ETV Bharat / state

ఖైరతాబాద్​ సప్తముఖ మహాశక్తి గణపతికి సీఎం రేవంత్​ తొలి పూజ - దర్శననానికి పోటెత్తిన భక్తులు - Khairatabad Ganesh first puja

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 12:39 PM IST

Updated : Sep 7, 2024, 1:35 PM IST

Khairatabad Ganesh : రాష్ట్రంలో వినాయక చవితి సంబురాలు మొదలయ్యాయి. ఖైరతాబాద్​లో గణేశుని విగ్రహం ప్రతిష్ఠించారు. లంబోదరుడికి సీఎం రేవంత్​ రెడ్డి తొలి పూజ చేశారు. ఖైరతాబాద్​లోని సప్తముఖ మహాశక్తి గణపతిని చూడడానికి భక్తులు పోటెత్తారు.

Khairatabad Ganesh
Khairatabad Ganesh (ETV Bharat)

CM Revanth Performed First Puja in Khairatabad Ganesh : ప్రతి ఏటా ఖైరతాబాద్​లో వినాయక చవితికి విగ్రహం ప్రతిష్ఠించి వేడుకలు చేయడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి నేటితో 70 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి గణపతిని ప్రతిష్ఠించారు. ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సీఎం రేవంత్​ రెడ్డి వినాయకుడిని దర్శించుకొని తొలి పూజ చేశారు. ఖైరతాబాద్​ గణేశుడి ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్​ మండపం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

తొలి పూజ అనంతరం సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, 'ఈ ఉత్సవాలు జరిపించడానికి ప్రభుత్వం సహకారం అందించాం. గణేశ్​ ఉత్సవాలకు ఉచిత విద్యుత్​ కూడా అందించాం. ఈ ఏడాదిలో అత్యధికంగా వర్షాలు కురిశాయి. దేవుడి దయతో వరదల వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. గణేశ్​ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు. గతేడాది పార్టీ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను.' అని తెలిపారు.

దేశానికే ఆదర్శం ఖైరతాబాద్​ గణేశ్​ ఉత్సవాలు : దేశంలోనే అత్యంత గొప్పగా గత 70 ఏళ్లుగా గణేశ్​ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ఖైరతాబాద్​ ఉత్సవ కమిటీని కొనియాడారు. ఖైరతాబాద్​ గణేశ్​ ఉత్సవాలను నిర్వహించడంలో పేరు గాంచింది. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రభుత్వం వినాయకుడి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అన్ని రకాలుగా రాష్టంలో 1.40 లక్షల విగ్రహాలను నెలకొల్పారు. ఖైరతాబాద్​ గణేశ్​ నిర్వహణ ఆదర్శంగా నిలబడిందని సీఎం రేవంత్​ తెలిపారు.

"ఈ ఉత్సవాలు జరిపించడానికి ప్రభుత్వం సహకారం అందించాం. గణేశ్​ ఉత్సవాలకు ఉచిత విద్యుత్​ కూడా అందించాం. ఈ ఏడాదిలో అత్యధికంగా వర్షాలు కురిశాయి. దేవుడి దయతో వరదల వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. గణేశ్​ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు. గతేడాది పార్టీ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను." - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

మట్టిగణపయ్యకే ఆసక్తి చూపుతున్న యువత - మొదలైన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందడి - Demand for Clay Ganesh Idols

మట్టి గణనాథుడే ప్రకృతికి మంగళకరం - భవిష్యత్తుకు శ్రేయస్కరం - use clay idols save nature

CM Revanth Performed First Puja in Khairatabad Ganesh : ప్రతి ఏటా ఖైరతాబాద్​లో వినాయక చవితికి విగ్రహం ప్రతిష్ఠించి వేడుకలు చేయడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి నేటితో 70 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి గణపతిని ప్రతిష్ఠించారు. ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సీఎం రేవంత్​ రెడ్డి వినాయకుడిని దర్శించుకొని తొలి పూజ చేశారు. ఖైరతాబాద్​ గణేశుడి ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్​ మండపం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

తొలి పూజ అనంతరం సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, 'ఈ ఉత్సవాలు జరిపించడానికి ప్రభుత్వం సహకారం అందించాం. గణేశ్​ ఉత్సవాలకు ఉచిత విద్యుత్​ కూడా అందించాం. ఈ ఏడాదిలో అత్యధికంగా వర్షాలు కురిశాయి. దేవుడి దయతో వరదల వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. గణేశ్​ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు. గతేడాది పార్టీ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను.' అని తెలిపారు.

దేశానికే ఆదర్శం ఖైరతాబాద్​ గణేశ్​ ఉత్సవాలు : దేశంలోనే అత్యంత గొప్పగా గత 70 ఏళ్లుగా గణేశ్​ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ఖైరతాబాద్​ ఉత్సవ కమిటీని కొనియాడారు. ఖైరతాబాద్​ గణేశ్​ ఉత్సవాలను నిర్వహించడంలో పేరు గాంచింది. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రభుత్వం వినాయకుడి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అన్ని రకాలుగా రాష్టంలో 1.40 లక్షల విగ్రహాలను నెలకొల్పారు. ఖైరతాబాద్​ గణేశ్​ నిర్వహణ ఆదర్శంగా నిలబడిందని సీఎం రేవంత్​ తెలిపారు.

"ఈ ఉత్సవాలు జరిపించడానికి ప్రభుత్వం సహకారం అందించాం. గణేశ్​ ఉత్సవాలకు ఉచిత విద్యుత్​ కూడా అందించాం. ఈ ఏడాదిలో అత్యధికంగా వర్షాలు కురిశాయి. దేవుడి దయతో వరదల వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. గణేశ్​ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు. గతేడాది పార్టీ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను." - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

మట్టిగణపయ్యకే ఆసక్తి చూపుతున్న యువత - మొదలైన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందడి - Demand for Clay Ganesh Idols

మట్టి గణనాథుడే ప్రకృతికి మంగళకరం - భవిష్యత్తుకు శ్రేయస్కరం - use clay idols save nature

Last Updated : Sep 7, 2024, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.