దేశంతో అధిష్ఠానం బలహీన వర్గాలకు చెందిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షునిగా ఎంపిక చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నూతన పీసీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని జనంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ బాధ్యతల స్వీకరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, కాంగ్రెస్ హామీలపై స్పష్టమైన ప్రకటనలు చేశారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టులోపే రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ రుణం రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులు భయపడొద్దని, అందరికి న్యాయం చేస్తామని తెలిపారు. రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్న హరీశ్‌రావు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. ఇప్పటికే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న రేవంత్‌రెడ్డి, ఈ ఏడాది చివరి నాటికి మరో 35వేల ఉద్యోగ ప్రకటనలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఏడాదిలోనే 65వేల నింపిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.

"రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్​ ఎన్నికల్లో ఓ పార్టీ నేత రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. ఆనాడే దైవం సాక్షిగా చెప్పినా, పంద్రాగస్ట్​ లోపల రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని మాట ఇచ్చాను. పార్లమెంట్​లో 42 శాతం ఓట్లు, 8 ఎంపీ సీట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి 23 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. ఇప్పడు రాజీనామా చేస్తానన్న ఆ వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడు."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

Revanth Fires On BRS Party : కాంగ్రెస్‌ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అరెకపూడిగాంధీ, కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై పరోక్షంగా స్పందించిన రేవంత్‌, మా ఇంటికి వస్తామని బెదిరిస్తే, మావారే వెళ్లి వారి పనిపట్టారన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ సౌమ్యుడు అని ఎవరైనా తోకజాడిస్తే, ఆయన వెనుక నేనున్నానన్న విషయం మరచిపోవద్దని స్పష్టం చేశారు.

రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసినప్పుడే ఫైనల్స్‌లో విన్​ : ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, విజయాలు సెమీఫైనల్స్‌ మాత్రమేనని రేవంత్‌ స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసినప్పుడే మనం ఫైనల్స్‌లో విజయం సాధించినట్లు అప్పటివరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. 1994 నుంచి రాష్ట్రంలో ప్రతిపార్టీ రెండుసార్లు చొప్పున గెలిచిందని, కాంగ్రెస్‌ కూడా కచ్చితంగా వరసగా రెండుసార్లు అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంపద సృష్టిస్తున్నాం- ప్రజలకు పంచుతున్నాం : కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరికి సముచిత పదవులు, ప్రాధాన్యం ఇచ్చి గౌరవిస్తుందని ఇందుకు పీసీసీ అధ్యక్షునిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ నియామకమే నిదర్శమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే హామీలు అమలు ప్రారంభించామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా రూ.400 కోట్లు చెల్లిస్తున్నామన్న భట్టి, ఒకే విడతలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు.

ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నామన్న డిప్యూటీ సీఎం, మళ్లీ ప్రజలకు పంచుతున్నామని వివరించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు ఎంతో కీలకమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్​ మున్షీ అన్నారు. త్వరలో జరిగే స్థానికసంస్థల ఎన్నికలు పార్టీకి, నేతలకు సవాలు వంటివని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ రాజకీయాలపై పోరాడాలని అందరం సంకల్పం తీసుకుందామన్న ఆమె, పార్టీ క్రమశిక్షణ విషయంలో తాను కఠినంగానే ఉంటానని స్పష్టం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్ గౌడ్ - TPCC NEW CHIEF TAKES CHARGE TODAY

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ - ఈ అంశాలపై చర్చ! - Cabinet meet chaired by CM Revanth

Last Updated : Sep 15, 2024, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.